Publish Date:Apr 23, 2024
ప్రపంచ రాజకీయాల్లో తాజాగా ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది... అదే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ పాకిస్తాన్ దేశాన్ని సందర్శించడం. నిన్న అంటే, సోమవారం నాడు ఇబ్రహీమ్ రైసీ ఇస్లామాబాద్కి వచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ని కలిశారు. ఒక దేశ అధ్యక్షుడు మరో దేశ ప్రధానమంత్రిని స్నేహపూర్వకంగా కలిస్తే తప్పేంటన్న సందేహాలు ఎవరికైనా కలగొచ్చు. అయితే పాకిస్తాన్, ఇరాన్ మధ్య స్నేహసంబంధాలు లేవు. మొదట్నుంచీ ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా గత జనవరిలో రెండు దేశాల సరిహద్దులో పరస్పరం వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్కి చెందిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ‘మేమేం పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న జైష్ అల్ అద్ల్ అనే అతివాద గ్రూపు మీద దాడి చేశాం’ అని ఇరాన్ చాలా తెలివిగా చెప్పినప్పటికీ, పాకిస్థాన్కి ఆ సంఘటన ఆగ్రహాన్ని తెప్పించింది. నేను మాత్రం తక్కువా అన్నట్టుగా, ఇరాన్ భూభాగంలోకి ఒక క్షిపణిని ప్రయోగించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో వున్న తన రాయబారిని వెనక్కి పిలిపించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు పూర్తిగా అడుగంటిపోయాయి.
మరి, ఇంతకాలం ఉప్పు, నిప్పులా వున్న ఈ రెండు దేశాల నాయకులు ఇంత అకస్మాత్తుగా ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అంటూ స్నేహగీతాన్నిఆలాపించడం వెనుక కారణాలను అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్దంలోకి ఈమధ్య ఇరాన్ కూడా ఎంటరైంది. కొద్ది రో్జుల క్రితమే ఇజ్రాయిల్ మీద ఆయుధాలతో దాడులు కూడా చేసింది. ఇజ్రాయిల్ కూడా తక్కువదేం కాదు కదా.. ఇరాన్ని అదను చూసి దెబ్బ తీయడానికి ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ఇవ్వడానికి గానీ, ఇంధనం తదితర అవసరాల కోసం గానీ ఇరాన్కి పాకిస్తాన్తో అవసరం వుంది. అలాగే పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే వుంది. ఇటువైపు ఇండియాతో గొడవ, అటువైపు ఆఫ్ఘనిస్తాన్తో కయ్యం. దానికి తోడు దేశంలో తాండవిస్తున్న కరవు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి కూడా అంతర్జాతీయంగా అండ కావలసి వుంది. దాంతో ‘నీకు నీ వారు లేరు.. నాకు నా వారులేరు’ అన్నట్టుగా ఈ రెండు దేశాలు కౌగిలించుకున్నాయి. అయితే ఈ కౌగిలి కాలం గడిచేకొద్దీ మరింత బలంగా మారుతుందా, లేక ధృతరాష్ట్ర కౌగిలిగా మారుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. ఈ పరిణామాలను భారత విదేశాంగ శాఖ గమనిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iranian-president-ebrahim-raisi-is-in-pakistan-39-174338.html
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.