ప్రపంచము-శాంతి అంతిమ లక్ష్యమేంటి?

Publish Date:Sep 21, 2022

Advertisement

శాంతి అనేది ఎన్నో జీవితాలను సమస్యల నుండి బయట పడేస్తుంది. ఎలాంటి భయాందోళనలు లేని జీవితం గడిపేలా చేస్తుంది. అందుకే ఎందరో ప్రముఖులు శాంతి కోసం పోరాడారు. ప్రపంచానికి శాంతి కావాలని, అదే ప్రపంచాన్ని ఉన్నతంగా నిలబెడుతుందని. శాంతి వల్లనే అన్ని దేశాలు, అన్ని వర్గాలు ప్రజలు తమ జీవితాన్ని తాము హాయిగా గడపగలుగుతారు. 

 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 21ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు.  ఈ శాంతి దినోత్సవం రోజు ఐక్యరాజ్యసమితి 24 గంటల పాటు ఎక్కడా హింస, పీడించడం,  కాల్పులు జరపడం వంటివి చేయకూడదని. దీని ద్వారా కలిగే చిన్నపాటి మార్పు ప్రజలలో ఆలోచనను రేకెత్తి ఆ మార్పు దీర్ఘకాలం వైపు మరలేలా అడుగులు పడటానికి మూలమవుతుందని నిర్ణయించింది. ఈ విధంగా  శాంతి దినోత్సవాన్ని పాటించడం ద్వారా శాంతి ఆదర్శాలను బలోపేతం చేయడానికి  సాధ్యమవుతుంది. 

 ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు హింసాత్మకమైన, రక్తపాతమైన గతాన్ని కలిగి ఉన్నాయి. ఈ దేశాలలో కొన్ని తమ దేశ పౌరుల భవిష్యత్తును, దేశ భవిష్యత్తును, ప్రపంచంలో వారి మనుగడను దృష్టిలో ఉంచుకుని తమ ధోరణి మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ, శాంతి దినోత్సవాన్ని తమలో అంతర్భాగం చేసుకోవడానికి, ప్రజల ఆలోచనల్లో మార్పులు తీసుకురావడానికి ముందడుగు వేస్తున్నాయి. అయితే మరికొన్ని దేశాలు మాత్రం సరిహద్దులలో ఉన్న ఇతర దేశాలతో హింసాత్మకంగా కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతికి భంగం కలిగిస్తుంటాయి. 

ఇలాంటి వాటిని అరికట్టడానికే ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ శాంతి దినోత్సవ చరిత్ర ఏమిటి?? 

1981లో ఈ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆమోదం చేయబడింది.ఆ తరువాత ఇరవై సంవత్సరాలకు ప్రపంచంలో చాలా దేశాలు శాంతి దినోత్సవం వైపు అడుగులు వేసాయి. 

శాంతి దినోత్సవం మాట!!

చివరి ఏడాది కరోనా విలయతాండవం చేస్తుండటంతో కరోనా నుండి ప్రపంచం కోలుకోవాలనే థీమ్ తో శాంతి దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే 2022 సంవత్సరంలో శాంతి దినోత్సవాన్ని జాత్యహంకారం నశించాలనే నినాదంతో జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రపంచంలో ఎన్నో దేశాలలో జాతి, వర్గ బేధాలను అనుసరించి మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి. దేశాలు, దేశాల మధ్య ఏర్పడిపోయే ఈ అభద్రాభావ చర్య మనుషుల్ని, సమాజాన్ని, సరిహద్దు ప్రాంతాల ప్రజలను, ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారిని భయాందోళనలో నెట్టేస్తాయి.

శాంతి బహుమతి!!

ప్రపంచ వ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసిన వారికి, అహింస కోసం పోరాడిన వారికి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేస్తారు. మొదటి నోబెల్ శాంతి బహుమతి 1901లో అందించారు. దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు, సౌబ్రాతృత్వం కోసం దేశాల మధ్య పగలు, శత్రుత్వాలు తగ్గించే దిశగా కృషి చేసేవారికి శాంతి బహుమతి అందజేయడం జరుగుతుంది. 

ప్రశాంత దేశం!!

ప్రపంచంలో అత్యంత ప్రశాంత దేశంగా 2008లో ఐస్ ల్యాండ్ గుర్తించబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం దాని స్థానాన్ని అది నిలబెట్టుకుంటూ వస్తోంది. 

కొన్ని ఆసక్తికర విషయాలు!!

2015లో హింస వల్ల జరిగిన ఆర్థిక వ్యయం 13.6 ట్రిలియన్లు.

 సెప్టెంబర్ 2015 నాటికి హింసాత్మక విషయాలను కలిగి ఉన్న ఉగ్రవాద వెబ్‌సైట్‌ల సంఖ్య 9,800 గా ఉంది. ఇవన్నీ హింసను ప్రేరేపిస్తాయ్.

 1992 మరియు 2019 మధ్య మహిళా సంధానకర్తల శాతం 13%.

1992 మరియు 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రధాన శాంతి ప్రక్రియల్లో సంతకం చేసిన మహిళల శాతం 6%. 

 2015 మరియు 2019 మధ్య కాల్పుల విరమణ ఒప్పందాల శాతం11%. ఇందులో లింగ నిబంధనలు కూడా ఉన్నాయి.

 ప్రపంచంలోని అత్యంత ఘోరమైన ఆహార సంక్షోభం కారణంగా యెమెన్ జనాభాలో అంచనా వేసిన వారి సంఖ్య 15.9 మిలియన్లు. 

 2019లో తీవ్రమైన ఆకలితో జీవిస్తున్న వారి సంఖ్య 135 మిలియన్లు. 

 సంఘర్షణ చెందుతున్న  దేశాలలో తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న వ్యక్తుల శాతం 60%

 అక్టోబర్ 2020 నాటికి మహిళలు, శాంతి  భద్రతపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలను కలిగి ఉన్న దేశాల సంఖ్య 88. 

  COVID-19 సంక్షోభానికి ప్రతిస్పందనగా జాతీయ ప్రభుత్వాలు రూపొందించిన విధాన చర్యల సంఖ్య 417. 

  2016లో సాయుధ పోరాట ప్రాంతాల్లో నివసిస్తున్న యువత 408 మిలియన్లు అని అంచనా.

ఇకపోతే ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా అందరూ తెలుసుకోవలసిన విషయాలు.

ప్రపంచం, ప్రపంచం చుట్టూ ఉన్న పరిస్థితులు, విషయాలు అన్నీ తెలుసుకుని వాటిని అర్థం చేసుకోవాలి. 

ఆర్థిక, ఆహార భద్రతను సామాజిక పరంగా దృడం చేసుకోవాలి.

అన్ని రకాల, అన్ని వయసుల వారికి కేటాయించబడిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి.

సమానత్వం కోసం, సమన్యాయం కోసం పోరాడాలి.

ప్రజాస్వామ్య నిర్ణయాలను, ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఉద్దేశ్యాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకోవాలి.

                                       ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.