Publish Date:May 19, 2023
వీధికుక్కల దాడిలో తెలంగాణలో మరో బాలుడు మరణించాడు. ఖాజీ పేటలో ఆద మరచి నిద్రపోతున్న 8 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు అతిదారుణంగా దాడి చేసి చంపి వేసాయి. వీధికుక్కల దాడిలో బాధితుడు అక్కడికక్కడే చనిపోయాడు. మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఈ బాలుడు చెట్టు క్రింద ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఈ దాడి జరిగింది. హన్మకొండ జిల్లా ఖాజీపేట రైల్వే క్వార్టర్స్ లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది.
పొట్ట చేత పట్టుకుని వచ్చిన ఉత్తర ప్రదేశ్ నుంచి నగరానికి వచ్చిన కూలీ కొడుకు చోటు కుక్కల దాడిలో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. గత నెల తుర్కపల్లిలో దాదాపు 100 వీధికుక్కలు దాడి చేసి ఒక వ్యక్తిని చంపేసాయి. హైదరాబాద్ లో కూడా వీధికుక్కల దాడిలో బాలుడు చనిపోయిన సంఘటన ఇంకా మరవక ముందే ఖాజీ పేటలో ఈ దాడి జరగడం కలచివేసింది. ఫిబ్రవరి 19న జరిగిన ఈ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.
నాలుగేళ్ల బాలుడిని మూడు వీధి కుక్కలు దాడి చేసి చంపేసాయి. మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీలో వీధికుక్కల దాడిలో 70 మంది చనిపోయారు.
భారత్ లో వీధికుక్కల దాడిలో చనిపోయిన వారి సంఖ్య తీవ్రవాదుల చేతిలో చనిపోతున్న వారికంటే ఎక్కువేనని అంర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ఒక అధ్యయనంలో వెల్లడించింది.
కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది. ఇది అంటు వ్యాది. ఒక వేళ కుక్క కాటు వేస్తే రేబిస్ ను అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం వద్ద నివారణా చర్యలు లేకపోవడం శోచనీయం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/increasing-street-dog-bites-25-155584.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.