అతను జట్టులో ఉంటే ఏదో విధంగా గెలుస్తామన్న నమ్మకం కలుగుతుంది, అతను జట్టులో ఉంటే ప్రత్యర్ధి బ్యాటర్ ఇబ్బంది పడతాడు, అతను ఫీల్డింగ్ చేస్తుంటే ఫోర్లు ఆగిపోతాయి, సిక్స్లకు అవకాశం ఉండదు. అతను బౌలర్గా బ్యాటర్ను ముప్ప తిప్ప లు పెట్టగలడు. భారత్ క్రికెట్ జట్టుకు అతను ఎంతో వెన్నుదన్ను. అతనే రవీంద్ర జడేజా అనే జద్దు!
అతని కుడిమోకాలికి గాయమయింది. శస్త్రచికిత్స అనివార్యమైంది. అందుకే ఆసియాకప్ మిగతా మ్యాచ్లకు దూరమ య్యాడు. అతను త్వరలో జట్టులోకి తిరిగి రావాలని, ఫైనల్ లో భారత్ను గెలిపించే భారత్ స్టార్స్లో అతని పాత్ర కీలకమని అందరూ ఎంతో ఆశించారు. కానీ శస్త్రచికిత్స తప్పనిసరి కావడంతో అతను కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు అన్నారు. ప్రస్తుత ఆసియాకప్కి అలా దూరమయ్యాడు. కానీ ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్నకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇది జడేజా వీరాభిమానులను బాధిస్తోంది.
ఆసియా కప్లో పాకిస్థాన్, హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లలో జడేజా మెరుగైన ప్రదర్శనతో జట్టులో సమతూకం తీసుకు వచ్చా డు. ఇలాంటి ఆటగాడు ప్రపంచకప్ టీమ్లో లేకపోనుండడం రోహిత్ అండ్ కోకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. టీమ్ ఇండియా కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కుడి మోకాలి నొప్పితో బాధపడుతూ ఆసియా కప్టోర్నీకి దూరమయ్యాడు స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా. అతడి అంతర్జాతీయ పునరాగమనం గురించి ఎన్సీఏ వైద్య బృందం స్పష్టత ఇవ్వలేదు. రానున్న మూడు నెలలు అతడు క్రికెట్ కు దూరమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ సీనియర్ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.
అయితే.. ప్రపంచకప్కు ఇంకా చాలా సమయం ఉందని.. జడేజాపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని స్పష్టం చేశాడు టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొన్నాడు.ఆసియా కప్లో మొదటి రెండు మ్యాచ్ల తర్వాత మోకాలి గాయం కారణంగా అతడు ఈ టోర్నీకి దూరమయ్యాడు. పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులతో జట్టుకు విలువైన స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. ఆ తర్వాత హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్కు అవకాశం రాకపోయినా..బౌలింగ్లో కీలక వికెట్ తీశాడు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ ఉత్తమ సేవలందించే ఈ స్టార్ ఆల్రౌండర్ పెద్ద టోర్నీకి దూరమవడం టీమ్ఇండియాకు పెద్దలోటే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jadeja-may-not-be-available-for-world-t20-25-143197.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.