ఇటు చిరంజీవి అటు ఆళ్ల మ‌ధ్య‌లో జ‌గ‌న్‌!

Publish Date:Aug 30, 2022

Advertisement

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా నేనే పోటీచేస్తాన‌ని ప్ర‌చారం చేసుకుంటున్న పెద్దోడిని  కాద‌ని  బుజ్జ‌గించి ప‌క్కంటి వాళ్ల‌బ్బాయిని ఒకే అనిపించారు. సాయంత్రానికల్లా పోటీలో ఫ‌లానావారి అబ్బాయిపోటీ చేస్తు న్నాడ‌ని తెలుసుకుని పెద్దోడు ప‌ట్టుప‌ట్టాడు. ఈ ఇంటాయ‌న త‌ల‌ప‌ట్టుకున్నాడు. ఒక‌డు మొండికేసాడు, రెండోవాడిని తెచ్చిపెట్టుకుని  ఆశ‌లు క‌ల్పించిన పెద్దాయన  భ‌గ‌వాన్  ఈ  దుస్థితి పగవాడికి కూడా  రాకూడ‌ద‌నుకున్నాడు.

చిత్ర‌మేమంటే స‌రిగ్గా ఇలాంటి సీన్  ఇపుడు వైసీపీలో ఈస్ట్ మన్ కలర్ లో కనిపిస్తోంది. మంగ‌ళ‌గిరి ఎన్నికల విష‌యంలో వైసీపీ పెద్ద స‌మ‌స్య‌నే ఎదుర్కొంటోంది. మంగ‌ళ‌గిరిలో తెలుగు దేశం నుంచి నారా లోకేష్ పోటీచేయడం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆయ‌నను దీటుగా  ఢీకొని గెలిచే అభ్యర్థిని రంగంలోనికి దించాలని వైసీపీ అధినేత జగన్ భావించారు. అనేక వ్యూహాలు, చ‌ద‌రంగ‌పుటెత్తుల త‌ర్వాత గాలం వేసి మరీ గంజి చిరంజీవిని తెలుగుదేవం పార్టీ నుంచి వైసీపీలోకి   లాక్కున్నారు. చిరంజీవిని త‌మ అభ్య‌ర్ధిగా నిలబెడితే సత్ఫలితం వస్తుందని జగన్ విశ్వసిస్తున్నారు.  మంగ‌ళ‌గిరిలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు కనుక బీసీ అభ్య‌ర్ధికే  అవ‌కాశాలుంటాయనీ, అందుకే  గంజి చిరంజీవి లోకేష్ కు దీటైన అభ్యర్థి అవుతారనీ జగన్ భావించారు. అందుకే అక్కడ సిట్టింగ్ గా ఉన్న  ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ని బుజ్జగించి ఒప్పించి మరీ చిరంజీవిని పార్టీలోకి లాక్కున్నారు.

ఇంత వరకూ బానే ఉంది కానీ , అయితే ఎంత బీసీల‌కు చెందిన‌వాడ‌యిన‌ప్ప‌టికీ చిరంజీవి ఇదే మంగ‌ళ‌గిరిలో 2014లో టీడీపీ అభ్య‌ర్ధిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం వేవ్ లోనే గెలవలేక చతికిల బడ్డారు. అప్పుడే జనం తిరస్కరించిన అభ్యర్థిని ఇపుడు నిల‌బెట్ట‌డం వ‌ల్ల పార్టీ ఏమాత్రం ప్ర‌యో జ‌నం పొందుతుంద‌న్న అనుమానాలు త‌లెత్తాయి. అయితే ప్ర‌స్తుతం బీసీ ఓట‌ర్ల ప్రాధాన్య‌త‌ను లెక్క‌లోకి తీసుకుంటే ఆళ్ల కంటే చిరంజీవి బెట‌ర్ అని జగన్ నమ్మారు. అందుకే గాలం వేసి మరీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి గంజి చిరంజీవిని తెచ్చుకున్నారు. అంతే కాదు ఆయ‌న‌కు కించిత్ ఇబ్బందీ లేకుండా చూసుకుంటామ‌ని అనేక హామీలు ఇచ్చారు. అంటే పోటీలో నిల‌బ‌డ‌టం వ‌రకే చిరంజీవి వంతు, ఖ‌ర్చు తదితర  వ్య‌వ‌హారాల‌న్నీవైసీపీయే చూసుకుంటుందన్న  భ‌రోసా ఇచ్చిన త‌ర్వాత‌నే చిరంజీవి చిర్న‌వ్వుతో వైసీపీ పంచ‌న చేరార‌న్న‌ది ప్ర‌చారంలో ఉంది. 

మంగ‌ళ‌గిరి సీటు, అందునా నారా లోకేష్‌ను ఓడించ‌డం.. ఈ రెండు వైసీపీకి అత్యంత ప్రాధాన్య అంశా లుగా మారాయి. మంగ‌ళ‌గిరిలో బీసీ ఓట‌ర్ల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. లోకేష్ త‌న చిర‌కాల శ‌తృవు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సుపుత్రుడు.   క‌నుక లోకేష్ పై విజయం సాధించడం ఒక్క టే జ‌గ‌న్   ల‌క్ష్యంగానూ మారింద‌నాలి.   కానీ టీడీపీ మాత్రం మంగ‌ళ‌గిరిలో విజ‌య‌ఢంకా మోగించేది నారావారి అబ్బాయే అన్న   ధీమాతో ఉంది. ఇటీవ‌లి కాలంలో రాష్ట్ర రాజకీయ వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పులు, ప్ర‌జ‌లు వైసీపీ మీద పెంచుకున్న ఆగ్ర‌హం త‌ప్ప‌కుండా లోకేష్‌కు ప్లస్ గా మార‌ను న్నా యి. ప‌థ‌కాలు, హామీలు అన్నీ నీరుగారాయి, ఏకంగా జ‌గ‌న్ మాట‌ను కూడా ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తు న్నారు, ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయుల స‌మ‌స్య ఆయ‌న‌కు త‌ల‌భారంగానే మారింది.  ఆచి తూచి అడుగులు వేయాల్సిన స‌మ‌యంలో దూకుడుగా, అనాలోచితంగా  తీసుకున్న నిర్ణ‌యాలు ఇపుడు మ‌రింత  ఇబ్బందిక‌రంగా మారాయి. 

అస‌లే అవ‌మాన‌పు త‌ల‌నొప్పుల‌తో ఇబ్బందిప‌డుతున్న జ‌గ‌న్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల మ‌రో శిరోభారం పెట్టాడు. అస‌లు లోకేష్ మీద పోటీ చేయ‌డానికి, గెల‌వ‌డానికి మంగ‌ళ‌గిరిలో త‌న‌ను మించిన‌వాడు లేడని తానే ఈ సారి పోటీలో నిలుస్తాన‌ని   తెర‌మీద‌కి మొద‌టి  కృష్ణుడిలా రంగప్రవేశం చేసేశారు. త‌న‌పై గ‌తంలో ఓడిపోయిన చిరంజీవికి పార్టీ టిక్కెట్ ఇవ్వ‌డ‌మేమిటి, త‌న‌ను తెర వెన‌క్కి వెళ్ల‌మ‌ని, ప్ర‌చారం చేయ‌మ‌ని అడ‌గడ‌మేమిట‌ని ఆగ్ర‌హిస్త‌ున్నారు. చిరంజీవి కేవ‌లం టీడీపీ నుంచి వ‌చ్చేడ‌న్న ప్రాధాన్య‌త త‌ప్ప మంగ‌ళ‌గిరిలో ఆయనకేమీ  ఫాలోయింగ్ లేద‌న్న‌ది ఆళ్ల వాద‌న‌. చిరంజీవిని పార్టీవారు ఎంతో స‌త్క‌రించి ఆయ‌న‌కు టికె ట్ ఇస్తామంటున్న స‌మ‌యంలో కూడా ఆళ్ల మీడియాతో అబ్బే అదేమీ లేదు, మంగ‌ళ‌గిరిలో పోటీ చేసేది తానే అని చెబుతున్నారు.

ఏది వాస్త‌వం, ఎవ‌రిది భ్ర‌మా అనేది ఇపుడు జ‌గ‌న్  తేల్చాల్సి ఉంది. మంగళగిరి లాంటి హాట్ సీట్  విషయంలో వైసీపీలో ఇంత గందరగోళం నెలకొని ఉండటమే ఆ పార్టీ బలహీనతకు దర్పణం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. ఎంత మంది పార్టీలోకి వ‌చ్చి చేరినా తానే మంగళగిరిలో పోటీ చేస్తానని లోకేష్‌ను ఓడించే స‌త్తా త‌న‌కే ఉం ద‌ని ఆళ్ల‌  చెప్పుకుంటున్నారు. ఈ పరిణామంతో  గంజి చిరంజీవికి షాక్ ఖిన్నుడయ్యారు. రెడ్డి సామాజికవర్గం ఆడిన పొలి టికల్ గేమ్‌లో తాను పావునయ్యాయన్న ఫీలింగ్‌కు వచ్చారు. అయితే తాను ఇక దూకేశానని.. తనను జగన్ మోసం చేయరని ఒక దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారు. కానీ మంగళగిరిలో గంజి చిరంజీవి నాయకత్వాన్ని వైసీసీ అంగీక రించడం లేదు.  ముఖ్యంగా గ‌తంలో త‌న‌ను ఓడించిన ఆళ్ల ఇపుడు తెర‌మీద‌కి రావ‌డం నేప‌థ్యంలో చిరంజీ వికి తన రాజకీయ భవిష్యత్ పై బెంగపట్టుకునే ఉంటుందని పరిశీలకలు అంటున్నారు. 

అయితే ఇవ‌న్నీ కేవ‌లం ఊహాగానాలే అని కొట్టి పారేసినా,  తాను పోటీ చేస్తున్నాన‌ని ఆళ్ల ప్ర‌క‌టించుకో వ‌డాన్ని జ‌గ‌న్ అడ్డుకోలేదు. ఆళ్ల ప్రకటనను ఖండించనూ లేదు.   అయినా ఇంత వరకూ వచ్చేసిన తరువాత ఆళ్ల తానే పోటీ చేస్తానంటూ ప్రకటించడం సీఎం జ‌గ‌న్‌కు కూడా  ఇబ్బందిక‌రంగానే మారింద‌నాలి. బుజ్జ‌గించి, బామాలి ఇప్పుడు కాదురా నాన్నా.. అని గ‌డ్డం ప‌ట్టుకుని చెప్పిన‌పుడు ఒకే అనేసి ఇపుడు ఎవ‌రో గిల్లిన‌ట్టు   మంగ‌ళ‌గిరిలో పోటీ చేస్తే తానే చేయాలంటూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వైసీపీ నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.   ఇక  ఇంటి అల్లుళ్ల పోరు తీర్చిన‌ట్టు  జ‌గ‌న్ ఇపుడు చిరంజీవిని, ఆళ్ల‌ను కూర్చోబెట్టి  బుజ్జగించడమే మిగిలింది. అయితే అంత కంటే ముందు మంగళగిరి వైసీపీలో విభేదాలు బట్టబయలై పార్టీ నియోజకవర్గంలో పలుచన అయ్యిందనడంలో సందేహం లేదు. అందుకు తంటా లు ప‌డాల్సింది, లాలిపాట‌లు పాడాల్సింది కూడా జ‌గ‌న్ మాత్ర‌మే. తెచ్చుకున్న‌వాడి కంటే ఉన్న‌వాడు తెచ్చిన తంటా అంతా యింతా కాదు.  

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.