Publish Date:Nov 18, 2021
అన్న కేటీఆర్కు రాఖీ కట్టలేదు. ప్రగతి భవన్లో బతుకమ్మ ఆడలేదు. టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా రాలేదు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు బాగా ముదిరిపోయాయన్నారు. కేసీఆర్ను సీఎం చేయడం కవితకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఆస్థి గొడవలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో కవిత ఎమ్మెల్సీ టర్మ్ కూడా ముగిసింది. ఆమెకు మరోసారి ఆ రెన్యూవల్ దక్కదనే ప్రచారం జరిగింది. ఇక కవిత పని ఖతం అన్నారంతా..
అయితే, అనూహ్యంగా కవితను రాజ్యసభకు పంపిస్తారంటూ లీకులు వచ్చాయి. బిడ్డను ఎంపీ చేసి, పార్లమెంట్కు పంపించి, కుదిరితే కేంద్ర మంత్రిని కూడా చేస్తానని కేసీఆర్ తన కూతురిని బుజ్జగించారని అంటున్నారు. ఇలా కవితమ్మ అలకను కేసీఆర్ తీర్చారని చెబుతున్నారు.
నిజమే కాబోలు.. అందుకే కాబోలు.. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనిది.. ధర్నాచౌక్లో ప్రభుత్వం తరఫున నిర్వహించిన మహాధర్నాలో కవిత హాజరయ్యారు. టీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి ధర్నాలో కూర్చున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ధర్నాలో కవిత కనిపించడంతో.. మీడియా కెమెరాలన్నీ అటువైపు ఫోకస్ చేశాయి. కవితను జూమ్ చేసి మరీ చూపించాయి. ఫోటోలు క్లిక్ మనిపించాయి. మహాధర్నాలో కవితనే ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యారు. మరోవైపు, కేటీఆర్ మాత్రం వేదికపై కాకుండా.. కింద పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాలో కూర్చున్నారు.
కేసీఆర్ దగ్గరకు కవితకు ఎంట్రీ లేకున్నా.. కేటీఆర్ను కలవకున్నా.. కల్వకుంట్ల కుటుంబంలో ఫ్యామిలీ వార్ ముగిసిపోయిందని అంటున్నారు. కవిత రాకనే అందుకు నిదర్శనమని చూపిస్తున్నారు. మరి, కేసీఆర్తో, కేటీఆర్తో మాట్లాడలేదుగా? అంటే.. ధర్నా కదా.. అందుకే మాట్లాడలేదని చెబుతున్నారు. కవితకు రాజ్యసభ సీటు ఇస్తానని కేసీఆర్ బుజ్జగించారని.. ఆమె అలక వీడారని.. అందుకే మళ్లీ యాక్టివ్ అయ్యారని.. అంటున్నారు. అలకైతే వీడారు కావొచ్చు కానీ, కుటుంబ కలహాలు మాత్రం సమసిపోలేదని.. ఇది కేవలం టెంపరరీ అడ్జస్ట్మెంట్ మాత్రమేననేది కొందరి మాట. అసలు సంగతి మాత్రం ఆ ముగ్గురికే తెలియాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-kavitha-conflict-closed-in-kcr-family-25-126629.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు