సమైక్యవాదమే ఆయుధంగా ప్రత్యర్ధులపై జగన్ పోరాటం

Publish Date:Dec 26, 2013

Advertisement

 

జగన్మోహన్ రెడ్డి తానొక్కడే అసలు సిసలయిన సమైక్యవాదినన్నట్లు, మిగిలినవారెవరికీ కూడా రాష్ట్రం విడిపోతోందనే బాధ లేదన్నట్లు మీడియా ముందు తెగ ఫీలయిపోతూ నటించేస్తుంటారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తను చేస్తున్న పోరాటంలో అన్నిరాజకీయ పార్టీలు, నేతలు కూడా తన వెనుకే నడవాలని, తను చెపుతున్నట్లు చేయాలని డిమాండ్ చేస్తుంటారు. అందరూ తను చెపుతున్నట్లు చేయకపోతే చరిత్ర హీనులయి పోతారంటూ శపిస్తుంటారు కూడా. అందుకే ఓసారి రాజీనామాలు, మరోసారి అఫిడవిట్లు అంటూ ఏదో ఒక డ్రామాలాడుతూ తెదేపాను కూడా తనలాగ చేసి చూపించమని లేకుంటే సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేసినట్లేనని వాదిస్తుంటారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తనకు వచ్చిన, నచ్చిన ఐడియాను ఆయన తనపార్టీ చేత నిరభ్యంతరంగా అమలు చేసుకోవచ్చును. కానీ, దానిని ఇతర పార్టీలు కూడా అనుసరించాలని లేకుంటే చరిత్ర హీనులేనని వాదించడమే విడ్డూరం. అసలు తను చెప్పినట్లు ఇతర పార్టీలు, నేతలు వినాలని ఆయన ఏవిధంగా ఆశిస్తున్నారు?

 

 ఎవరి సంగతెలా ఉన్న ముందుగా చంద్రబాబుని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం ఆయన శపించడం మరిచిపోరు. కారణం సీమాంధ్రలో వారిరురితోనే ఆయన ఎన్నికలలో పోటీపడవలసి ఉంటుంది గనుక. కానీ తెలంగాణాకే పరిమితమయిన తెరాసతో తనకి ఎటువంటి సమస్య లేదు గనుక రాష్ట్ర విభజనకి మూలకారకుడయిన తెరాస అధినేత కేసీఆర్ గురించి మాత్రం ఎన్నడూ ఎటువంటి విమర్శలు చేయరు. వైకాపా దృష్టి అంతా సీమాంధ్ర పైన మాత్రమె ఉందని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది?

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నానని స్వంత డప్పువేసుకొనే జగన్మోహన్ రెడ్డి, మరి తెలంగాణా ప్రాంతంలో కూడా విస్తృతంగా పర్యటించి రాష్ట్రం విడిపోతే వచ్చేకష్టనష్టాలను అక్కడి ప్రజలకి, పార్టీలకీ కూడా వివరించి వారిని కూడా రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ఒప్పించే ప్రయత్నం చేయకుండా, కేవలం సీమాంధ్రలో మాత్రమే ఎందుకు శంఖం ఊదుకొంటూ, ఓదార్పులు చేసుకొంటూ తిరుగుతున్నారో గమనిస్తే ఆయన అంతర్యం ఏమిటో అర్ధం అవుతుంది.

 

నిజానికి సమైక్యాంధ్ర అనేది తను అధికారంలోకి రావడానికి ఉపయోగపడే ఒక మంచి ఆయుధంగా జగన్ భావిస్తునందునే, ఆ సెంటిమెంటు బలంగా ఉన్నచోటనే ఆయన తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తపన కంటే, సమైక్యాంధ్ర ఉద్యమాన్నిఆయుధంగా చేసుకొని తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయాలనే తపన చూస్తే ఆయన అంతర్యం ఇట్టే అర్ధం అవుతుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అందరినీ జెండాలు పక్కన బెట్టి వచ్చితన వెనుక నడవమని ఆదేశించే జగన్మోహన్ రెడ్డి, మొన్నఏపీయన్జీవోలు సమైక్యాంధ్ర సాధన కోసం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఏవో కుంటి సాకులు చెప్పిహాజరవకుండా తప్పించుకోవడం చూస్తే ఆయన సమైక్యవాదం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది.

 

తెదేపాతో బాటు వైకాపా కూడా రాష్ట్రవిభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ఆవిధంగా లేఖ ఇవ్వడం పొరపాటయిందని కానీ, దానిని తాము వెనక్కు తీసుకొంటున్నామని గానీ ఎన్నడూ అనకపోయినా, తెదేపా ఇచ్చిన లేఖ గురించి మాత్రం పదేపదే ప్రస్తావిస్తూ దానిని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయడం చూస్తే, ఆయన చేస్తున్న ఈ రాజకీయమంతా దేని కోసమో అర్ధం అవుతుంది.

 

జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక ఉండటం తప్పుకాదు, నేరమూ కాదు. అదేవిధంగా తన పార్టీ వచ్చేఎన్నికలలో గెలవాలని ఆయన కోరుకోవడం కూడా నేరం కాదు. అయితే మనసులో రాష్ట్ర విభజన కోరుకొంటూ, సీమాంధ్ర ప్రజల ఓట్లు రాల్చుకోవడానికి పైకి సమైక్యవాదం చేయడం క్షమార్హం కాదు. సీమాంధ్ర ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్నమాట నూటికి నూరు పాళ్ళు వాస్తవమే. కానీ వారి భావోద్వేగాలను వారి బలహీనతగా భావించి ఈవిధంగా రాజకీయాలు చేస్తే ప్రజలు అందుకు తగిన గుణపాటం చెప్పడం ఖాయం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.