టీఆర్ ఎస్ను, బీఆర్ ఎస్గా పేరు మార్చేందుకు అనుమతించమని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్కు టీఆర్ ఎస్ ప్రతిపాదనలు పంపింది. పార్టీ సర్వసభ్యసమావేశంలో ఆమోదించిన తీర్మానంతో పాటు, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాసిన లేకను కూడా గురువారం పంపించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మకు మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అందించారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవని మాజీ ప్రధాన ఎన్ని కల కమిషనర్లు వీఎస్ సంపత్, సునీల్ అరోరా తెలిపారు పేరు మారినా బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ మాత్రమే అవుతుందని, అది జాతీయ పార్టీ కాదని చెప్పారు. నిబంధనల ప్రకారం జాతీయ పార్టీకి అవస రమైన ఓట్ల శాతం, సీట్లు వచ్చినప్పుడే దానికి జాతీయ పార్టీగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. టీఆర్ఎ స్ పేరును బీఆర్ ఎస్ గా మార్చేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిస్తే ఎన్నికల గుర్తులు ఆర్డర్ ప్రకా రం ఆ పార్టీ ఎన్నికల గుర్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని సునీల్ ఆరోరా వెల్లడించారు.
కాగా, పేరు మారినంత మాత్రాన ఎన్నికల గుర్తు మారదని, అయితే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆ రాష్ట్రాల్లో అదే ఎన్నికల గుర్తుతో వేరే పార్టీ ఉంటే బీఆర్ఎస్ ఆ రాష్ట్రంలో తన ఎన్నికల గుర్తు మార్చుకోవాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీకి ఇతర రాష్ట్రా ల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే, బీఆర్ఎస్ పేరిట ఇప్పటికే మూడు పార్టీలున్నట్లు విలేకరులు వినోద్ కుమార్తో ప్రస్తావిం చగా పార్టీ పేరు వేరు, అబ్రివేషన్ వేరు అని బదులిచ్చారు. పార్టీ పేరు బిఆర్ ఎస్గా మార్చిన తర్వాత తెలం గాణ రాష్ట్ర సమితి పేరిట ఎవరూ రాజకీయ పార్టీని నమోదు చేసుకోరాదని, ఆ విషయాన్ని చట్టం చెబుతున్నదని వినోద్ కుమార్ తెలిపారు. మరోవైపు, ఈ నెల 14లోపు ఎన్నికల సంఘం గుర్తిస్తే బీఆర్ ఎస్ తరఫునే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తామని, లేదంటే టీఆర్ఎస్ పేరిటే అభ్యర్థి బరిలో ఉం టారని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/it-wouldnt-be-national-party-by-changing-name-says-ec-39-145023.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.