జగన్ ను డీ కొనలేకనే వైకాపాతో దోస్తీకి కాంగ్రెస్ సిద్దపడుతోందా

Publish Date:Jul 2, 2013

Advertisement

 

నిన్న దిగ్విజయ్ సింగ్ జగన్, రాజశేఖర్ రెడ్డిల గురించి చేసిన వ్యాక్యలతో కలవరపడిన కాంగ్రెస్ నేతలు వాటి పరమార్ధం వెతికే పనిలోపడ్డారు. జగన్, రాజశేఖర్ రెడ్డిల ప్రభావం తెలంగాణా కంటే సీమంధ్రాలోనే అధికంగా ఉండటంతో సీమంధ్ర నేతలలో ఈ విషయంపై తీవ్ర చర్చలు మొదలయ్యాయి. తాము జగన్ మోహన్ రెడ్డిని, అతని పార్టీని తమ ప్రాంతంలో నిలవరించగలమని గట్టిగా చెప్పకపోవడం వలననే, దిగ్విజయ్ సింగ్ విధిలేని పరిస్థితుల్లో జగన్ పార్టీతో పొత్తులు తప్పవని హెచ్చరించారని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

 

సీమంధ్రా ప్రాంతంలో, జగన్ చేతిలో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని అధిష్టానం గుర్తించినందునే, అయిష్టంగానయినా అతని పార్టీతో పొత్తులకు సిద్దపడి ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. తద్వారా కొంత మేరయినా పార్టీకి నష్టం తగ్గించాలని భావించినందునే, దిగ్విజయ్ సింగ్ ఆవిధంగా అని ఉండవచ్చునని కొందరు సీమంద్రా నేతలు అభిప్రాయ పడ్డారు.

 

ఇటువంటి నేపద్యంలో, తెలంగాణా అంశం మరింత కాలం సాగదీయడం వలన, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా మారుతుందనే ఆందోళనతోనే పార్టీ అధిష్టానం తెలంగాణా ఇచ్చేసేందుకు సిద్దపడుతోందని వారు భావిస్తున్నారు. తెలంగాణా ఈయకుంటే తెరాస చేతిలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని టీ-కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి గట్టిగా చెప్పినందునే తెలంగాణా ప్రకటనకి సరికొత్త గడువు ప్రకటించారని భావిస్తున్నారు. పార్టీని రెండు ప్రాంతాలలో కాపాడుకొనేందుకు, అటు తెలంగాణా ప్రకటనకి, ఇటు జగన్ మోహన్ రెడ్డితో దోస్తీకి పార్టీ సిద్దం అవుతోందని వారు అబిప్రాయపడ్డారు.

 

దిగ్విజయ్ సింగ్ కేవలం పది రోజుల్లో రాష్ట్ర విభజనపై స్పష్టమయిన ప్రకటన చేస్తానని చెప్పడంతో, తాము ఈలోగానే జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొని పార్టీకి సీట్లు సాధించగలమని గట్టిగా చెప్పాలని సీమంధ్రా నేతలు ఆలోచిస్తున్నారు. లేకుంటే, ఈసారి కేంద్రం తెలంగాణా ప్రకటన చేసిన తరువాత మరిక వెనక్కి తగ్గే అవకాశం ఎంత మాత్రం ఉండదని వారు భావిస్తున్నారు. అందువల్ల మళ్ళీ వెంటనే మరో సమావేశమయ్యి జగన్ మోహన్ రెడ్డిని తాము ఏవిధంగా నిలువరించగలమో ఒక పధకం ఆలోచించుకొని డిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి వివరించి తెలంగాణాను, జగన్తో దోస్తీని ఎలాగయినా అడ్డుకోవాలని వారు నిశ్చయించుకొన్నట్లు సమాచారం.

 

క్రిందటి ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టిస్తే, ఈసారి జైల్లో ఉన్నపటికీ జగన్ మోహన్ రెడ్డి ఆపని చేయడం విశేషం.

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.