జగన్ బల నిరూపణకి కాంగ్రెస్ ప్రోత్సాహం ఉందా?

Publish Date:Oct 28, 2013

Advertisement

 

ఇటీవల వైకాపా హైదరాబాదులో సమైక్య శంఖారావం సభ రాష్ట్రాన్ని సమైక్యంగా నిలిపేందుకేనని ఆ పార్టీ నేతలు చెపుతుంటే, మరో పక్క కాంగ్రెస్ సీనియర్ నేత నేత జేసీ దివాకర్ రెడ్డి జగన్ సభకు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మద్దతు ఉందని ప్రకటించి స్వంత పార్టీ నేతలనే కాక వైకాపాని కూడా ఆత్మరక్షణలో పడేసారు. అందుకు వెంటనే స్పందించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయనకి తీవ్రంగా హెచ్చరించిన సంగతి ఇప్పటికే వార్తలకెక్కింది.

 

అయితే రాష్ట్ర విభజన చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఇటువంటి కీలక తరుణంలో జగన్ నిర్వహిస్తున్న సమైక్య సభకు ఎందుకు ప్రోత్సహిస్తుందనే అనుమానాలు ఎవరికయినా కలగడం సహజం.

 

దానికి కూడా దివాకర్ రెడ్డి వ్యాఖ్యలలోనే సమాధానం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం తమపై నమ్మకం లేకనే తమనందరినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. లగడపాటి, హర్ష కుమార్ తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఇదేవిధంగా మాట్లాడారు. అందుకే దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో తన సోదరుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గాక స్వతంత్ర అభ్యర్ధిగాగా పోటీ చేయక తప్పని పరిస్థితి ఉండవచ్చని అన్నారు.

 

ఈవిధంగా సీమంద్రాకు చెందిన కాంగ్రెస్ నేతలు అందరూ తమ టికెట్స్ పై, విజయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కారణంగా, జగన్ పై పూర్తి నమ్మకం పెట్టుకొన్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు ముందు జగన్మోహన్ రెడ్డికి నేటికీ ప్రజాదరణ ఉందా లేదా? అనే అని నిరూపించుకోనేందుకే అతని సభకు సహకరించిందని దివాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను బట్టి అర్ధం అవుతోంది.

 

అయితే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒకరొకరుగా జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీ అధిష్టానానికి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ప్రకటిస్తుంటే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు మాత్రం అటువంటిదేమీ లేదని ఖండిస్తుండటం విశేషం. సోనియాగాంధీ మీద ఈగ వాలినా ఒంటి కాలు మీద లేచే కాంగ్రెస్ నేతలందరూ మొన్నసమైక్య సభలో జగన్మోహన్ రెడ్డి ఆమెను అంతగా దూషించినప్పటికీ ఎవరూ పెద్దగా నోరు మెదపకపోవడం గమనార్హం.

 

అదేవిధంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగుని ఈ రోజు డిల్లీలో మీడియావాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ అనుబంధం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం దాటవేయడం కూడా విశేషమే. నరేంద్ర మోడీ రాహుల్ లేదా సోనియా గాంధీల గురించి గాని పల్లెత్తు మాట అంటే అందరి కంటే ముందుగా ఆయనపై విరుచుకుపడే దిగ్విజయ్ సింగ్ కూడా జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం. దీని మతలబేమి కాంగ్రెస్ నేతలారా?

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.