ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థల స్థాపనకు ప్రణాళికలు సిద్దం

Publish Date:Dec 1, 2014

Advertisement

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణంతో బాటు రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి మరియు నెల్లూరు నగరాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూడా అవసరమయిన స్థలాలను, సిద్దంగా ఉన్న భావన సముదాయాలను అధికారులు గుర్తించడం పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సుమారు 60 లక్షల చదరపు అడుగులు వైశాల్యం గల భవనాలు సిద్దంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విశాఖలోనే మధురవాడ వద్ద ఏర్పాటు చేసిన వి.యస్.ఈ.జెడ్. ఇన్క్యుబేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇన్క్యుబేషన్ టవర్లో సుమారు 50,000 చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు, కాకినాడలో 25 ఎకరాల స్థలం, సర్పవరం ఐ.టి. సెజ్ లో 7,000 చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు, విజయవాడలో ఏ.పి.ఐ.ఐ.సి.కి చెందిన పారిశ్రామికవాడలో 2.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు, అక్కడే యస్.టి.పి.ఐ. ఇన్క్యుబేషన్ సెంటర్లో 15,000, చదరపు అడుగులు, అదేవిధంగా తిరుపతిలో 15, 000 చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు సిద్దంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

 

ఇవి ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ కంపెనీల స్థాపనకు చాలా అనువుగా ఉన్నందున, ఆ పరిశ్రమలు స్థాపించాలనుకొన్న వారికి వెంటనే అనుమతులు మంజూరు చేసి తక్షణమే ఆ భవనాలలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. అన్నిటి కంటే ముందుగా విశాఖ, విజయవాడ మరియు తిరుపతి పట్టణాలలో ఈ ఎలక్ట్రానిక్ పార్కుల స్థాపన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఐటీ పరిశ్రమల స్థాపనకు సిద్దంగా ఉన్న ఈ భవనాలే కాకుండా ఇంకా విశాఖలో ఐ.టి. జోన్ గా గుర్తింపబడిన మధురవాడ వద్ద 152 ఎకరాల స్థలము, దానికి చేరువలోనే గంభీరం అనే ప్రాంతంలో ఏ.పి.ఐ.ఐ.సి.కి చెందిన పారిశ్రామిక వాడలో మరో 50 ఎకరాలు సాఫ్ట్ వేర్ పార్కులు ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నాయి.

 

అదేవిధంగా విశాఖ జిల్లాలో అచ్యుతాపురం వద్ద గల పూడి గ్రామం వద్ద మరో 20ఎకరాల స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేంద్ర చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఆద్వర్యంలో టెక్నాలజీ ఫర్ సిస్టమ్స్ ప్రోగ్రాం అనే పధకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 15 ప్రాంతాలలో ఐ.టి సంస్థలకు అవసరమయిన పరిశోధనశాలలు మరియు శిక్షణా సంస్థలు మొదలయినవి ఏర్పాటు చేయబడుతాయి. వాటిలో ఒకటి ఈ పూడి గ్రామం వద్ద ఏ.పి.ఐ.ఐ.సి. గుర్తించిన ఈ 20ఎకరాలలో రూ.120కోట్ల పెట్టుబడితో స్థాపించబడతాయి.

 

ఇందుకోసం కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే అభివృద్ధి చేయబడిన ఆ భూములు అందుబాటులోకి రాగానే అక్కడ ఈ అత్యాధునిక యంత్ర పరికరాలతో కూడిన ఈ సంస్థలు ఏర్పాటు చేయబడతాయని వైజాగ్ యంపీ మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. హరిబాబు తెలిపారు. వీటితోబాటు విశాఖలో ఐ.టి.ఐ.ఆర్.తో మరియు విశాఖ, తిరుపతి మరియు అనంతపురం పట్టణాలలో ఐటి మరియు మెగా ఎలక్ట్రానిక్ పార్కులను ఏర్పాటు చేసేందుకు, కాకినాడలో మెగా ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్క్ ఏర్పాటుకు అవసరమయిన ప్రణాళికలు అధికారులు సిద్దం చేస్తున్నారు.

By
en-us Political News

  
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.