చివరి బంతి వరకూ ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో విజయం.. హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్ థ్రిల్లర్

Publish Date:May 3, 2024

Advertisement

బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్-  రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అటు ఆటగాళ్లనే కాదు స్టేడియంలో ఆ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షకులతో పాటు టీవీలు, ఫోన్లలో వీక్షిస్తున్న లక్షల మందికి బ్లడ్ ప్రషర్ పెంచేసింది. ఇది కదా మజా అంటే అనుకునేలా చేసింది. వీక్షకులందరినీ  మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచింది. అది వేరే సంగతి. కానీ ఈ మ్యాచ్ లో నిజమైన విజేత మాత్రం క్రికెట్టే. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఎందుకుంత పాపులర్ గేమ్ అయ్యిందో.. ఇప్పటి దాకా అర్ధం కాని వారెవరైనా ఉంటే, వారీ మ్యాచ్ చూసి ఉంటే అర్దమైపోయి ఉంటుంది. ఏళ్ల తరబడి గుర్తుండిపోయే మ్యాచ్ లా ఇది తప్పకుండా మిగిలిపోతుంది. విజయం కోసంఇరు జట్లు సర్వం ఒడ్డి పోరాడాయి. చివరి ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో  ఆ ఆఖరు మెట్టుపై రాజస్థాన్ తడబడింది. మ్యాచ్ చేజార్చుకుంది. చివరి ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్ రాజస్థాన్ బ్యాటర్ పావెల్ ను ఔట్ చేయడంతో  హైదరాబాద్ జట్లు విజేతగా నిలిచింది. అయితే క్రికెట్ అభిమానుల మనస్సులను మాత్రం హైదరాబాద్ తో పాటు రాజస్థాన్ కూడా గెలుచుకుంది. ఇరు జట్లూ కలిసి క్రికెట్ ను గెలిపించాయి.  

ఇక మ్యాచ్ వివరాలలోకి వస్తే  తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 2012 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో నితీశ్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు సాధించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్  ట్రావిస్‌ హెడ్‌  44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో  58 పరుగులు చేశాడు. చివరిలో క్లాసిన్ మెరుపులు తోడవ్వడంతో  హైదరాబాద్ 201 పరుగులు చేయగలిగింది. 202 పరుగుల విజయ లక్ష్యంతదో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్  అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.  అయితే ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ లోనే  సూపర్‌ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ను, కెప్టెన్‌ సంజూ శాంసన్‌  భువనేశ్వర్‌ కుమార్‌  పెవిలియన్ కు పంపేశాడు.  బట్లర్‌ రెండో బంతికి జాన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌  అయితే,  ఐదో బంతికి శాంసన్‌ క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు. ఇద్దరూ డకౌట్ అయ్యారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే సాధించిన రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది.

అయితే ఈ దశలో  మరో  ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, రెండో డౌన్ లో వచ్చిన పరాగ్ లు జట్టును పోరాటంలో నిలిపారు. వీరిద్దరి దూకుడైన ఆటతో రాజస్థాన్ పది ఓవర్లకు 100 పరుగులు పూర్తి చేసింది. జట్లు స్కోరు 135 పరుగుల వద్ద ఉండగా జైస్వాల్ నటరాజన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత రెండు ఓవర్లకే కమిన్స్ బౌలింగ్ లో పరాగ్ వెనుదిరిగాడు.  దీంతో 16 ఓవర్లకు ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో ఆజట్టు విజయానికి 42 పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం రాజస్థాన్ వైపే ఉందని పించింది.  నటరాజన్‌ వేసిన 18వ ఓవర్‌లో హెట్‌మయర్‌ ఔటయ్యాడు జురెల్‌ ఔటై పెవిలియన్ కు చేరడం,  19వ ఓవర్‌ను కమిన్స్‌ పొదుపుగా వేసి కేవలం 7 పరుగులే ఇవ్వడంతో  విజయం కోసం   చివరి ఓవర్ లో  13 పరుగులు చేయాల్సి వచ్చింది.

ఆ చివరి ఓవర్ ను భువనేశ్వర్ వేశాడు.  తొలి బంతికి అశ్విన్‌ సింగిల్‌ రెండో బంతికి పావెల్‌ రెండు  మూడో బంతికి ఫోర్‌ తో తొలి మూడు బంతులకే ఏడు పరుగులు వచ్చాయి. ఆ తరువాతి రెండు బంతులకు నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో చివరి బంతికి రెండు పరుగులు చేస్తే విజయం, ఒక పరుగు చేస్తే టై అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇరు జట్లలోనూ ఉత్కంఠ తారస్థాయికి వెళ్లింది. అయితే చివరి బంతికి భువనేశ్వర్  పావెల్ ను లెగ్ బిఫోర్ గా ఔట్ చేయడంతో రాజస్థాన్ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది.  

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.