Publish Date:Aug 30, 2025
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 16 నెలలు అయ్యింది. అంతకు ముందు ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో అభివృద్ధి ఆనవాలే కనిపించలేదు. సంక్షేమం పేరిట అరకొర పందేరాలు వినా ప్రజలను ఇసుమంతైనా ప్రయోజనం కలిగే పథకాలూ లేవు, రాష్ట్ర ప్రగతికి దోహదపడేలా ప్రాజెక్టులూ లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది. ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. కొత్తవి రాలేదు. జగన్ హయాంలో అధికారం అంటే కక్ష సాధింపు, దోచుకో, దాచుకో అన్నట్లుగానే సాగింది. ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలింది. అప్పులు వినా, రాష్ట్రానికి ఆదాయమన్నదే లేకుండా పోయింది. ప్రభుత్వోద్యోగుల వేతనాలు కూడా విడతల వారీగా చెప్పించే పరిస్థితి ఉండేది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అఘండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచీ రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పరుచుకున్నాయి. సంక్షేమానికి సముచిత ప్రాథాన్యతా లభించింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అన్నట్లుగా పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ 16 నెలల కాలంలో రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు తరలి వస్తున్నాయి. పారిశ్రామిక రంగానికి కొత్త జవజీవాలు వచ్చాయి. అలాగే గత జగన్ ప్రభుత్వ హయాంకు భిన్నంగా ఇప్పుడు పాలనలో పారదర్శకత పెరిగింది. ప్రభుత్వ పథకాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రజామోదం లభించింది.
ఇప్పుడు విషయానికి వస్తే.. దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రులు అంటూ ఇండియా టుడే తాజాగా జారీ చేసిన బాబితాలో చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారు. ఇదే ఇండియా టుడే గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన ఉత్తమ సీఎంల జాబితాలో ఐదో స్థానంలో ఉన్న చంద్రబాబు ఏడాది తిరిగే సరికి మూడో స్థానానికి ఎగబాకారు. తాజా జాబితాలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలోనూ, పశ్చిమబెంగాల్ సీం రెండోస్థానంలోనూ ఉన్నారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. అధికారం చేపట్టిన 16 నెలలలోనూ ఈ స్థానంలోకి దూసుకురావడం అంటే ఆయన పనితీరుకు లభించిన ప్రజామోదంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-today-ranking-best-cms-cbn-in-3rd-place-39-205286.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది