పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపు

Publish Date:Apr 14, 2013

Advertisement

 

ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిలకడైన బ్యాంటింగ్ తో తక్కువ స్కోరును ఛేదించి గెలుపు సొంతం చేసుకుంది. టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ 10 ఓవర్లలో కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్ బౌలర్ శ్రీశాంత్ వేసిన రెండో ఓవర్లో పంజాబ్ కెప్టెన్ ఆడమ్ గ్రిల్ క్రిస్ట్ (0), మన్ దీప్ (2) పరుగుల చేసి ఔటయ్యారు. మరుసటి ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించిన వోహ్రా (3) రనౌట్ అయ్యాడు. మైఖేల్ హస్సీ, గురుకీరత్ లు నిలకడగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 31 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ ఇన్నింగ్స్ లో హస్సీ (41) ఒక్కడే అత్యధిక స్కోరు చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ చివర్లో ప్రవీణ్ కుమార్ 7 బంతుల్లో 15 పరుగులు (2ఫోర్లు,  1 సిక్స్) చెలరేగి ఆడడంతో పంజాబ్ 124 పరుగులైనా చేయగలిగింది. పంజాబ్ ఇన్నింగ్స్ లో గురుకీరత్ 10, సతీష్ 11,  అజార్ మెహమూద్ 23, చావ్లా 7, పర్మిందర్ ఆవానా 0, హారీస్ 2 నాటౌట్ గా నిలిచాడు. శ్రీశాంత్ 2, కెవోన్ కూపర్ 2, ఫాల్కనర్ 2, తివేది 2 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ వాట్సన్ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. వాట్సన్ 19 బంతుల్లో 32 పరుగులు (7 బౌండరీలు) చేసిన తరువాత ఆవానా బౌలింగ్ లో మన్ దీప్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ద్రావిడ్ 9,  బిన్నీ 0 లను ప్రవీణ్ కుమార్ ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. ఒక పక్క వికెట్లు పడిపోతున్నా ఓపెనర్ రహానే నిలకడగా ఆడుతూ రాజస్థాన్ రాయల్స్ ను నాలుగు బంగులు మిగిలి వుండగానే 126 పరుగల విజయలక్ష్యాన్ని ఛేదించాడు. హాడ్జ్ 15, శ్యామ్ సన్ 23 బంతుల్లో 27 పరుగులు (3 బౌండరీలు)తో అజేయంగా నిలిచాడు. రహానే 42 బంతులలో 34 పరుగులు (3బౌండరీలు) లతో నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో ప్రవీణ్ 2, ఆవానా 1, పియూష్ చావ్లా 1 వికెట్లు పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఫాల్కనర్ నిలిచాడు.

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.