మహా సర్కార్‌కు రెండేళ్ళు.. ప్రభుత్వం కులనుందా?

Publish Date:Nov 27, 2021

Advertisement

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ (ఎంబీఏ)కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజుకు (నవంబర్ 27)కి రెండేళ్ళు పూర్తయ్యాయి. అనూహ్య పరిణామాల్ అంది 2019 లో శివసేన అధినేత్ ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఏర్పడిన మూడు పార్టీల (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) అఘాడీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో అటుపోట్లు అనేకం ఎదుర్కుంది. అయినా అంచనాలను తల్లకిందులు చేస్తూ నిలబడింది. 

నిజానికి, లౌకిక (కాంగ్రెస్, ఎన్సీపీ)  మతోన్మాద (శివ సేన) పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం అట్టే కాలం మనుగడ సాగించేలదని, రాజకీయ పండితులు తొలి రోజు నుంచీ జోస్యం చెపుతూ వచ్చారు. బీజేపే అయితే, ప్రభుత్వాని  పడగొట్టేందుకు, తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకునేదుకు, అడుగడుగున విఫల ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. 

మహా అయితే ఆరు నెలలు, ఆ తర్వాత కష్టం అన్నారు. అయితే, ఆరు నెలలు, సంవత్సరం దాటి రెండేళ్ళు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి, శివసేన  అధినేత ఉద్దవ థాకరేకు గతంలో ప్రత్యక్ష పరిపాలన అనుభవం లేక పోయినా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పరిపాలనా అనుభవంలో ఆరి తేరిన కాంగ్రెస్ నాయకుల సహాయ సహకారాలతో ప్రభుత్వం సాఫీగా సాగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అంత సంతృప్తిగా లేక పోయినా, కూటమి గడప దాటే సాహసం చేయలేక పోతోంది. 

అయితే, మరో రెండు నెలలలో ముంబై మహానగర్ పాలిక సహా ఆరేడు కీలక కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కూటమిలో కొత్తగా లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ఇప్పటికే  ప్రకటిచింది. నిజానికి, కార్పొరేషన్ ఎన్నికలు మినీ అసెంబ్ీద ఎన్నికల స్థాయిలో జరుగుతాయని, ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని అవిష్కరిస్తాయని అంటున్నారు. 

ఇదలా ఉంటే, మహారాష్ట్రలో  మార్చి నెలలో బీజీపే  ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గతంలో శివసేనలో ఉన్నరాణే, శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగానూ పని చేశారు.  మరో  ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌లు ఢిల్లీల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్, ఆయన సహచరుడు ప్రఫుల్‌ పటేల్‌లు కూడా దేశ రాజధానిలోనే ఉండడంతో ఊహాగానాలు వ్యాపించాయి. శివ సేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్‌ అఘాడీ ఏర్పడి శనివారం నాటికి రెండేళ్లు పూర్తి కానుండడం గమనార్హం.

తొలుత నారాయణ్‌ రాణే రాజస్థాన్‌లోని జైపుర్‌లో విలేకరులతో మాట్లాడుతూ "మహారాష్ట్రలో మార్చి నెలలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది" అని చెప్పారు. దీనిని వివరించమని కోరినప్పుడు "ప్రభుత్వాలు కూలగొట్టడం, ఏర్పాటు వంటివి రహస్యంగా జరుగుతాయి. బహిరంగంగా వీటిపై చర్చలు జరపరని అన్నారు.  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ కూడా రాణే లెక్క తప్పదని, అది నిజమవుతుందన్న ఆశాభావం వ్యక్తపరిచారు. ఢిల్లీలో ఫడ్నవీస్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి చర్చలు జరిపినట్టు సమాచారం.ఈ విషయమై నాగ్‌పుర్‌లో పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పూర్తికాలం పాటు కొనసాగుతుందని చెప్పారు. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం, అది రాణే  కోరిక కావచ్చని అంటున్నారు. గతంలో ఫడ్నవీస్ సైతం ఆఘాడీ ప్రభుత్వం అంతర్గత విభేదాలతో దానికదే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానే, అదేమీ జరగా లేదు. ఆయినా తాజాగా నారాయణ్ రాణే మార్చి లోపు మార్పు ఖాయమని వ్యాఖ్యానించడం మహా రాజకీయాలను హీటెక్కిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో గతంలో చోటు చేసుకున్న అధికార మార్పిడి పరిణామాల రీత్యా మహా రాజకీయాల్లోనూ బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోందా అన్న చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని,
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.