ఆకుకూరలు ఎందుకు ముఖ్యం?? క్యాల్షియం ఎందుకు అవసరం??

Publish Date:Dec 20, 2022

Advertisement

మనం రోజువారీ తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు ఎంతో ముఖ్యమైనవి. అయితే చాలామంది ప్రస్తుతం పట్టణాల్లో నివశిస్తున్నవారు అందుబాటులో లేవనే కారణంతో ఆకుకూరలు సరిగా తీసుకోవడం లేదు. కొందరు ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని ఆకుకూర మొక్కలు పెంచుకుని అప్పుడప్పుడు వాటిని తింటూ ఉంటారు. అవి ఎంతో ఆరోగ్యకరమే కాకుండా రసాయనాలు లేనివి కాబట్టి పలితాలు కూడా బాగా ఇస్తాయి. కానీ అసలు ఆకుకూరలు తిననివారు చాలామంది ఉంటారు.  

అసలు ఆకుకూరలు ఎందుకు తీసుకోవాలి?? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? వంటివి వివరంగా తెలిస్తే వాటిని ఆహారంలో తప్పకుండా తినడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. నిజానికి ఆకుకూరల ప్రాధాన్యత చిన్నప్పటి నుండి పాఠాలలో చదువుకుని తెలుసుకుంటూనే ఉన్నాం, విటమిన్స్ మొదలైన అంశాలలో మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకుంటుంటాం కానీ ఆరోగ్యం గురించి మాట్లాడుకునే సమయంలో మళ్ళీ వాటిని వివరంగా చర్చించుకోవాలి. లేకపోతే మన మొండి బుర్రలు ఆరోగ్యం గురించి భయంతో ఉండవు. 


ఆరోగ్యానికి ఆకుకూరలు రోజు తినాలి వీటిలో కూరగాయల కంటే రెట్టింపు పోషక విలువలు, మాంసకృత్తులు ఉంటాయి.


చాలామంది పాలకూర, టమాట కలిపి వండుకునే విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ రెండింటిని అప్పుడప్పుడు సందేహం లేకుండా వండుకుని తినచ్చు. 


 ఆకు కూరలను మొక్కల నుండి కోసిన తరువాత ఒకటి రెండు రోజులు నిలువ ఉంచుకోవచ్చేమో కానీ వాటిని చిన్నగా తరిగి నిలువ ఉంచకూడదు. అలా నిలువ ఉంచితే వాటిలో ఉండే పోషక విలువలు పోతాయి.  


చాలామంది క్యాల్షియం తక్కువ ఉందని, ఐరన్ తక్కువ ఉందని టాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా టాబ్లెట్లు ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి.  అందుకే వీటిని ఆకుకూరల నుండి పొందవచ్చు. 


ఆకు కూరలతో చాలామంది పొడికూరలు చేస్తుంటారు. ఆకుకూరలు ఫ్రై చేసి చేసే ఈ పొడికూరలలో పోషకాలు ఏమి ఉండవు. ఫ్రై చేయడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు నశిస్తాయి. అలాగే ఆకుకూరలతో చింతపండు ఎక్కువ జతచేయకూడదు  


తోటకూరను పెరుగు కలిపి నూనె లేకుండా వండుకోవచ్చు, అలాగే గోంగూరను  పాలు కలిపి వండుకోవచ్చు  అయితే నూనె లేకుండా వండాలి. ఇలా చేస్తే  రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యం కూడా. 


పప్పులను కూరగాయలతో లేదా ఆకుకూరలతో కలిపి వండుకోవాలి. దీనివల్ల రుచి మాత్రమే కాదు రెండింటి వల్ల పోషకాలు సమతుల్యంగా ఉంటాయి. 


ఆకు కూరలలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మద్యాహ్న సమయంలో తినాలి. ఆకుకూరలను పప్పులతో కలిపి వండినప్పుడు వాటిని  సాయంత్రం(లేదా రాత్రి) సమయంలో  తింటే గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. ఆకుకూరలు అన్నింటిలో "ఎ" విటమిన్ పుష్కలంగా ఉంటుంది. 


ఎన్నో చోట్ల విరివిగా పెరిగే చెట్లు మునగచెట్లు.  వీటికి ప్రత్యేక నీటి వసతి, సంరక్షణ అవసరం లేదు. వాటికవే పెరుగుతాయి. వీటి నుండి లభించే మునగాకును ప్రతిరోజు వంటలలో వాడవచ్చు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో అధికమొత్తంలో ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి ఐరన్ లోపం ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు. 


ఆకు కూరలలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని విరివిగా వాడితే మహిళలకు  జట్టు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా తోటకూర, మునగాకు, కరివేపాకు బాగా వాడాలి. 


ఆకుకూరలు బాగా వాడితే బాలింతలకు మంచిది. వీటివల్ల బాలింతలకు పాలు బాగాపడతాయి.


ఆకుకూరలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం టాబ్లెట్లు వాడితే అనర్థాలు కలుగుతాయి. అదే  సహజంగా లభించే క్యాల్షియం ద్వారా మన శరీరానికి ఎలాంటి అనర్థముండదు. కిడ్నీలో రాళ్లురావు. 


 మనకు అవసరమైన ఐరన్ కూడా  పండ్లలో కంటే ఆకు కూరలలోనే ఎక్కువగా ఉంటుంది.


పాలకూర, శనగపిండి, నిమ్మరసం, పచ్చిమిర్చి, అల్లం అన్ని కలిపి నూనె లేకుండా వెయించి బజ్జీల్లాగా తినవచ్చు.


గోధుమలు, పాలిష్ చేయని బియ్యం వంటి వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకుంట పూర్తి స్థాయిలో కాల్షియం అందుతుంది.

ఒకసారి తీసుకున్న పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు సుమారు 300 మిల్లీల కాల్షియాన్ని అందిస్తాయి. 


క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదలైన వాలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది.


కాల్షియం శరీరంలో వచ్చే వ్యాధి కారక క్రిములను నాశనం చేస్తుంది. కాబట్టి క్యాల్షియాన్ని శరీరానికి సరిపడా అందివ్వాలి.


                                     ◆నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.