మహా సర్కార్‌కు రెండేళ్ళు.. ప్రభుత్వం కులనుందా?

Publish Date:Nov 27, 2021

Advertisement

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ (ఎంబీఏ)కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజుకు (నవంబర్ 27)కి రెండేళ్ళు పూర్తయ్యాయి. అనూహ్య పరిణామాల్ అంది 2019 లో శివసేన అధినేత్ ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఏర్పడిన మూడు పార్టీల (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) అఘాడీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో అటుపోట్లు అనేకం ఎదుర్కుంది. అయినా అంచనాలను తల్లకిందులు చేస్తూ నిలబడింది. 

నిజానికి, లౌకిక (కాంగ్రెస్, ఎన్సీపీ)  మతోన్మాద (శివ సేన) పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం అట్టే కాలం మనుగడ సాగించేలదని, రాజకీయ పండితులు తొలి రోజు నుంచీ జోస్యం చెపుతూ వచ్చారు. బీజేపే అయితే, ప్రభుత్వాని  పడగొట్టేందుకు, తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకునేదుకు, అడుగడుగున విఫల ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. 

మహా అయితే ఆరు నెలలు, ఆ తర్వాత కష్టం అన్నారు. అయితే, ఆరు నెలలు, సంవత్సరం దాటి రెండేళ్ళు పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి, శివసేన  అధినేత ఉద్దవ థాకరేకు గతంలో ప్రత్యక్ష పరిపాలన అనుభవం లేక పోయినా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పరిపాలనా అనుభవంలో ఆరి తేరిన కాంగ్రెస్ నాయకుల సహాయ సహకారాలతో ప్రభుత్వం సాఫీగా సాగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అంత సంతృప్తిగా లేక పోయినా, కూటమి గడప దాటే సాహసం చేయలేక పోతోంది. 

అయితే, మరో రెండు నెలలలో ముంబై మహానగర్ పాలిక సహా ఆరేడు కీలక కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కూటమిలో కొత్తగా లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ఇప్పటికే  ప్రకటిచింది. నిజానికి, కార్పొరేషన్ ఎన్నికలు మినీ అసెంబ్ీద ఎన్నికల స్థాయిలో జరుగుతాయని, ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని అవిష్కరిస్తాయని అంటున్నారు. 

ఇదలా ఉంటే, మహారాష్ట్రలో  మార్చి నెలలో బీజీపే  ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. గతంలో శివసేనలో ఉన్నరాణే, శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగానూ పని చేశారు.  మరో  ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌లు ఢిల్లీల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్, ఆయన సహచరుడు ప్రఫుల్‌ పటేల్‌లు కూడా దేశ రాజధానిలోనే ఉండడంతో ఊహాగానాలు వ్యాపించాయి. శివ సేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్‌ అఘాడీ ఏర్పడి శనివారం నాటికి రెండేళ్లు పూర్తి కానుండడం గమనార్హం.

తొలుత నారాయణ్‌ రాణే రాజస్థాన్‌లోని జైపుర్‌లో విలేకరులతో మాట్లాడుతూ "మహారాష్ట్రలో మార్చి నెలలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది" అని చెప్పారు. దీనిని వివరించమని కోరినప్పుడు "ప్రభుత్వాలు కూలగొట్టడం, ఏర్పాటు వంటివి రహస్యంగా జరుగుతాయి. బహిరంగంగా వీటిపై చర్చలు జరపరని అన్నారు.  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ కూడా రాణే లెక్క తప్పదని, అది నిజమవుతుందన్న ఆశాభావం వ్యక్తపరిచారు. ఢిల్లీలో ఫడ్నవీస్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి చర్చలు జరిపినట్టు సమాచారం.ఈ విషయమై నాగ్‌పుర్‌లో పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పూర్తికాలం పాటు కొనసాగుతుందని చెప్పారు. అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం, అది రాణే  కోరిక కావచ్చని అంటున్నారు. గతంలో ఫడ్నవీస్ సైతం ఆఘాడీ ప్రభుత్వం అంతర్గత విభేదాలతో దానికదే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానే, అదేమీ జరగా లేదు. ఆయినా తాజాగా నారాయణ్ రాణే మార్చి లోపు మార్పు ఖాయమని వ్యాఖ్యానించడం మహా రాజకీయాలను హీటెక్కిస్తోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో గతంలో చోటు చేసుకున్న అధికార మార్పిడి పరిణామాల రీత్యా మహా రాజకీయాల్లోనూ బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోందా అన్న చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని తెలిపింది. గురువారం నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు ఐఎండీ ధృవీకరించింది.
శుక్రవారం... అదే రేపు ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ కావాల్సి ఉంది. ఈ రోజు అంటే ఒక రోజు ముందు క్యాట్ ఉత్తర్వుల్ని సమర్దించింది హైకోర్టు. ఏబీవీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేసి తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని, క్యాట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పేసింది.
జగన్‌కి, జవహర్‌రెడ్డికి ఎంత ఫెవీకాల్ లాంటి స్నేహమైనా, జూన్ నాలుగో తారీఖు వరకే. ఇప్పటి వరకూ సాఫీగా సాగిన, ఇద్దరి పదవులు ఊడిపోయిన తర్వాత ఒకరి అవసరం మరొకరికి వుంటే కొనసాగిన ఇద్దరి స్నేహంలో ఒక చిచ్చు వచ్చి పడింది. ఆ చిచ్చు పేరే ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.
నైరుతి రుతు పవనాలు కేరళను తాకిన నేపథ్యంలో తెలంగాణ వాసులకు చల్లని కబురు అందింది. వేసవి కాలానికి ఇక గుడ్ బై చెప్పే విధంగా శనివారం నుంచి వరుసగా మూడు రోజులు వానలు పడనున్నాయి. 
ఎపి సార్వత్రిక ఎన్నికల్లో మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటనలు మరెక్కడా జరగలేదు.  టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యాలరావు కలిశారు
ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
‘మనిద్దరం గతంలో మంచి ఫ్రెండ్స్. ఓటుకు నోటు కేసు సమయంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇక మనిద్దరం అవన్నీ మరచిపోదాం. నువ్వు నామీద మనసులో ఏమీ పెట్టుకోకుండా వుంటే చాలు’ అని కామన్ ఫ్రెండ్స్ ద్వారా రేవంత్‌కి ఎర్రబెల్లి స్నేహ సందేశం పంపినట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు అయితే ఆయనకు ఒక్కరోజు పోస్టు ఇవ్వాలన్న ఉద్దేశంలో సీఎస్ వున్నట్టు తెలుస్తోంది. అలా ఇవ్వని పక్షంలో ఈ దేశంలో మానవత్వం, చట్టం, ధర్మం, న్యాయం అనేవి ఉన్నాయని అనుకోవడం అనవసరం అనే అభిప్రాయానికి నిస్సందేహంగా రావచ్చు.
ఎన్నికల ముందు వరకూ ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా వైనాట్ 175 అంటూ ఊదరగొట్టిన జగన్ పోలింగ్ తరువాత కంటే గతం కంటే ఎక్కువ స్థానాలు అంటూ ప్లేటు ఫిరాయించారు. అంటే వైసీపీ మొదటి నుంచీ చెప్పుకు వస్తున్న వైనాట్ 175 వట్టి మైండ్ గేమ్ నినాదమే అని స్వయంగా జగనే తేల్చేశారు. అయితే ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ ఆ నియోజకవర్గం నుంచి జగన్ కు ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన బీటెక్ రవి ధీమాగా చెబుతున్నారు.
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో వైసీపీ సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఓసారి సస్పెండ్ చేయడంతో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఊరటపొందిన ఆయన్ను రెండోసారి బిజినెస్ రూల్స్ పేరుతో సస్పెండ్ చేశారు. అయితే ఇలా రెండోసారి సస్పెన్షన్ చేయడం చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్ను హైకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వానికి అక్కడా ఊరరట దక్కలేదు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చేశాయి. చివరి విడత పోలింగ్ జూన్ 1 అంటే శనివారం జరుగుతుంది. ఆ తరువాత మూడు రోజులకు అంటే జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుంది. ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ సరళిని బట్టి చూస్తూ బీజేపీ ఘనంగా చాటుకుంటున్నట్లు సొంతంగా కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టడానికి అవసరమైన స్థానాలు సాధించే అవకశాలు దాదాపుగా లేవనే అంటున్నారు.
హిందీలో, ఉర్దూలో గతంలో తెలంగాణ సర్కార్ అని వుండేది. ఇప్పుడు తెలంగాణ శాసన్ అని వుంటుంది.
తెలంగాణా ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం స్ఫూరించేలా కొత్త చిహ్నం...తెలంగాణా రాజ‌ముద్ర‌ రూపొందించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా రూపొందించిన రాష్ట్రప్రభుత్వ లోగో, అమరవీరుల త్యాగాలను నిరంతరం అందరికీ గుర్తుచేస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.