Publish Date:Mar 18, 2025
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రతిపక్షం అనేదే లేని సభలో.. ఉన్న ఒకే ఒక్క ప్రత్యర్థి పార్టీ కూడా హాజరు కాకపోవడంతో సభ సాఫీగా సాగుతోంది. బడ్జెట్ ప్రవేశ పెట్టడం, బడ్జెట్ పై చర్చ, వివిధ బిల్లుల ఆమోదం వంటి వన్నీ ఏ ఆటంకాలూ, అవాంతరాలు, అభ్యంతరాలూ లేకుండా జరిగిపోయాయి. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం వాడిగా వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో సభ వేడెక్కుతోంది.
అదే సమయంలో అసెంబ్లీ ఆవరణలో కొన్ని భేటీలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. వాటిలో ప్రధానంగా కాంగ్రెస్ భహిష్కృత ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్పఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఒకటి. అక్కడ ఆయన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. అలాగే మరో మాజీ మంత్రి హరీష్ రావుతో కూడా ముచ్చటించారు. ఆయన వారితో ఏం మాట్లాడారు. ఏ విషయంపై చర్చించారు అన్నది పక్కన పెడితే తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి వెళ్లి కేటీఆర్, హరీష్ రావులతో చర్చలు జరపడం తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆ భేటీలపై చర్చ కొనసాగుతుండగానే మంగళవారం (మార్చి 18) తెలంగాణ అసెంబ్లీలో మరో సంచలన భేటీ జరిగింది. ఈ సారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ అయ్యారు. వీరిరువురూ కలిసి ఫొటోలకు పోజులిచచ్చారు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ సమావేశం నుంచి కేటీఆర్ బయటకు వెడుతుండగా.. జానా రెడ్డి ప్రవేశిస్తున్న సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జానా కారు చూడగానే కేటీఆర్ హాయ్ అంకుల్ అంటూ పలకరించి ఆయన వద్దకు వెళ్లారు. జానా రెడ్డి కూడా కేటీఆర్ ను ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ జానాను హత్తుకుని ఆయన వయస్సుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు వయసెక్కడ అయిపోయింది.. సెంచరీ కొట్టాలి, కొడతారు అని కేటీఆర్ అన్నారు. దీనికి జానా రెడ్డి నవ్వులు చిందించారు. మొత్తం మీద తీన్మార్, జానాలతో కేటీఆర్ భేటీలు తెలంగాణ రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/intresting-developement-in-tllangana-politics-39-194588.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.