కాంగ్రెసేతర పార్టీలతో జగన్ నెయ్యమా? దేనికి

Publish Date:Nov 9, 2013

Advertisement

 

జగన్మోహన్ రెడ్డి ద్వారా తేదేపాకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అయితే మడమ తిప్పే వంశం కాదంటూనే అనేక ‘యూ టర్నులు’ తీసుకొన్నఅతను ఇప్పుడు అకస్మాత్తుగా దేశాటనకి బయలుదేరి కాంగ్రెసేతర పార్టీలను, ప్రభుత్వాల మద్దతు కూడా గట్టాలని అనుకోవడం చూస్తే అందరికీ స్పాట్ పెట్టే కాంగ్రెస్ పార్టీకే అతను స్పాట్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాడా? అనే అనుమానం కలుగుతుంది.

 

అయితే అతనిని ఏ పనికోసం బెయిలిచ్చి బయటకి రప్పించిందో ఆపని చేయకుండా తన ప్రత్యర్ధులను కూడగట్టే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకొంటుందని అనుకోవడం అమాయకత్వమే. అతని వల్ల తనకు ప్రమాదం ఉందని గ్రహించిన మరుక్షణం లోటస్ పాండ్ మీద సీబీఐ, ఈడీ చిలుకలు వాలిపోతాయని చెప్పడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అటువంటి పొరపాటు పని ఎన్నడు చేయడు. ఒకవేళ అతని రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నట్లుగా కాక, అతనికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి రహస్య ఒప్పందం, అనుబంధం లేదని అనుకొన్నపటికీ, కాంగ్రెస్ పార్టీతో పెట్టుకొంటే ఏమవుతుందో అనుభవ పూర్వకంగా తెలుసుకొన్న అతను మళ్ళీ మరో మారు అటువంటి దుస్సాహసం చేయడని గట్టిగా చెప్పవచ్చును.

 

అందువల్ల అతను తన సమైక్య చాంపియన్ షిప్ ట్రోఫీని భద్రంగా కాపాడుకొంటూనే, మరో వైపు రాష్ట్ర విభజన సజావుగా జరిగేందుకు వీలుగా అతను ఈ ఉపాయం ఎంచుకొని ఉండవచ్చును. తద్వారా తను రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు చేయని ప్రయత్నమంటూ లేదని చెప్పుకొనే అవకాశం, పనిలో పనిగా తను కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధిననే భావన ప్రజలలో కలిగించవచ్చు. అంతేకాక సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా నేతలు కాంగ్రెస్ అధిష్టానంతో అతనికి రహస్య ఒప్పందం ఉందని చేస్తున్న ఆరోపణలు నిజం కాదని చాటుకొన్నట్లు అవుతుంది కూడా.

By
en-us Political News

  
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.