యథా సీఎం..తథా అధికారులు..జగన్ పాలనలో ఐఏఎస్ లకు జైలు శిక్షలు!

Publish Date:May 7, 2022

Advertisement

ధ్రప్రదేశ్ లో జగన్ పాలనకీ.. ఆ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కోర్టుల్లో శిక్షలకూ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. ఏపీలో  సివిల్ సర్వీసెస్ అధికారులకు జైలు శిక్ష పడటమన్నది ఒక సాధారణ విషయంగా మారిపోయింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం అన్నది ఏపీలో అధికారులకు ఒక అలవాటుగా మారిపోయింది. సీనియర్ ఐఏఎస్ లు, నిజాయితీ అధికారులుగా పేరు పొంది, కెరీర్ లో ఒక్క రిమార్కు లేని అధికారులు కూడా జగన్ హయాంలో కంటెప్ట్ ఆఫ్ కోర్టు కుసులలో శిక్షలకు గురవుతున్నారు.  సాక్షాత్తూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ హైకోర్టుకు హాజరై తన కెరీర్ లో కోర్టు ముందు హాజరు కావడం ఇదే తొలిసారని ధర్మాసనం ముందు మొరపెట్టుకున్నారు. అంటే కోర్టు ఆయన తప్పేం లేకుండా హాజరు కావాల్సిందిగా ఆదేశించిందని కాదు.. ఇంత కాలం నిబంధనలను కచ్చితంగా పాటించిన ఆయన జగన్ హయాంలో అందుకు విరుద్ధంగా చేసి విచారణకు కోర్టుకు హాజరు కావలసి వచ్చింది. 

ఇంతకీ ఆయన కోర్టు ముందు హాజరైంది ఒక్క సారే.. కానీ ఆయన కింద పని చేస్తున్న ఐఏఎస్ లు మాత్రం కోర్టు ఎదుట చేతులు కట్టుకు నిలబడటమే కాదు.. శిక్షలకు కూడా గురౌతున్నారు. జరిమానాలు కడుతున్నారు. జైలు శిక్షకు బదులుగా సామాజిక సేవ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ లు కోర్టు ముందు హాజరు కావడం, శిక్షలకు గురి కావడం ఇప్పుడొక సెన్సెషనల్ వార్తగా ఎవరూ భావించడం లేదు. అదో రోజు వారీ కార్యక్రమం అన్నట్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

తాజాగా నిజాయితీ పరురాలైన అధికారిగా, నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేసే సాహసోపేతమైన అధికారిగా గుర్తింపు పొందిన పూనం మాల కొండయ్యకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఇంకా ముందు ముందు  మరిన్ని శిక్షలు ఎదురు చూస్తున్నాయా అంటే ఔననే సమాధానం వచ్చేటట్లే ఉంది. ఎందుకంటే హైకోర్టులో ఇంకా పలు కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి విషయంలో తీర్పులు ఎలా వస్తాయన్నది ఊహించలేం కానీ.. ఇప్పటి వరకూ వచ్చిన తీర్పులను బట్టి చూస్తే ఆ ధిక్కరణ కేసుల్లో కూడా ఐఎఎస్ లు శిక్షలకు గురయ్యే అవకాశమే ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ హయాంలో పని చేసిన పలువురు ఐఏఎస్ లు కూడా కోర్టు కేసులను ఎదుర్కొన్నారు. వారు ఎదుర్కొన్న కేసులన్నీ అప్పటి సీఎం తనయుడిగా ఉన్న జగన్ కు సంబంధించిన క్విడ్ ప్రోకో కేసులే కావడం గమనార్హం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో ఐఏఎస్ లు కోర్టు విచారణలు ఎదుర్కొంటూ, శిక్షలకు గురౌతున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.