వైకాపా ఓటమికి జగన్ శల్యసారధ్యమే కారణమా?

Publish Date:Jun 17, 2014

Advertisement

 

 

వైకాపా ఓటమికి జగనే ప్రధాన కారకుడని ఇటీవల ఆ పార్టీని వీడిన దాడి వీరభద్రరావు ఆరోపించారు. కానీ కర్ణుడు చావుకి వంద కారణాలున్నట్లే, వైకాపా ఓటమికి కూడా అన్ని కారణాలున్నాయి. అందులో జగన్ కూడా ఒక కారణం మాత్రమే. చంద్రబాబు తన సర్వ శక్తులు ఒడ్డి పోరాడితే, జగన్మోహన్ రెడ్డి మాత్రం తన గెలుపై ధీమాతో తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు వ్యవహరించారని దాడి విమర్శించారు. అనేక సర్వే నివేదికలు “వైకాపా విజయం తధ్యం, జగన్ ముఖ్యమంత్రి అవడం అంతకంటే తధ్యం” అని ముక్తకంటంతో ఘోషించడమే ఆయన ధీమాకు కారణమని చెప్పవచ్చును. కానీ అటువంటి పరిస్థితులలో కూడా చంద్రబాబు ఏ మాత్రం తొణకకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోగా, జగన్ శల్యసారధ్యంతో వైకాపా ఓటమి పాలయింది.

 

ఈ ఓటమి వల్ల తామేమీ కొత్తగా పోగొట్టుకోన్నది లేదని చెప్పేందుకు ‘తమ పార్టీ అధికారంలో ఉండి ఓడిపోలేదని’ అని జగన్ అన్నారు. అయితే అదే సూత్రం తేదేపాకు కూడా వర్తిస్తుందని ఆయన మరిచిపోయారు. తెదేపా గత పదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చొంది. చంద్రబాబు నాయుడు పార్టీలో అందరినీ ఒక్క త్రాటిపైకి తెచ్చి పూర్తి వ్యతిరేఖ పరిస్థితులలో కూడా పార్టీని విజయంవైపు నడిపించి తన నాయకత్వ లక్షణాలు మరొకమారు నిరూపించుకొంటే, అనుకూల పరిస్థితుల్లో కూడా జగన్ శల్యసారధ్యం చేసి పార్టీని ఓడించుకొన్నారు. అందువల్ల తెదేపా విజయానికి చంద్రబాబు ఏవిధంగా కారకుడో, వైకాపా ఓటమికి జగన్ కారకుడని చెప్పక తప్పదు.

 

ఇక చంద్రబాబు, జగన్ అనుసరించిన వ్యూహాలు కూడా ఆ పార్టీల గెలుపోటములకు మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చును. ఆంధ్రాకు సంబందించినంత వరకు చూసుకొన్నట్లయితే, చంద్రబాబు విమర్శలను లెక్కచేయకుండా విజయవకాశాలున్న బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోగా, జగన్ ప్రజలందరూ రాష్ట్రాని విడదీసిన కాంగ్రెస్ పార్టీని, కేసీఆర్ ను వ్యతిరేఖిస్తున్నారని తెలిసి ఉన్నప్పటికీ వారిరువురితో రహస్య సంబంధం కొనసాగించారు. అదొక తప్పయితే, దానిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజల ముందు ఎండగడుతున్నప్పుడు కూడా జగన్ సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో వారి ఆరోపణలను అంగీకరించినట్లయింది. ఇది మరో పెద్ద పొరపాటు.

 

తన ప్రత్యర్ధి బీజేపీతో పొత్తులు పెట్టుకొంటుంటే అప్రమత్తవవలసిన జగన్, ఒకసారి తమ పార్టీ మతత్వత పార్టీలకు మద్దతు ఈయదని, మరొకసారి ఇస్తుందని, ఇంకోసారి థర్డ్ ఫ్రంటుకే మద్దతు ఇస్తుందని ప్రకటిస్తూ తన అయోమయ పరిస్థితిని స్వయంగా చాటుకోవడంతో, ఆ పార్టీపై ప్రజలలో ఒక అపనమ్మకం ఏర్పడింది. ఇక చంద్రబాబు బీసీలను, కాపులను దగ్గరకు తీసుకొని వారికే ఉపముఖ్యమంత్రి పదవులు కూడా ఇస్తామని ప్రకటించి, ఆ వర్గాల ప్రజలను తన పార్టీ వైపు తిప్పుకోగలిగారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అప్పుడే అప్రమత్తమయి ఉండాల్సి ఉంది. కానీ గెలుపై ధీమాతో అతను బీసీలు, కాపులనే కాదు చివరికి పార్టీలో నేతలను కూడా పట్టించుకోలేదు. ఈమాటన్నది పైవాళ్ళు కాదు, ఆ పార్టీకే చెందిన దాడి వీరభద్ర రావు.

 

ఈ కారణాలకు తోడు ప్రజలు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల సామర్ద్యం, అనుభవం, ‘ట్రాక్ రికార్డ్’, కేంద్రంతో సంబందాలు వంటి అనేక అంశాలను కూడా ప్రజలు చక్కగా బేరీజు వేసుకొని వైకాపాను తిరస్కరించారు.

 

సాధారణంగా పార్టీ ఓటమి తరువాత ఏ రాజకీయ పార్టీ అయినా దానిని హుందాగా స్వీకరించి, తమ ఓటమికి గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో ఆత్మవిమర్శ చేసుకొంటుంది. కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికలలో వైకాపా తప్పకుండా 162 సీట్లు గెలుచుకొంటుందని నిర్దిష్ట సంఖ్యతో సహా ఇప్పుడే జోస్యం చెప్పడం మరో విశేషం. ఎన్నికలకు నెలరోజుల ముందు తన పార్టీ పరిస్థితిని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయిన జగన్మోహన్ రెడ్డి, ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే జోస్యం చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది. ఆయన తన ఆ కల నెరవేర్చుకోవాలంటే, ఇప్పటి నుండి వచ్చే ఐదేళ్ళ వరకు ఏవిధంగా ముందుకుసాగాలో ఆలోచించుకొంటే మేలేమో!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.