కమలం వైపు జగన్ కదులుతున్నారా… కమలమే, కమాన్ అంటోందా?

Publish Date:May 11, 2017

Advertisement

2014 నుంచీ విజయపరంపరలో సాగుతోంది బీజేపి. మోదీ ప్రధాని అయిన తరువాత చాలా రాష్ట్రాలే కమలం ఖాతాలో పడ్డాయి. బీహార్, దిల్లీ ఎన్నికల్లో తీవ్రమైన ఓటమి ఎదురైనా మళ్లీ ఈ మధ్య కాలపు ఎన్నికల ఫలితాలతో అందరికీ బలమైన సమాధానం ఇచ్చింది కాషాయదళం. కాని, ఇప్పుడు మరో ఎన్నిక ఎన్డీఏకు, మరీ ముఖ్యంగా బీజేపికి సవాలుగా మారింది. అదే రాష్ట్రపతి ఎన్నిక! ప్రణబ్ ముఖర్జీ తరువాత దేశ ప్రథమ పౌరుడు అయ్యేది ఎవరన్న సస్పెన్స్ అందరిలోనూ వుంది! అయితే, ప్రెసిడెంట్ ఎలక్షన్ రానున్న 2019 ఎన్నికల ముఖ చిత్రాన్ని కూడా కొద్దికొద్దిగా స్పష్టం చేస్తున్నట్టు కనిపిస్తోంది!

 

రాష్ట్రపతి ఎన్నికలు మోదీ సర్కార్ కి పెద్ద ఇబ్బందేం కాదు. యూపీ మొదలు మణిపూర్ వరకూ చాలా రాష్ట్రాలు బీజేపీ చేతిలో వున్నాయి. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చేతిలో వున్న రాష్ట్రాలతో కూడా పెద్ద టెన్షన్ ఏం లేదు. అందుకు మంచి ఉదాహరణ మన ఏపీనే! ఇక్కడ అదికారంలో వున్నది టీడీపీ కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు సునాయాసంగానే పొందవచ్చు. కాని, ట్విస్ట్ ఏంటంటే, ఆంధ్రా అసెంబ్లీలో ఎప్పుడూ ఉప్పు, నిప్పులా వుండే టీడీపీ, వైసీపీ రెండూ మోదీ నిలబెట్టబోయే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కే మద్దతు పలకునున్నాయి. ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ సపోర్ట్ చేస్తుందని మనకు ముందు నుంచీ తెలుసు. కాని, లేటెస్ట్ మీటింగ్ తరువాత జగన్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు! అదే ఇప్పుడు అనేక ఊహాగానాలకు కారణం అవుతోంది!

 

ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా వున్న శివసేన ఇప్పటి వరకూ మోదీ నిర్ణయించే అభ్యర్థికి తమ మద్దతని చెప్పటం లేదు. చాలా రోజులుగా గుర్రుగా వుంటోన్న ఉద్ధవ్ థాక్రే రాష్ట్రపతి ఎన్నిక టైంలో బీజేపికి చుక్కలు చూపాలని ఆశ పడుతున్నారు. కాని, ఎన్డీఏలో భాగస్వామి కాని వైసీపీ మాత్రం బీజేపి రాష్ట్రపతి అభ్యర్థికి క్లియర్ సపోర్ట్ అంటోంది! దీనర్థం ఏంటి? జగన్ మాటల్లో అయితే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి గెలిచే అవకాశం లేదు కాబట్టి వైసీపీ అతి పెద్ద పార్టీ అయిన కమలదళానికే మద్దతు ఇస్తోంది! కాని, దీని వెనుక ఇంతే మ్యాటర్ వుందని విశ్లేషకులు భావించటం లేదు!

 

జగన్ పైన వున్న కేసులు, జైలుకు వెళ్లాల్సి వచ్చే గండం ఆయన్ని మోదీతో రాజీకి తీసుకొచ్చాయంటున్నారు విశ్లేషకులు. అంతే కాక, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎన్డీఏలో చేరి ఏపీలో అధికారం చేపట్టాలని జగన్ భావిస్తున్నారట! అలాగే, కేంద్రంలోనూ మంత్రి పదవులు తీసుకుని అధికారం ఆస్వాదించాలని ఆయన ఆశిస్తున్నారట! పార్టీ పెట్టి ఇంత కాలమైనా ప్రతిపక్షంలో కాలం గడిచిపోతోంది. అందుకే, జగన్ బీజేపితో పొత్తుకి తహతహలాడుతున్నారని టాక్! మరి ఎన్డీఏలో ఎంతో కీలకమైన టీడీపిని కాదని మోదీ, అమిత్ షా జగన్ ను చేరదీస్తారా? హిందూత్వా బ్రాండ్ ను నమ్ముకునే కాషాయదళానికి క్రిస్టియన్ మైనార్టీల్లో మంచి ఫాలోయింగ్ వున్న వైసీపీతో పొసుగుతుందా? ఇవన్నీ ముందు ముందు తేలాల్సిన ఆసక్తికర అంశాలు!

 

ఇక మోదీ పట్టుదలతో వర్కవుట్ చేస్తోన్న ఒక దేశం ఒకేసారి ఎన్నికలు కాన్సెప్ట్ కు కూడా జగన్ బేషరతుగా ఓకే చెప్పారు! మరో వైపు ప్రత్యేక హోదా మరిచిపోలేదని అన్నప్పటికీ దానిపై ప్రత్యేకంగా గొడవ చేయటం ఇక మీదట వుండదని జగన్ మాటలు వింటే అర్థమైపోతుంది! ఇలా ఇంత చక్కగా మోదీకి మద్దతు పలికిన విపక్ష పార్టీ వైసీపీ తప్ప దేశంలో మరేదీ లేదనుకుంటా!

 

మోదీకి, బీజేపికి, కేంద్రానికి జగన్ మద్దతు వెనుక ఆయన మీద వున్న కేసులు కారణమా? లేక భవిష్యత్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కమలానికి ఫ్యాన్ని దగ్గర చేసే వ్యూహమా? లేక వ్యక్తిగత, రాజకీయ కారణాలు రెండూ వున్నాయా? ఏమో.. ఏమీ చెప్పలేం! కాని, ఇప్పుడు బాల్ బీజేపి కోర్టులో వుంది. టీడీపీ జాగ్రత్తగా జగన్ కదలికల్ని, బీజేపి హావభావాల్ని గమనిస్తూ వుండాల్సిందే!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.