సీనియర్లకి మరో ఛాన్స్!.. కేబినెట్లోకి వాళ్లు రీఎంట్రీ?

Publish Date:Apr 8, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ క్రతువు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలోని 24 మంది మంత్రులు, ప్రస్తుత మంత్రివర్గం చిట్టచివరి సమావేశంలో రాజీనామా లేఖలు, ముఖ్యమంత్రి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. మనసులో ఏ బాధ, ఏ భావం ఉన్నా, ఎవరికి వారు మరో మాట మాట్లాడకుండా, జేబుల్లో చేతులు పెట్టుకుని మౌనంగా అలా నడుచుకుంటూ వెళ్లి పోయారు.అయితే అక్కడితో అయిపోయిందా? మంత్రులంతా మాజీలై పోయినట్లేనా? మరో మూడు రోజులో కొలువు తీరే కొత్త మంత్రి వర్గంలో మాజీలు ఎవరికి మళ్ళీ ఛాన్స్ దక్కదా, అంటే, అలాగని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. నిజానికి, ఇంకా ఇప్పటికీ మాజీలలో మళ్ళీ ఎంత మందికి మంత్రి పదవులు దక్కుతాయి? అనే విషయంలో, ఎవరికీ, చివరికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా పూర్తి క్లారిటీ లేదనే అంటున్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి ప్లస్, మైనస్ లెక్కలతో కుస్తీ పడుతున్నారని అంటున్నారు. మరో వంక సీనియర్లు ఎవరి స్టైల్లో వారు, వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారు.  

నిజానికి నిన్న మొన్నటి వరకు మాజీలలో ఒకరిద్దరు మినహా, మిగిలిన ఎవ్వరికీ సెకండ్ ఛాన్స్ ఉండదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని చెప్పు కొచ్చారు. కానీ, మెల్లమెల్లగా ఆ సంఖ్య పెరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే, ఓ పదిమంది పాతకొత్త ముఖాలు మళ్ళీ బుగ్గకారెక్కుతారని అంటున్నారు. ముఖ్యంగా సీనియర్ల విషయంలో ముఖ్యమంత్రి మనసు మార్చుకున్నట్లు చెపుతున్నారు.
 
మంత్రుల పని తీరు, సామాజిక సమీకరణలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రభావ, ఫలితాల ఆధారంగా ముఖ్యమంత్రి మాజీలకు మళ్ళీ అవకాశం కల్పించే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే,  ముఖ్యమంత్రి మనసు మార్చుకోవడానికి, ఇవేవీ కారణం కాదని, మాజీల వత్తిళ్ళకు తలొగ్గే ముఖ్యమంత్రి మనసు మార్చుకున్నారని అంటున్నారు. పాత కొత్త ముఖాలుగా ప్రచారంలో ఉన్న పేర్లలో,పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణ, కొడాలి నాని,పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్‌, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్‌,అంజాద్‌ బాషా, తానేటి వనిత ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే, ఇదేదీ కూడా ఫైనల్ కాదని చివరి క్షణం వరకు మార్పులు చేర్పులు, కూడికలు తీసివేతలు కొనసాగుతూనే ఉంటాయని ఒక ప్రచారం జరుగుతోంది. మరో వంక ముఖ్యమంత్రికి  తమ కొత్త బృదం విషయంలో పూర్తి క్లారిటీ ఉందని, అయితే, ఇంకా ఆశ వదులుకోలేని  కొందరు సీనియర్లు కావాలని  ఇలాంటి ప్రచారం చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. చివరకు ఏమి జరుగుతుంది? ఎవరు మంత్రి? ఎవరు మాజీ? తెలుసుకోవాలంటే మరో మూడు రోజులు ఆగక తప్పదు.  

అదలా ఉంటే, ఏకంగా పది మంది మాజీలకు అవకాశం కలిపిస్తే, మూడేళ్ళుగా కలల్లో వత్తులు వేసుకుని మంత్రి పదవి  కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆర్కే రోజా అండ్ కో పరిస్థితి ఏమిటి?అనే చర్చ పార్టీలో జరుగుతోంది. నిజానికి ఒక్క రోజా అని కాదు, తొలి మంత్రి వర్గంలోనే మంత్రి పదవి ఆశించి భంగపడిన ధర్మాన, ఆనం రామ నారాయణ,  తమ్మినేని అంబటి రాంబాబు, కరుణాకర రెడ్డి, చెవి రెడ్డి ఇలా చాలామందే తాజా విస్తరణలోనూ ఆశలు పెట్టుకున్నారు. చివరకు ఎవరి ఆశలు నెరవేరతాయి,ఎవరి కలలు కల్లలవుతాయో.. ఏమో.

 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.