ఇండోనేసియాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!

Publish Date:Aug 14, 2026

Advertisement

ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. శనివారం (ఆగస్టు 15) తెల్లవారుజామున భూమి కంపించింది.  సముద్ర గర్భంలో పది కిలో మీటర్ల లోతున సంభవించిన ఈ  భూకంపం ధాటికి అనేక ద్వీపాలు, తీరప్రాంత నగరాలు ఉలిక్కిపడ్డాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ   భూకంపం వల్ల సంభవించిన ప్రకంపనలకు ప్రజలు  భయాందోళనలకు గురైఇళ్ల నుంచి బయటకు  పరుగులు తీశారు. అమెరికా జియోలాజికల్ సర్వే  ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు  అయ్యింది. సముద్ర ఉపరితలం నుంచి కేవలం 10  కిలోమీటర్ల లోతులో ఈ  భూకంప కేంద్రం ఉంది. భూకంపం ఇంత తక్కువ లోతులో సంభవించడంతో ప్రకంపనల తీవ్రత భారీగా ఉంది.ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

 . భూకంప కేంద్రానికి   300 కిలోమీటర్ల పరిధిలోని తీరప్రాంత ప్రజలందరూ తక్షణం తమ ఇళ్లు ఖాళీ చేసి, ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగసిపడి తీరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులుహెచ్చరించారు. కేవలం ఇండోనేషియా మాత్రమే కాకుండా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం  పొరుగు దేశాలైన ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియాలను అప్రమత్తం చేస్తూ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది.

సమాచారం అందిన వెంటనే ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి, సహాయక చర్యలను వేగవంతం చేసింది. శోధన బృందాలను తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు దెబ్బన్నాయి.   

Indonesia Earthquake, 77 Magnitude Quake, Tsunami Warning Indonesia, USGS Earthquake Report, BMKG Indonesia, Pacific Ring of Fire

By
en-us Political News

  
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి వర్గాలకు మరింత నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా
జాగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో ఒక దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది.
లైంగిక పటుత్వ పరీక్షకి కోర్టు గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్‌ చేశారు.
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..!
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..!
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో  నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది.
నా బిడ్డకు బతుకునిచ్చారు సార్.. మీరే పేరు పెట్టండి..!
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తమిళనాడు రైతు ప్రయోజనాలను,  సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున వరుసగా 12 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసలు జగన్ హయాం అంతా అక్రమాలు, అవినీతి మయం అని విమర్శించిన ఆయన ముఖ్యంగా గ్రూప్ వన్ నియామకాలలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాన్ని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు
జీవితమంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఫలాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.