అఘోరీ ఆత్మార్పణం కథ సుఖాంతం అయినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ అలజడి ప్రారంభమైంది. కేదార్ నాథ్ నుంచి తెలంగాణలో ఎంటర్ అయిన అఘోరీని గత నెల సిద్దిపేటలో పోలీసులు అదుపులోకి తీసుకుని అఘోరీస్వగృహమైన మంచిర్యాలకు తరలించారు. అక్కడ పోలీసులు కౌన్సిలింగ్ చేసి మహారాష్ట్ర సరిహద్దుల్లోని వాంకిడిలో వదిలేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఈ నెల ఒకటోతేదీన ఆత్మార్పణం చేసుకుంటానని అఘోరీ ప్రకటించడంతో తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. అఘోరీ గత కొన్ని రోజులుగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో శాంతి భధ్రతల సమస్య వస్తుందని పోలీసులు ఊహించారు. ఇందులో భాగంగా హైద్రాబాద్ లో 144 సెక్షన్ తీసుకువచ్చినట్టు సీనియర్ పోలీసు ఉన్నతాధికారి తెలుగు వన్ తో అన్నారు. కెటీఆర్ అరెస్ట్ వార్తలు రావడంతో 144 సెక్షన్ అనివార్యమైందని ఆయన అన్నారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రి శ్రీనివాసరెడ్డి సియోల్ పర్యటనలో ప్రకటన చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కుంభకోణం దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో కెసీఆర్, హరీష్ రావులు అరెస్ట్ అవుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బిఆర్ఎస్ నేతల అరెస్ట్ వల్ల హైద్రాబాద్ లో అల్లర్లు చెలరేగే అవకాశముందని ఇంటెలిజెన్స్, ఎస్ బి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో అఘోరీ ప్రస్తావనకూడా వచ్చింది. తెలంగాణలో గత కొంతకాలంగా మతకలహాలు జరగడం లేదు. అఘోరీ విద్వేష ప్రసంగాలపై కూడా రేవంత్ సర్కార్ మిన్నకుండిపోయింది. మళ్లీ మతకలహాల ముప్పు పొంచి ఉందని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. హైద్రాబాద్ లో కేవలం మత కలహాల సమయంలో మాత్రమే విధించే 144 సెక్షన్ రేవంత్ సర్కార్ హాయంలో విధించడం చర్చనీయాంశమైంది. మరో వైపు ఈటెల నేతృత్వంలో బిజెపి నేతలు గవర్నర్ ను కల్సి హైద్రాబాద్ లో శాంతి భధ్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని ఫిర్యాదు చేశారు. మతోన్మాదులు ముత్యాలమ్మ గుడిలోని అమ్మవారిని ధ్వంసం చేసినప్పటికీ పోలీసులు ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయకపోవడం శోచనీయమన్నారు. ముత్యాలమ్మ గుడి వద్ద ఆందోళన చేస్తున్న హిందుత్వ వాదులపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని బిజెపి నేతలు తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద అఘోరీ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో సుసైడ్ చేసుకుంటానని ప్రకటన చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సడెన్ గా అఘోరీ కేదార్ నాథ్ లో ప్రత్యక్షం కావడంతో అఘోరీ పారిపోయినట్లు వదంతులు వచ్చాయి. ఈ వదంతులను స్వయంగా అఘెరీ కొట్టివేశారు. తాను ముత్యాలమ్మ గుడి వద్ద ఆత్మార్పణం చేసుకుంటానని పెట్రోల్ బాటిళ్లతో సిద్దిపేటలో ప్రత్యక్ష కావడం పోలీసులకు చెమటలు పట్టాయి. అఘోరీపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. నగ్నంగా అఘోరీ తిరగడం, నెంబర్ ప్లేట్ లేకుండా అఘోరీ కారులో ప్రయాణించడాన్ని కూడా వారు తప్పు పట్టారు. అఘోరీకి మానసిక చికిత్స అవసరమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. తనను తాను నియంత్రించుకోలేని అఘోరీ సనాతన ధర్మం పరిరక్షిస్తానని కొన్ని రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అని సనాతన ధర్మం చెబుతుంది. తనపై సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందని అఘోరీ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని సంప్రదాయవాదులు తప్పు పడుతున్నారు. అఘోరీ జనారణ్యంలోకి రారని వారు అంటున్నారు. భారతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని అఘోరీ రోడ్డుకెక్కడం చర్చనీయాంశమైంది. యూట్యూబ్ చానెళ్లకు అఘోరీ వందల ఇంటర్వ్యూలు ఇవ్వడం వెనక మతలబు ఏమిటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆపరేషన్ అఘోరీ చేపట్టిన పోలీసులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలేశారు. ఇప్పుడు ఎపి పోలీసులకు కూడా అఘోరీ తలనొప్పిగా మారారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు టోల్ గేట్ సిబ్బంది అఘోరీని అడ్డుకోవడం వివాదాస్పదమైంది. తన శరీరాన్ని తాకే ప్రయత్నం జరిగిందని అఘోరీ అంటున్నారు. తెలంగాణ పోలీసులు అఘోరీని వదిలించుకున్నప్పటికీ ఆంధ్ర పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/in-telangana-25-187899.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.