ప్రోత్సాహం ఉంటే!

Publish Date:Apr 12, 2016

Advertisement


చల్లటి చలికాలం. రక్తం కూడా గడ్డకట్టుకుపోయే ఓ మంచు ప్రదేశం. ఆ ప్రదేశం గుండా కొందరు శరణార్ధులు నడుస్తున్నారు. వారందరి మొహాలలో ఉత్సాహం. మరొక్క రెండు కిలోమీటర్లు అలా నడిస్తే చాలు, వాళ్లంతా ఓ కొత్త దేశానికి చేరుకుంటారు. అక్కడ తమ కోసం ఓ కొత్త జీవితం ఎదురుచూస్తోంది. అలా వాళ్లు ఉద్వేగంతో నడుస్తున్నారో లేదో, దారి సన్నబడటం మొదలైంది. ఆ దారిలో ఒక్క అడుగు అటూ ఇటూ వేసినా పక్కనే ఉన్న పాతాళంలోకి జారిపోవడం ఖాయం. అందుకని ఒకరి చేయి ఒకరు పట్టుకుని నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం మొదలుపెట్టారు. కానీ ఎంత జాగ్రత్తగా నడిచనా వారి భయం నిజం కాక తప్పలేదు. గుంపులో ఉన్న ఓ ఇద్దరు హఠాత్తుగా లోయలోకి జారిపోయారు. లోయ మధ్యలో ఉన్న ఓ చిన్న చెట్టుని పట్టుకుని వేళ్లాడటం మొదలుపెట్టారు. వారిద్దరినీ చూడగానే మిగతా గుంపు కంగారుపడిపోయింది. వారిని పైకి లాగుదామంటే దగ్గర్లో ఒక్క తాడు ముక్క కూడా లేదయ్యే!


‘పైకి వచ్చే ప్రయత్నం చేయవద్దు! అలాగే చెట్టుని పట్టుకుని వేళ్లాడుతూ ఉండండి. త్వరలోనే ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం’ అంటూ గుంపులో జనమంతా అరవడం మొదలుపెట్టారు. వాళ్లకి తెలుసు. కింద ఉన్న ఇద్దరూ ఎక్కువసేపు అలా ఉండలేరని! అయినా వాళ్లు పైకి వచ్చే ప్రయత్నం చేస్తే మరింత త్వరగా ప్రాణాలు పోతాయని అనుకున్నారు. అందుకే ఎవరికి వాళ్లు తాడు కోసం వెతుకుతూనే ‘పైకి వచ్చే ప్రయత్నం చేయవద్దు’ అంటూ అరవడం మొదలుపెట్టారు.


నిమిషాలు గడుస్తున్నాయి. కింద చెట్టుని పట్టుకున్న వారిద్దరి వేళ్లూ మొద్దుబారిపోవడం మొదలుపెట్టాయి. ఇంతలో వారిలో ఒకడు నిదానంగా పైకి వచ్చే ప్రయత్నం చేయసాగాడు. రెండో వాడు అలాగే భయంతో చెట్టుని మరింత గట్టిగా పట్టుకుని వేళ్లాడసాగాడు. రెండోవాడిని నిలువరించేందుకు పై నుంచి అరుపులు మరింత తీవ్రం కాసాగాయి. పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే చస్తావంటూ హెచ్చరించడం మొదలుపెట్టారు గుంపులోని గోవిందయ్యలు. అయినా వారి వంక చిరునవ్వులు చిందిస్తూ, ఒకో అడుగే పట్టు చిక్కించుకుంటూ, చేతులని రాతి సందుల్లో ఇరికిస్తూ పైకి రాసాగాడు రెండోవాడు. ఒక్క అరగంట అలా ఒకో అంగుళం పైకి ఎక్కుతూ ఎట్టకేలకు కొండదారిని చేరుకున్నాడు. ఈలోగా కిందనున్న మనిషికి మాత్రం వేళ్లు మొద్దుబారిపోయాయి. పట్టుతప్పి లోయలోకి పడిపోయాడు.


రెండోవాడు విజయోత్సాహంతో పైకి రాగానే, అందరూ అతని చుట్టూ గుమికూడారు. ‘మేమంతా నిన్నంతగా నిరుత్సాహపరుస్తుంటే, నువ్వెందుకు వెనక్కి తగ్గలేదు!’ అంటూ రకరకాల ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలన్నింటికీ అతని చిరునవ్వే సమాధానం అయ్యింది. అతని చిరునవ్వు చూసి గుంపులో జనానికి మరింత పిచ్చెత్తిపోయింది. ఇంతలో ఈ విషయాన్నంతా గమనిస్తున్న ఓ పద్దాయన అతని దగ్గరకి వెళ్లాడు. అతణ్ని నిశితంగా పరిశీలించిన తరువాత చాలాసేపు ఏవేవో సైగలు చేశాడు. చివరికి తన గుంపుతో అన్నాడు కదా ‘ఇతనికి పాపం చెవుడు. అస్సలేమీ వినిపించదు. దాంతో మీరు అతణ్ని నిరుత్సాహపరుస్తూ చెప్పిన మాటలు కూడా అతనికి వినిపించలేదు సరికదా... మీ ఉద్వేగాన్ని చూసి మీరంతా అతణ్ని ప్రోత్సహిస్తున్నారని అనుకున్నాడు. ఆ ఉత్సాహంతోనే పైకి చేరుకున్నాడు’ అని చెప్పుకొచ్చాడు.


ఆ మాటలు విన్న జనాలకి మతిపోయింది. ఎలాగూ తాము తాడు తెచ్చేదాకా వాళ్లు బతకరని గుంపులో జనానికి తెలుసు. కనీసం వారిని పైకి రమ్మని ప్రోత్సహిస్తే బాగుండేది కదా అనిపించింది. రెండోవాడు చెవిటివాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే తమ ప్రవర్తన వల్ల అతని ప్రాణం కూడా పోయి ఉండేది కదా అనిపించింది. నిరుత్సాహాన్ని కలిగించే మాటలు, గెలిచే అవకాశం ఉన్నచోట కూడా పరాజయాన్ని రుచిచూపిస్తాయనీ... ధైర్యాన్ని కలిగించే ప్రోత్సాహం, పరాజయం లోతుల్లోనుంచి మనిషిని గెలిపిస్తాయని తెలిసివచ్చింది. ఆ వివేకం వారికి ముందే ఉండి ఉంటే ఓ నిండుప్రాణం పోయేది కాదు కదా!

- నిర్జర

By
en-us Political News

  
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.