కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు పతకం ఖాయం చేసుకున్నారు. శనివారం జరిగిన సెమీస్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును నాలుగు పరుగుల తేడాతో ఓడించి హర్మన్ ప్రీత్ సేన ఫైనల్ చేరుకుంది. బ్యాటింగ్లోనూ తర్వాత బౌలింగ్ లోనూ అమ్మా యిలు అదరగొట్టారు. కెప్టెన్ మంధాన ఎంతో వేగంగా ఆడటంతో భారత్ తన ఇన్నింగ్స్లో 164 పరుగులు చేసింది. ఇంగ్లండ్ చివరి ఓవర్లో కేవలం 4 పరుగుల దూరంలో ఓడిపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో విజయం పలుమార్లు చేతులు మారినప్పటికీ చివరికి టీమిండియాదే పై చేయి అయింది. వరుస రనౌట్లు ఇంగ్లండ్ కొంపముంచాయి.
ఇంగ్లండ్ బ్యాటింగ్లో ఆరంభంలో 28 పరుగులకే ఓపనర్ సోఫియా వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన అలీస్ కేవలం 13 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ నటాఅఇయా కాస్తంత నిలకడగా ఆడటంతో ఇంగ్లండ్కు కష్టాలు తప్పాయి అనుకున్నారు. కానీ డేనియల్ వైట్ తన వ్యక్తిగత స్కోర్ 35 వద్ద స్నేహ్రాణా కి దొరికింది. అప్పటికి జట్టు స్కోర్ 81 పరుగులే అయింది. ఆ తర్వాత నటాలీ, అమీజోన్స్లు కొంతసేపు నిలకడగా ఆడారు కానీ ఇద్దరూ వరుసగా రన్ అవుట్ కావడంతో ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్కు ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు అవసరం కాగా, తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి బ్రంట్ అవుట్ కావడంతో మ్యాచ్ భారత చేతుల్లోకి వచ్చినట్టే కనిపించింది. నాలుగో బంతికి ఒక్క పరుగు వచ్చింది. ఇక చివరి రెండు బంతులకు 12 పరుగులు అవసరం కాగా, ఒక్క పరుగు మాత్రమే లభించింది. దీంతో భారత్ విజయం ఖాయమైపోయింది. అయితే, చివరి బంతిని ఎక్లెస్టోన్ సిక్సర్గా మలచడంతో భారత్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. కేరింతలతో స్టేడియం హోరెత్తిపోయింది.
అంతకు ముందు భారత్ బ్యాటింగ్లో మంధాన 32 బంతులు ఎదుర్కొన్న 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ కాపాడింది. 31 బంతులు ఆడిన జెమీమా 7 ఫోర్లతో 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. హర్మన్ప్రీత్ కౌర్ 20, దీప్తి శర్మ 22 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indian-womens-into--cwg-cricket-final-39-141417.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.