ఆకుకూరలు ఎందుకు ముఖ్యం?? క్యాల్షియం ఎందుకు అవసరం??

Publish Date:Dec 20, 2022

Advertisement

మనం రోజువారీ తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు ఎంతో ముఖ్యమైనవి. అయితే చాలామంది ప్రస్తుతం పట్టణాల్లో నివశిస్తున్నవారు అందుబాటులో లేవనే కారణంతో ఆకుకూరలు సరిగా తీసుకోవడం లేదు. కొందరు ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని ఆకుకూర మొక్కలు పెంచుకుని అప్పుడప్పుడు వాటిని తింటూ ఉంటారు. అవి ఎంతో ఆరోగ్యకరమే కాకుండా రసాయనాలు లేనివి కాబట్టి పలితాలు కూడా బాగా ఇస్తాయి. కానీ అసలు ఆకుకూరలు తిననివారు చాలామంది ఉంటారు.  

అసలు ఆకుకూరలు ఎందుకు తీసుకోవాలి?? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? వంటివి వివరంగా తెలిస్తే వాటిని ఆహారంలో తప్పకుండా తినడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. నిజానికి ఆకుకూరల ప్రాధాన్యత చిన్నప్పటి నుండి పాఠాలలో చదువుకుని తెలుసుకుంటూనే ఉన్నాం, విటమిన్స్ మొదలైన అంశాలలో మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకుంటుంటాం కానీ ఆరోగ్యం గురించి మాట్లాడుకునే సమయంలో మళ్ళీ వాటిని వివరంగా చర్చించుకోవాలి. లేకపోతే మన మొండి బుర్రలు ఆరోగ్యం గురించి భయంతో ఉండవు. 


ఆరోగ్యానికి ఆకుకూరలు రోజు తినాలి వీటిలో కూరగాయల కంటే రెట్టింపు పోషక విలువలు, మాంసకృత్తులు ఉంటాయి.


చాలామంది పాలకూర, టమాట కలిపి వండుకునే విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ రెండింటిని అప్పుడప్పుడు సందేహం లేకుండా వండుకుని తినచ్చు. 


 ఆకు కూరలను మొక్కల నుండి కోసిన తరువాత ఒకటి రెండు రోజులు నిలువ ఉంచుకోవచ్చేమో కానీ వాటిని చిన్నగా తరిగి నిలువ ఉంచకూడదు. అలా నిలువ ఉంచితే వాటిలో ఉండే పోషక విలువలు పోతాయి.  


చాలామంది క్యాల్షియం తక్కువ ఉందని, ఐరన్ తక్కువ ఉందని టాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా టాబ్లెట్లు ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి.  అందుకే వీటిని ఆకుకూరల నుండి పొందవచ్చు. 


ఆకు కూరలతో చాలామంది పొడికూరలు చేస్తుంటారు. ఆకుకూరలు ఫ్రై చేసి చేసే ఈ పొడికూరలలో పోషకాలు ఏమి ఉండవు. ఫ్రై చేయడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు నశిస్తాయి. అలాగే ఆకుకూరలతో చింతపండు ఎక్కువ జతచేయకూడదు  


తోటకూరను పెరుగు కలిపి నూనె లేకుండా వండుకోవచ్చు, అలాగే గోంగూరను  పాలు కలిపి వండుకోవచ్చు  అయితే నూనె లేకుండా వండాలి. ఇలా చేస్తే  రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యం కూడా. 


పప్పులను కూరగాయలతో లేదా ఆకుకూరలతో కలిపి వండుకోవాలి. దీనివల్ల రుచి మాత్రమే కాదు రెండింటి వల్ల పోషకాలు సమతుల్యంగా ఉంటాయి. 


ఆకు కూరలలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మద్యాహ్న సమయంలో తినాలి. ఆకుకూరలను పప్పులతో కలిపి వండినప్పుడు వాటిని  సాయంత్రం(లేదా రాత్రి) సమయంలో  తింటే గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. ఆకుకూరలు అన్నింటిలో "ఎ" విటమిన్ పుష్కలంగా ఉంటుంది. 


ఎన్నో చోట్ల విరివిగా పెరిగే చెట్లు మునగచెట్లు.  వీటికి ప్రత్యేక నీటి వసతి, సంరక్షణ అవసరం లేదు. వాటికవే పెరుగుతాయి. వీటి నుండి లభించే మునగాకును ప్రతిరోజు వంటలలో వాడవచ్చు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో అధికమొత్తంలో ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి ఐరన్ లోపం ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు. 


ఆకు కూరలలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని విరివిగా వాడితే మహిళలకు  జట్టు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా తోటకూర, మునగాకు, కరివేపాకు బాగా వాడాలి. 


ఆకుకూరలు బాగా వాడితే బాలింతలకు మంచిది. వీటివల్ల బాలింతలకు పాలు బాగాపడతాయి.


ఆకుకూరలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం టాబ్లెట్లు వాడితే అనర్థాలు కలుగుతాయి. అదే  సహజంగా లభించే క్యాల్షియం ద్వారా మన శరీరానికి ఎలాంటి అనర్థముండదు. కిడ్నీలో రాళ్లురావు. 


 మనకు అవసరమైన ఐరన్ కూడా  పండ్లలో కంటే ఆకు కూరలలోనే ఎక్కువగా ఉంటుంది.


పాలకూర, శనగపిండి, నిమ్మరసం, పచ్చిమిర్చి, అల్లం అన్ని కలిపి నూనె లేకుండా వెయించి బజ్జీల్లాగా తినవచ్చు.


గోధుమలు, పాలిష్ చేయని బియ్యం వంటి వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకుంట పూర్తి స్థాయిలో కాల్షియం అందుతుంది.

ఒకసారి తీసుకున్న పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు సుమారు 300 మిల్లీల కాల్షియాన్ని అందిస్తాయి. 


క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదలైన వాలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది.


కాల్షియం శరీరంలో వచ్చే వ్యాధి కారక క్రిములను నాశనం చేస్తుంది. కాబట్టి క్యాల్షియాన్ని శరీరానికి సరిపడా అందివ్వాలి.


                                     ◆నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.