పవన్ దూకుడు.. బాబు వ్యూహమేనా?

Publish Date:Jul 14, 2023

Advertisement

ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి విజయ యాత్రతో ఏపీ రాజకీయాల్లో మంటలు రేపుతున్నాడు. అధికార పార్టీ నేతలపై.. ముఖ్యంగా సీఎం జగన్‌పై పోట్లగిత్తలా కాలుదువుతున్నాడు. ఈ క్రమంలో వైసీపీ నేతల మాట తీరుకు సరిఅయిన సమాధానం ఇస్తున్నాడు. ఇన్నాళ్లు మాజీ సీఎం, టీ-డీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీ-డీపీ నేతలను ఓ ఆట ఆడుకున్న వైసీపీ నేతలు ప్రస్తుతం ఆ ఫోకస్‌ను పవన్‌ వైపుకు మళ్లించారు.

ఇటీ-వల ఏలూరులో జరిగిన వారాహీ యాత్రలో వాలంటీ-ర్స్‌ వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాక్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం వెనుక కొందరు వాలంటీర్స్‌ ఉన్నారని, వారు సేకరించిన డేటా తప్పుడు పనులకు ఉపయోగపడుతుందని పవన్‌ వ్యాఖ్యానించారు. పవన్‌ వాక్యలపై వాలంటీర్స్‌, వైసీపీ నేతలు భగ్గుమన్నారు. వాలంటీర్స్‌ పవన్‌ కళ్యాణ్‌ దిష్టిబొమ్మలు దహనం చేయగా, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి పవన్‌ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ వర్సెస్‌ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వాలంటీర్‌ ఫిర్యాదుతో పోలీసులు పవన్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు సైతం నమోదు చేశారు.

వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌పై దృష్టిసారించడంతో చంద్రబాబు, టీడీపీ నేతలు కొంత ఊపిరిపీల్చుకున్నట్లయింది. ఇన్నాళ్లు చంద్రబాబు, టీడీపీ నేతలపై ఒంటికాలుపై లేచిన వైసీపీ మంత్రులు ప్రస్తుతం వారి దృష్టిని పవన్‌ వైపు మళ్లించారు. మరోవైపు చంద్రబాబు అండ్‌ కో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రౌండ్‌ లెవల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది. పొత్తుతో వెళ్లాలా.. పొత్తు పెట్టుకుంటే జనసేనతో పాటు బీజేపీతోనూ చేతులు కలపాలా? అనే విషయాలపై సర్వేలు చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. సర్వేల ఆధారంగా పొత్తు పెట్టుకుంటే జనసేనకు ఎన్ని సీట్లు  ఇవ్వాలి. బీజేపీకి ఎన్నిస్థానాలు కేటాయించాలి..? వారికి ఏం నియోజకవర్గాలు కేటాయించాలనే విషయంపై చంద్రబాబు లెక్కలువేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కనీసం 120 నుంచి 130 స్థానాల్లో పాగా వేయాలని చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఈ క్రమంలో దీంతో ఓ వ్యూహంతో వారు ముందుకెళ్తున్నారన్న ప్రచారమూ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది.

అధికార పార్టీపై పవన్‌ కళ్యాణ్‌ దూకుడు వెనుక చంద్రబాబు వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతుంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఓ బలమైన సామాజిక వర్గం ఓటర్లను తమవైపుకు మళ్లించడమే చంద్రబాబు, పవన్‌ టార్గెట్‌ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వ్యూహంలో భాగంగానే ఇన్నాళ్లు టీడీపీ నేతలే టార్గెట్‌ విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోకస్‌ను పవన్‌ కళ్యాణ్‌ తనవైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కాపు సామాజిక వర్గం వైఎస్‌ జగన్‌ వైపు ఎక్కువగా ఉంది. గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువే. పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ నేతలను టార్గెట్‌ చేయడంద్వారా ఆటోమేటిక్‌గా వైసీపీ నేతలు పవన్‌కు కౌంటర్‌ ఇస్తుంటారు. ఈ క్రమంలో కాపు ఓటర్లు పవన్‌ వైపు సానుభూతి చూపే అంశాలు లేకపోలేదు. దీనికితోడు వారాహి యాత్రల్లో మీరంతా కలిసిఉంటే తాను సీఎం అవుతానంటూ పవన్‌ పదేపదే చెబుతున్నాడు. కావు సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఒకరు సీఎం అవ్వాలని ఆ సామాజిక వర్గం భావిస్తుండటం సహజమే. గతంలో చిరంజీవికి బలమైన మద్దతుగా ఆ సామాజిక వర్గం నిలిచింది. కానీ, చిరంజీవికి సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నప్పటికీ.. కాపు సామాజిక వర్గం జగన్, పవన్ మధ్య చీలిపోయి ఉంది.

కాపు సామాజిక వర్గంను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి దూరం చేయాలంటే పవన్‌ కళ్యాణ్‌ ఫ్రంట్‌లైన్లో ఉండాలన్నది చంద్రబాబు వ్యూహంలో భాగమని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌కు క్లీన్‌ ఇమేజ్‌ ఉంది. వైసీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేయటానికి పెద్దగా ఏమీ ఉండవు. కేవలం బూతులు తిట్టడం మాత్రమే.  ఈ నేపథ్యంలోనే పవన్‌ను ఫ్రంట్‌లైన్లో పెట్టడం ద్వారా కాపు సామాజిక వర్గంతో పాటు చంద్రబాబు అంటే గిట్టనివారు. ప్రస్తుతం వైసీపీకి తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు పలుకుతున్న వారు ఆ పార్టీకి దూరమై పవన్‌ వైపు వస్తారన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. అలా పవన్‌ కళ్యాణ్‌కు బలమైన ఓటు బ్యాంక్‌ చేరుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పొత్తుతో వెళ్లాలని ఇప్పటికే పవన్‌, చంద్రబాబు నిర్ణయించుకున్న క్రమంలో ఆ ఓటు బ్యాంకు వైసీపీ ఓటమికి ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల వ్యూహంగా తెలుస్తోంది. దీంతో వారిద్దరు అనుకున్నట్లే సీఎం జగన్‌ వారి వ్యూహంలో చిక్కారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.