ముందస్తుకు మరో సంకేతం?.. కేసీఆర్ నోట దళిత బంధు మాట..

Publish Date:Jan 23, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్’కు మళ్ళీ ఇన్నాళ్ళకు దళిత బంధు గుర్తుకు వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తెర మీదకు తెచ్చిన పథకాని, ఎన్నికలు అయిపోగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అటక ఎక్కించారు. ముందు 2021 నవంబర్ 4 వరకు ఎన్నికల కోడ్’ను అడ్డుపెట్టుకుని,ఆ తర్వాత ఏకారణం చెప్పకుండానే, ప్రభుత్వం దళిత బందు అమలును నిలిపేసింది. గడచిన రెండున్నర నెలలుగా, ప్రభుత్వ పెద్దలు  ఆ మాట తీయకుండా మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వం, అధికార పార్టీ మాత్రమే కాదు ప్రతిపక్షాలు కూడా ఎందుకనో గానీ ఆ ఊసే ఎత్తలేదు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు 2021 నవంబర్ 2 న వచ్చాయి. నవంబర్ 4నుంచి హుజూరాబాద్’లోనే కాదు రాష్ట్రంలో ఎంపిక చేసిన నియోజక వర్గాలు / మండలాల్లో కూడా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి  చెప్పారు. డిసెంబర్‌లోపే హుజురాబాద్‌తో పాటు నాలుగు ఎంపిక చేసిన మండలాల్లో దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. మార్చిలోపు అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో వంద మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి, ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయలచొప్పున   ఇస్తామన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత, కథ అడ్డం తిరిగిందనో, మరెందుకో కానీ, దళిత బందు విషయంలో సర్కార్ సైలెంట్ అయిపోయింది. అయినా విపక్షాలు పథకం ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ఆందోళనలు చేస్తామని ప్రకటించిన హుజూరాబాద్’ లో గెలిచిన తెరాస రెబెల్ లీడర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా మౌనంగా ఉండిపోయారు. మీడియా, జనం కూడ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని కూడా దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమీ, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి అమలు కాని హామీల జాబితాలో చేర్చేశారు అనుకునంరో ఏమో కానీ, ఏక్కడా దళిత బంధు దగా ముచ్చట వినిపించలేదు.  

అయితే, అందరూ మరిచి పోయిన పథకాన్ని ముఖ్యంత్రి కేసీఆర్ ఇప్పుడు తెర మీదకు తెచ్చారు. పథకం అమలుకు సంబందింఛి జిల్లా కల్లెక్టర్లు, సంబందిత  అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ హడావిడి ఔఇతె మొదలైంది. ఇదే విషయంగా మంత్రి గంగుల అధికారాలతో   వర్చువల్’ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో యూనిట్‌కు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయమని సీఎం కేసీఆర్‌ అధికారులను అదేశించారు.లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయాలన్నారు. ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు ఆమోదించాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్లు కేటాయించామని … ఈ నిధుల్లో ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. మిగతా నిధులను విడతల వారీగా విడుదల చేస్తామని ప్రకటించారు. 

అయితే, అత్యంత బలమైన ఎన్నికల అస్త్రంగా భావించిన ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా, అంబుల  పోదిలోంచి ఈ అస్త్రాన్ని ఎందుకు పైకి తీశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళక తప్పని పరిస్థితి తరుముకోస్తోందా, ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి ముందుగా దళిత బందు అస్త్రాన్ని సిద్దం చేసుకుంటున్నారా? లేక దళితబందు దగాకు 100 రోజులు పూర్తవుతున్న నేపధ్యంలో, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున  ఆందోళనకు సిద్డంవుతున్న సమాచారం అంది, ముందుగానే ముఖ్యమంత్రి మేలుకున్నారా? అంటే అదీ ఇదీ రెండూ కావచ్చని, అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో దళిత బందు పథకాన్ని అమలు చేయడం అయ్యే పని కాదని తెరాస నాయకులే అంటున్నారు. ఒక విధంగా ముఖ్యమంత్రి తేనేతుట్టను కదిలిస్తున్నారని, పార్టీ నాయకులు ప్రైవేటు టాక్ ‘లో ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.

By
en-us Political News

  
ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించారు.
హిమాచల్ విజయంతో ఊపిరి తీసుకుని, కర్ణాటక గెలుపుతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం చివర్లో జరిగే తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చూపి, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
2 జూన్ 2014 తెలంగాణలో చారిత్రాత్మక రోజు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి  కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ ఆవిర్భావం జరిగి నేటికి 9 ఏళ్లు పూర్తవుతుంది. ఇది పచ్చి నిజం. కానీ తెలంగాణ ప్రభుత్వం
రోజుకో మలుపు తిరుగుతున్న వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా అజ్ణాత సాక్ష్యులు కీలక సమాచారాన్ని అందిస్తున్నారు. అజ్ణాత సాక్షుల సమాచారంతో సీబీఐ ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారాన్ని జోడించి నివేదికలు తయారు చేస్తోంది.
రాజస్థాన్ ప్రజలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్
తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల విషయంలో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలూ పొలిటిల్ మైలేజీ కోసం పోటీ పడుతున్నాయి. తెలంగాణ సాధించింది మేమేనంటూ బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనంటూ కాంగ్రెస్, అన్ని విధాలుగా సహకరించింది మేమేనంటూ బీజేపీ పోటాపోటీగా ఉత్సవాల నిర్వహణకు సమాయత్తమౌతున్నాయి.
రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లపైనే దాష్ఠీకాలు జరుగుతున్న తీరు మోడీ ప్రతిష్టను నిలువునా ముంచేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల విషయమై గత ఏడాదిగా ఏదో ఒక రూపంలో చర్చ సాగుతూనే ఉంది. కూటములు, సమీకరణాల విషయంలో విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడానికో, లేక సొంత క్యాడర్ ను అలర్ట్ గా ఉంచడానికో అధికార వైసీపీ అగ్రనాయకత్వమే ఈ చర్చను సజీవంగా ఉంచింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (మే31) తిరుమల శ్రీవారిని 80వేల 284 మంది దర్శించుకున్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచాయి. తెలంగాణలోనూ అధికారంలోకి రాగలమనే విశ్వాసాన్ని మరో మెట్టు పైకి తీసుకు వెళ్ళాయి.
ఇకపై ఓటీటీలో ప్రసారమయ్యే వాటికి పొగాకు వ్యతిరేక హెచ్చరికలను కంపల్సరీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల పొగాకు వ్యతిరేక ప్రచారం ప్రజల్లోకి వెళుతుంది కానీ అమలు
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ బుధవారం ( మే 31) తుది తీర్పు ఇచ్చేసింది.
మహారాష్ట్రలో రాజకీయం మరో మారు వేడెక్కింది. గతేడాది ఇదే జూన్ నెలలో అప్పటి అధికార కూటమి మహా వికాస్ అఘాడి లో సంక్షోభం ఏర్పడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.