పార్టీపై జగన్ పట్టు జావగారిందా.. గడప గడపకూకు నేతల డుమ్మా అందుకేనా?

Publish Date:May 19, 2022

Advertisement

పార్టీపై పార్టీ నేతలపై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై జగన్ పట్టు జావగారిందన్న మాటలు వైసీపీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మాయే ఇందుకు నిదర్శనమని వారే అంటున్నారు. సీఎం మాట ఇంతకు ముందులా శిలాశాసనంలా చెల్లుబాటు కావడం లేదని చెబుతున్నారు. మూడేళ్ల పాలన విజయాలను ప్రజలలో ప్రచారం చేసుకునేందుకు జగన్ చేపట్టిన గడప గడపకూ కార్యక్రమం  ఒక్క సారిగా వైసీపీ బలహీనతలూ, జగన్ ప్రభుత్వ వైఫల్యాలనూ బట్టబయలు చేసేసింది. ఇప్పటి వరకూ జగన్ గుప్పిట మూసి ఉంచి.. పార్టీలో తానకు తిరుగే లేదనీ,తన మాటను ధిక్కరించే ధైర్యం ఎవరికీ లేదని ఇచ్చిన బిల్డప్ గడప గడపకూ కార్యక్రమంలో పటాపంచలైపోయింది.

జనంలో వైసీపీ, జగన్ సర్కార్ విశ్వసనీయత కోల్పోయాయనడానికి గడప గడపకూ కార్యక్రమానికి ఎదురైన ప్రజా వ్యతిరేకతే తార్కానమని పరిశీలకులు అంటున్నారు.  గడప గడపకూ  మంత్రులు, ఎమ్మెల్యేలను వెళ్లి జనానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని జగన్ ఆదేశించడంతో ప్రభుత్వ వైఫల్యాలపై జనం ఆగ్రహ జ్వాలలు వైసీపీ నేతలకు చమట్లు పట్టించాయి. మూడేళ్ళుగా ఎమ్మెల్యేలు, మంత్రులను డమ్మీలను చేసి వాలంటీర్లకే పెత్తనం అంతా అప్పగించిన ఫలం ఇప్పుడు గడప గడపకూ కార్యక్రమంలో ప్రజాగ్రహ రూపంలో ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నది.  ఇదే గడప గడపకూ కార్యక్రమం జగన్ కు పార్టీ నేతలపై పట్టు సడలిందన్నవిషయాన్ని కూడా తేటతెల్లం చేసింది. గడప గడపకూ తొలి రోజు వైఫల్యం తరువాత జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలకు విస్పష్ట ఆదేశాలిచ్చినా కూడా వారు ఖాతరు చేయలేదు. అక్కడక్కడా మమ అన్నట్లుగా మాత్రమే ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

సీఎం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ఎక్కడికక్కడ ప్రజాగ్రహంతో నిలిచిపోయింది. పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, ఇతర ముఖ్య నేతలూ అసలీ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. అక్కడక్కడా వెళ్లిన వారికి ప్రజా నిరసనలు ఎదురై వెనుదిరిగేలా చేస్తున్నాయి.  రోడ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు,రేషన్, అమ్మఒడి తదితర సమస్యలపై జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. గడప గడపకూ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు డుమ్మా కొడుతుండటంతో ప్రభుత్వ అధికారులు, వలంటీర్లు హాజరై మమ అనిపించేస్తున్నారు. అసలు గడప గడపకూ వైసీపీ పేర ఈ కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే  పలువురు ప్రజా ప్రతినిథులు కోరడంతో దానిని వాయిదాల మీద వాయిదా వేస్తూ వచ్చారు. ఎలాగోలా ఈ నెలలో కార్యక్రమం పేరును గడప గడపకూ మన ప్రభుత్వం పేర చేపట్టి అధికారులను కవచంగా చేసుకుని మమ అనిపిద్దామని జగన్  చేసిన ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడప గడపకూ వెళ్లి ప్రజాదరణ పొందితే తప్ప మళ్లీ అధికారంలోనికి రాలేమని.. ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు కాలేరని జగన్  హెచ్చరిస్తున్నా  ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదు. 

గురువారం కోనసీమలో గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు ఎదురైన అనుభవం మరెవరూ ఇక ఈ కార్యక్రమం జోలికి వేళ్లే ధైర్యం చేయకుండా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజల ప్రశ్నాస్త్రా తట్టుకోలేక తప్పించుకు వెళుతున్న ఎమ్మెల్యేలను వెంబడించి మరీ జనం నిలదీస్తున్నారు. పథకాల అమలులో లొసుగులు, అభివృద్ధి జాడే లేని పాలనపై జనాగ్రహం ఉవ్వెత్తున లేస్తుంటే ప్రజా ప్రతినిధులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ప్రశ్నిస్తున్న ప్రజలను నియంత్రించేందుకు పోలీసులను రంగంలోకి దింపి ప్రజా ప్రతినిథులు జారుకుంటున్న పరిస్థితి కోనసీమ వ్యాప్తంగా కనిపించింది.

  ఆఖరికి  రైతు భరోసా కార్యక్రమానికి కూడా పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారంటే జగన్ ఆదేశాలకు  గతంలోలా పార్టీలో ఖాతరీ లేదని తేటతెల్లమౌతోంది. లబ్ధిదారుల ఎంపికలో తమ మాటకు విలువ లేనప్పుడు పాల్గొని ప్రయోజనం ఏమిటని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.  అనంతపురం జిల్లాలో రైతు భరోసా కార్యక్రమానికి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.   చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆర్‌కే రోజా హాజరు కాలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి హాజరైనా  సమావేశాన్ని త్వరగా ముగించేసి మమ అనిపించారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాత్రమే హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో పాలకపక్ష ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదు.

కాకినాడ జిల్లా కేంద్రం బదులు పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దొరబాబు మాత్రమే వచ్చారు. మంత్రి దాడిశెట్టి రాజా, ఇతర ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.   శ్రీసత్యసాయి జిల్లాలో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి తప్ప మిగిలినవారెవరూ రాలేదు. వైఎ్‌సఆర్‌ జిల్లాలో జగన్‌ మేనమామ నియోజకవర్గమైన కమలాపురంలో కార్యక్రమం నిర్వహించారు. జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, సుధ, రాచమల్లు ప్రసాదరెడ్డి హాజరు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని సింగంపల్లిలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, కలెక్టరు మాత్రమే హాజరయ్యారు. జిల్లా మంత్రి తానేటి వనిత, ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముగ్గురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన కార్యక్రమానికి వైసీపీ ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు.

కోనసీమ జిల్లాలో మంత్రి చెల్లుబోయిన వేణు ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి, ఎంపీ చింతా అనూరాధ హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌, నలుగురు ఎమ్మెల్యేలురాలేదు. పార్టీలో జగన్ మాట గతంలోలా చెల్లుబాటు కావడం లేదనడానికి ఇదే తార్కానంగా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.

By
en-us Political News

  
 తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. 
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు  రోజులు  మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం  ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.  ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్  చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్‌కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్  కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య  చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత  బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని  చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.