కాల్పుల విరమణ.. భారత్ చేసిన చారిత్రక తప్పిదం!?

Publish Date:May 12, 2025

Advertisement

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్  ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడులలో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు ప్రతిగా పాకిస్థాన్ భారత్ భూభాగం లక్ష్యంగా నిర్వహించిన డ్రోన్ దాడులతో రెండు దేశాల మధ్యా యుద్ధవాతావరణం నెలకొంది. దాడులు, ప్రతిదాడులతో  యుద్ధం తప్పదన్న వాతావరణం ఏర్పడింది. అయితే అదే సమయంలో పాకిస్థాన్ డొల్లతనం కూడా ప్రస్ఫుటంగా ప్రపంచ దేశాలకు అర్ధమైంది. భారత్ తో తలపడే సత్తా కానీ, శక్తి కానీ పాకిస్థాన్ కు లేవన్నది తేటతెల్లమైంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ సంధి అంటూ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చింది. భారత్ అందుకు సై అంది. అది పక్కన పెడితే ఇరు దేశాల మధ్యా సంధి కుదర్చడం వెనుక తన పెద్దన్న పాత్ర కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకున్నారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న విషయం అందరి కంటే ముందే తాను వెల్లడించి క్రెడిట్ కొట్టేయాలని చూశారు. అయితే కాల్పుల విరమణలో అమెరికా పాత్ర కానీ, ఆ ధేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రకానీ ఇసుమంతైనా లేదని భారత్ కుండబద్దలు కొట్టేసింది. పాకిస్థాన్ కోరిన మీదటే మానవతా దృక్పథంతో అంగీకరించినట్లు స్పష్టంగా చెప్పేసింది. 

అయితే పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించడం పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అదీ బేషరతుగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడాన్ని యుద్ధరంగ నిపుణులు చారిత్రక తప్పిదంగా అభివర్ణిస్తున్నారు. అసలు కాల్పుల విరమణ ఒప్పందం రైటా, రాంగా అన్న విషయంలో దేశంలో ఎక్కడా భిన్నాభిప్రాయానికి తావే లేకుండా ముక్తకంఠంతో భారత్ నిర్ణయం సరికాదని అంటున్నారు. యుద్ధం వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది, మరణాలు సంభవిస్తాయి కనుక యుద్ధం ఎప్పడూ మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, భారత్ కు వ్యతిరేకంగా ప్రేరిపించి దేశంలో సృష్టిస్తున్న నిత్య మారణహోమానికి ఫుల్ స్టాప్ పడాలంటే.. ఆ దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, పాక్  అధినంలో ఉన్న కాశ్మీర్ భాగాన్ని స్వాధీనం చేసుకోవడమే మార్గమని జనం భావిస్తున్నారు.    ఈ నేపథ్యంలోనే అత్యధికుల నుంచి కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అంటున్నారు.

 ప్రస్తుతం పాకిస్థాన్ అత్యంత దుర్బలంగా ఉందనీ, ఆ దేశం ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదనీ, ఆర్థికంగా, రాజకీయంగా క్లిష్టపరిస్థుతులను ఎదుర్కొంటోందనీ, ఇటువంటి సమయంలో భారత్ మరింత ఒత్తిడి పెంచి.. ఆ దేశంలో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరినీ సరండర్ చేయాలన్న షరతు విధించి ఉండాల్సిందనీ అంటున్నారు.  భారత్ ఒత్తిడి పెంచి ఉంటేపాకిస్థాన్ భారత్ కు దాసోహం అని ఉండేదనీ, అలా కాకుండా కాల్పుల విరమణ ఒంప్పదం కుదుర్చుకోవడం ద్వారా  పాకిస్థాన్ కు అనవసరంగా మళ్లీ శక్తియుక్తులను కూడదీసుకోవడానికి సమయం ఇచ్చినట్లైందని అంటున్నారు.  

By
en-us Political News

  
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.