అరసవల్లిలో మంగ్లికి అనుచిత ప్రాధాన్యం.. కూటమి క్యాడర్ లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం

Publish Date:Feb 5, 2025

Advertisement

జగన్ హయాంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది.  వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌లో అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు హ‌ద్దే లేకుండా పోయింది. ఆ పార్టీ నేత‌లు అందినకాడికి ప్ర‌భుత్వ భూముల‌తోపాటు అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జాలు చేసేశారు. మ‌రికొన్ని భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వారి అనుకూల ట్ర‌స్టుల‌కు, కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తే.. జ‌గ‌న్ మాత్రం త‌న హ‌యాంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగాపెట్టుకొని పాల‌న‌ను గాలికొదిలేశాడు. దీంతో వైసీపీ హ‌యాంలో రాష్ట్రం క‌నీస‌ అభివృద్ధికి నోచుకోక‌పోవ‌డంతో దేశంలోనే ఏపీ అట్ట‌డుగు స్థాయికి వెళ్లిపోయింది.

అదలా ఉంటే.. జగన్ విధానాలను వ్యతిరేకించిన వారినీ, తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులకు కొదవే లేదు. నిజం జగన్ అధికారం వెలగబెట్టిన ఐదేళ్లూ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలపై వేధింపులతో చెలరేగిపోయారు. ఆయన అండ చూసుకుని ఆ పార్టీ నేతలూ, అభిమానులుగా చెప్పుకున్న వారూ కూడా చెలరేగిపోయారు. 

సరే జనం జగన్ పాలనను నిర్ద్వంద్వంగా తిరస్కరించి, గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీకి ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా ఆ పార్టీ తగదని తమ తీర్పు ద్వారా తేల్చి చెప్పారు. ఘన విజయం సాధించిన తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది.  వైసీపీ హయాంలో మంచీ చెడూ విచక్షణ లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలూ, వారి అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలూ అధికారులపై తెలుగుదేశం కూటమి సర్కార్ కొరడా ఝుళిపిస్తుందనీ, వారిని చట్టంముందు నిలబెట్టి శిక్షిస్తుందనీ ఆశించిన తెలుగుదేశం, జనసేన క్యాడర్ లో ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా కూడా   జగన్ హయాంలో అక్రమాలు, సోషల్ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోయిన ఆ పార్టీ యాక్టివిస్టులను చూసీ చూడనట్లు వదిలేస్తుండటమే ఇందుకు కారణం. అంతే కాదు వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించిన వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ రాజచమర్యాదలు పొందుతుడటంతో క్యాడర్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

 వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజాకు తిరుమలలో ప్రొటోకాల్ దర్శనం లభించడం.. తాజాగా రథ సప్తమి నాడు అరసవల్లిలో గాయని మంగ్లీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా ప్రొటో కాల్ దర్శనానికి అనుమతించడంతో తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతోంది.

వైపీపీ హయాంలో సింగర్ మంగ్లి టీటీడీలో పదవి అనుభవించిన సంగతి తెలిసిందే. అటువంటి మంగ్లి తాజాగా అరసవెల్లి రథ సప్తమి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి వీఐపీ ప్రొటో కాల్ దర్శనం చేసుకోవడం.. మంత్రి పక్కనే నిలబడి మీడియాతో  మాట్లాడటం  తెలుగుదేశం కార్యక ర్తలకు మింగుడు పడటం లేదు.  టీడీపీకి వ్యతిరేకంగా, వైసీపీకి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మంగ్లికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంత ప్రాధాన్యాన్నీ, గౌరవ మర్యాదలనూ ఇవ్వడమేంటంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ప్రత్యర్థుల పట్ల అవసరం లేని మెతకతనం చూపుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు మంగ్లీ విషయంలో కార్యకర్తల ఆగ్రహం ఒకింత ఇబ్బందికరమే అనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి.
తన రాజకీయ భవిష్యత్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలక పదవులు నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఢిల్లీ వెళ్ళడం కొత్త విషయం కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ వుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పడు, ముఖ్యమంత్రులు ఒక కాలు ఢిల్లీలో మరో కాలు హైదరాబాద్ లో అన్నట్లు ఇటూ అటూ చక్కర్లు కొడుతూ ఉండేవారని అంటారు.
తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది? ఓ వంక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు పూర్తయినా, ఆయనకు, పరిపాలనపై పూర్తి పట్టు చిక్కినట్లు లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం, వరుస సెలవుల కారణంగా తిరమలేశుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.
విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
  ఈ నెల 13 నుంచి 18 వరకు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.  తెలంగాణలో గత కొన్ని రోజులుగా  వింత వాతావరణం  నెలకొంది. పగలు అధిక వేడి, రాత్రి చలి గాలులు, ఉదయం మంచు  దుప్పట్లు కురవడం వంటి వాతావరణం  ఉంది.
  బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయ్యా  సన్నీ యాదవ్  పై సూర్యపేట  పిఎస్ లో కేసు నమోదైంది.  ఇటీవలె బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.
జగన్ హయాంలో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం సందర్శనతోనే ప్రారంభించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లురు రాజశేఖర్ రెడ్డిపై వివేకా పిఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసని పోలీసులు నిర్ధారించారు
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీపగబట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం చేకూరనుందని అన్నారు. తమకు అధికారం దక్కని దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ కోపం పెంచుకుని వివక్ష చూపుతోందన్నారు. తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమెళి, రాజాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం (మార్చి 13) సమావేశమయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన నాగం జనార్ధన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీ కి దూరమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో నాగం మంత్రిగా పని చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.