వీధిపోరాటాల స్థాయికి తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు!.. కొత్త అధ్యక్షుడి ఎంపిక అంత వీజీ కాదు

Publish Date:Nov 20, 2024

Advertisement

దక్షిణాదిలో పాగా వేయాలన్న ఆకాంక్ష నరవేర్చుకోవడానికి బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణను తన రాజకీయ ప్రయోగశాలగా మార్చేసింది. రాష్ట్రంలో కమలం పార్టీకి ఏదో మేరకు బలం ఉండటం.. అర్బన్ ప్రాంతాలలో నాయకత్వం బలంగా ఉండటంతో 2023 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం దాదాపు ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన కమలనాథులు పార్టీని మరింత పటిష్ఠం చేసే దిశగా వడివడిగా అడుగులు వేశారు. అయితే ఆ అడుగులన్నీ తప్పుటడుగులుగా ఆ ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. 

తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా.. వర్గ పోరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ పురోగతి రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు అన్న చందంగానే తయారైంది. అందుకు ముఖ్యంగా పార్టీ బలోపేతం పేరిట బీజేపీ అగ్రనాయకత్వం ఇతర పార్టీల నుంచి వేరువేరు రాజకీయ కారణాలతో వచ్చే వారికి తలుపులు బార్లా తెరిచేయడమే.  దీంతో  పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు వీధి పోరాటాల స్థాయికి చేరుకున్నాయి. దీంతో తెలంగాణలో  బీజేపీ ప్రయోగం పూర్తిగా విఫలమైంది. ఇరత పార్టీల నేతలు, తొలి నుంచీ పార్టీలోనే ఉన్న వారి మధ్య పంచాయతీలు తీర్చ లేక అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీ పటిష్ఠత అన్న విషయాన్నే వదిలేసినట్లుగా కనిపిస్తోంది. 

గత ఎన్నికల సముదాయంలో ఇంటి పోరును సరిదిద్దేందుకు అప్పటికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి పార్టీ రాష్ట్ర పగ్గాలను కిషన్ రెడ్డికి అప్పగించి చేతులు కాల్చుకుంది. ఆ ఎన్నికలలో అధికారం చేపట్టాలని కలలుగన్న పార్టీ కేవలం మూడో స్థానానికి పరిమితమైంది. 
ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు పూర్తై ఐదు నెలలు గడిచినా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో మరో అధ్యక్షుడిని నియమించాలని అధిష్ఠానం ఎంత ప్రయత్నిస్తున్నా.. అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎంపిక చేయడంలో విఫలమౌతోంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ, రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టం అనీ, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ బీజేపీ హైకమాండ్ చెప్పిన మాట ఇప్పటికీ ఆచరణలోకి రాకపోవడానికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణం.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో   ఈటల రాజేందర్ ఉన్నా ఆయనకు ఆ పదవి రాకుండా బండి సంజయ్ అడ్డం పడు తున్నారని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని ఒక్క బండి సంజ య్ మాత్రమే కాదు.. బీజేపీలోని కోర్ హిందూవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ లాంటి సంస్థలు కూడా గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు   బీజేపీ హైకమాండ్ అనూహ్యంగా బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కారణం ఈటల రాజేందర్ అన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇదే విషయాన్ని బండి సంజయ్ సహా తొలి నుంచీ బీజేపీలో ఉన్న నేతలు నమ్ముతున్నారు.  బండి అభిమానులు,   బీజేపీ కార్యకర్తలు, రాష్ట్రంలోని హిందూ వాదులు కూడా ఈటల కారణంగానే బండిని పార్టీ హైకమాండ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని భావిస్తున్నాయి. అప్పట్లో బండి వారసుడు ఈటలే అన్న వార్తలు కూడా గట్టిగా వినిపించినా బీజేపీ అధిష్ఠానం మధ్యే మార్గంగా కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.

దీంతో ఇప్పుడు ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్  సంజయ్  అడ్డంపడుతున్నట్టు తెలుస్తోంది. ఈటలకు రివెంజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు బండి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ ఇరువురి మధ్యా సయోధ్య కుదిర్చి ఈటలకు పదవి కట్టబెట్టడం ఎలా అని హైకమాండ్ తల పట్టుకుంటోంది.  పరిస్థితి కరవమంటే కప్పకు కోపం... వదల మంటే పాముకు కోసం అన్నట్లుగా మారింది. ఈటలకు పదవి ఇస్తే బండి నొచ్చుకుంటాడు.. ఆయనతో పాటు కార్యకర్తలూ కాడె వదిలేస్తారు.  ఈటలను పక్కన పెడతామంటే ఆయన బీజేపీనే వదిలేస్తారని పార్టీ హైకమాండ్ భయపడుతోంది.  ఎందుకంటే ఈటల సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత.. ఆయన అలిగి పార్టీ మారితే ఒక్కడిగా కాకుండా కొందరు తన వర్గం ఎమ్మెల్యేలనూ కూడా తన వెంట తీసుకుపోయే అవకాశం ఉంది. అలా ఈటల తన వర్గంతో కాంగ్రెస్ గూటికి చేరితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఆ భయం తోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో   బీజేపీ హైకమాండ్  ఎటూ తేల్చుకోలేక పోతోంది. 

 పోనీ మధ్యే మార్గంగా ఈటల రాజేందర్ ను కాదని మరొకరికి అప్పగిద్దామంటే అక్కడా పోటీయే. ఎంపీ రఘునందనరావు, డీకే అరుణ వంటి వలస నేతలూ రేసులో ఉన్నామంటూ గట్టిగా చెబుతున్నారు. వారు చాలరన్నట్లు మరో ఎంపీ అర్వింద్ కుమార్, అలాగే మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టినా మిగిలిన వారు అలకపాన్పు ఎక్కడం తధ్యం. తెలంగాణలో బీజేపీ అగ్రనాయకత్వం చేసిన ప్రయోగాల కారణంగా రాష్ట్ర పార్టీపై హైకమాండ్ పూర్తిగా పట్టు కోల్పోయింది. కనీసం పార్టీ అధ్యక్షుడిని కూడా ఎంపిక చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, నియామకం పెండింగులోనే ఉన్నా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.