అంబేద్కర్... ఆ పేరే ఒక ప్రే"రణం"

Publish Date:Apr 14, 2016

Advertisement

 

అంబేద్కర్… ఈ పేరు వినగానే మీకు ఏం గుర్తుకు వచ్చింది? దళితులు, వారిపై జరిగిన అంటరానితనపు అమానుషం, దానికి వ్యతిరేకంగా జీవిత కాలం పోరాడిన ఒక మహానాయకుడు… ఇంతే కదా? కాని, అంబేద్కర్ అంత మాత్రమే కాదు. అంబేద్కర్ ఓ అద్భుతం! అంబేద్కర్ ఓ పోలికంటూ లేని అనుపమానం!

 

డాక్టర్ భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్… ఓ రణం మాత్రమే కాదు… ప్రేరణం కూడా! అదీ కేవలం దళితులకి మాత్రమే కాదు… అన్ని కులాల వారికి! అన్ని వర్గాల వారికి! ఎక్కడున్న వారైనా సరే… అందరికీ! అంతటి విభిన్న కోణాల విశిష్ట వ్యక్తిత్వం మన రాజ్యాంగ నిర్మాతది!

 

అంబేద్కర్ అంటే దళితవాదం నుంచి బయటకి వచ్చి చూడాలి. అప్పుడే ఆయనెవరో మనకు పూర్తిగా తెలిసేది. మరీ ముఖ్యంగా అంబేద్కర్ మనకు అందించే ప్రేరణ కనిపించేది కూడా అప్పుడే! ఒక అత్యంత పేద కుటుంబం… అందులో పద్నాలుగురు పిల్లల్లో తానొకరు. పైగా అంటరానితనపు దారుణమైన సంకెళ్లు. అయినా అంబేద్కర్ రెక్కల్ని విధి విజృంభింపజేసిన ఈ తుఫానులేవీ … విరిచేయలేకపోయాయి. ఆయన తన గ్రామంలోని దళిత వాడ నుంచి ఏకంగా లండన్ విశ్వవిద్యాలయాల వరకూ దీక్షతో , దక్షతతో ఎగిరాడు. ఎదిగాడు.

 

 

ఈనాటికీ అంబేద్కర్ ప్రతీ పేదవాడికి అందించే జీవిత సూత్రం దీక్షా, దక్షతలే! పట్టుదలతో చదివితే జీవితంలో ఉత్తీర్ణులు కావొచ్చు! బతుకు పరీక్షల్లో వందకు వంద మార్కులు తెచ్చుకోవచ్చు! అంబేద్కర్ ను మొత్తం సమాజం ఏకమై అడ్డుకున్నా ఆయన దూసుకుపోయాడు. దానికి కారణం తీక్షణమైన మేధాస్సు, దానితో సాధించిన చదువు. మనం మహానేతలని తలుచుకునే గాంధీ, నెహ్రుల కంటే అంబేద్కర్ ఎన్నో డిగ్రీలు, పీజీలు, పీహెచ్ డీలు ఎక్కువగా చేశారు. ఆయన ఎకనమిక్స్ లో మహాపండితుడు. అయినా కూడా మన వారు ఎందుకనో నెహ్రునే పండిత్ జీ అన్నారు గాని అంబేద్కర్ ని కాదు! నిజానికి బహుశాస్త్ర పండితుడు అంబేద్కర్!

 

అంబేద్కర్ నుంచి చదువుని అస్త్రంగా, శస్త్రంగా చేసుకుని జీవన రణరంగంలో గెలవటమే కాదు… ఇంకా చాలా నేర్చుకోవచ్చు! ఆయన రాసిన రాజ్యాంగం ఇవాళ్ల నూటా ఇరవై కోట్ల పై చిలుకు భారతీయుల తల రాతల్ని నిర్ధేశిస్తోంది! అదీ విజయం అంటే… ఆయన నుదుటన చిన్నప్పుడు చెడు రాత రాసిన సమాజానికి…తాను చనిపోయేలోగా ఆయన సరికొత్త రాత రాశాడు! 

 

మనం ఏ పాకిస్తాన్ లానో అరాచకంలో కూరుకుపోలేదు. మనకు దేశంపైనా, వ్యవస్థపైనా, ఆ మాటకొస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపైన కూడా అసంతృప్తి వుండవచ్చు. కాని, ఆయన రాసిన ఆధునిక ప్రజాస్వామ్య వేదం ఎంత గొప్పదంటే ఇంత విశాలమైన , విస్తృమైన భారత ఉపఖండం అరవై ఏళ్ల తరువాత కూడా దాని వల్లే భద్రంగా వుంది. ఇది చేసిన రాజ్యాంగ రచయితని ఎలా సామాన్యుడు అనగలం?

 

రాజ్యాంగం లాంటి చారిత్రక అవసరం తీర్చిన అంబేద్కర్ నుంచి సామాన్యులు కఠోర శ్రమని నేర్చుకోవచ్చు! అంతటి మహత్తర కార్యం అంత గొప్పగా మరొకరెవరూ చేసి వుండేవారు కాదు! అంతే కాదు, అంబేద్కర్ అంకిత భావం స్వాతంత్ర్యానికి ముందు, తరువాత కూడా అడుగడుగునా మనకు కనిపిస్తుంది!

 

ఇవాళ్ల మన ఇళ్లలో విద్యుత్ వెలుగులు గొప్పగా వెలిగిపోతున్నాయి. వాట్ని రాజేసింది అంబేద్కరే! ఇండియాలో గ్రిడ్ విధానంలో విద్యుత్ సరఫరా జరగటానికి, పవర్ సప్లై వ్యవస్థ ఏర్పడటానికి అంబేద్కర్ కృషి ఎంతో వుంది. ఆయన వల్లే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, హీరాకుడ్ ప్రాజెక్ట్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు సాకారమయ్యాయి.

 

అంబేద్కర్ వల్లే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది. ఆయన వల్లే దేశంలోని కోట్లాది కార్మికులు క్షేమంగా వుంటున్నారు. ఆయన రూపొందించిన లేబర్ లాసే నేటీకి మన సమాజాన్ని నిర్ధేశిస్తున్నాయి!

 

అంబేద్కర్ గురించి చెబుతూ పోతే గ్రంథాలు నిండిపోతాయి… గ్రంథాలయాలు చోటు చాలక ఇరుకైపోతాయి… కాని, ఒక్కటి మాత్రం నిజం! అంబేద్కర్ ఓ ఉద్యమకారుడు కాదు! ఆయనే ఓ మహోద్యమం! ఎన్ని పార్శ్వాల్లో చూస్తే అన్ని విభిన్నత్వాలతో దర్శనమిస్తాడు! అంత ప్రేరణ కూడా ఇస్తాడు!

 

సూర్యుడు సహజంగా అయితే చెమటలు పట్టిస్తాడు. కాని, భక్తిగా మొక్కే వారికి భగవంతుడిలా కనిపిస్తాడు. తెలివిగా వాడుకునే వారికి సౌర విద్యుత్ లా పనికి వస్తాడు! అంబేద్కర్ అలాంటి ఓ సూర్యుడే! ఆయన దేవుడంటూ మొక్కే వారు చాలా మందే వుండొచ్చు! లేదంటే ఆయన దేవుడని ప్రచారం చేసి ప్రసాదాలు మింగేసే వారూ వుండొచ్చు! వాళ్లని పక్కన పెడదాం… అంబేద్కర్ అనే సూర్యుడి నుంచి ప్రేరణ అనే సౌర విద్యుత్ ధగధగ వెలుగుల్ని మన గుండెల్లో నింపుకుందాం! అంబేద్కర్ కూడా ఓ గాంధీ, ఓ నెహ్రు, ఓ పటేల్, ఓ బోస్ లాంటి ‘అందరివాడని’ నిరూపిద్దాం!   


..Jaisimha Chaturvedi

By
en-us Political News

  
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.