వయసులో తాగితే మెదడు గతి అంతే!

Publish Date:Dec 9, 2016

Advertisement

 


మ్యదపానం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకో పరిశోధనా వెలువడే కొద్దీ మద్యపానం వల్ల ఊహకి అందని సమస్యలెన్నో ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఫిన్లండులో సరికొత్తగా జరిగిన ఓ పరిశోధనతో, వయసులో మద్యపానాన్ని సేవించడం వల్ల, పిల్లలు మెదడు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని తేలుస్తోంది.

 

టీనేజిలో ఉండగా

ఫిన్లండుకి చెందిన పరిశోధకులు ఒక 62 మంది యువత నుంచి వారి ఆహారపు అలవాట్లకి సంబంధించిన వివరాలను సేకరించారు. ముందుగా ఒక పదేళ్ల క్రితం వారంతా టీనేజి వయసులో ఉన్నప్పుడు ఈ వివరాలను సేకరించారు. ఆ తరువాత ఐదేళ్ల క్రితమూ, ఏడాది క్రితమూ ఇవే వివరాలను సేకరించారు. ఇందులో భాగంగా వారి మందు అలవాట్లను గమనించారు. వీరిలో ఒక 35 మంది టీనేజిలో ఉండగా తెగ తాగేవారని తేలింది. మరో 27 మంది అప్పుడప్పుడూ మందుని రుచి చూసేవారట.

 

మెదడుని పరిశీలిస్తే

టీనేజిలో ఉండగా బాగా తాగేవారికీ, తక్కువ తాగేవారి ఆరోగ్యానికీ మధ్య మొదట్లో ఎలాంటి వ్యత్యాసమూ కనిపించలేదు. డిప్రెషన్‌ వంటి మానసిక వ్యాధులూ అగుపించలేదు. కాకపోతే బాగా మందు తాగేవారు, మందుతో పాటుగా సిగిరెట్లు కూడా ఎక్కువ తాగుతున్నట్లు మాత్రమే తేలింది. కానీ పెద్దయ్యాక వారి మెదడుని గమనిస్తే, రెండు విభాగాల మధ్య స్పష్టమైన తేడాలు బయటపడ్డాయి. వారిలో మెదడు వికసించిన తీరులో మార్పు కనిపించింది.

 

గ్రే మేటర్

టీనేజిలో తెగ తాగిన యువత మెదడులోని ‘గ్రే మేటర్’ అనే పదార్థం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. మనలో  జ్ఞాపకశక్తినీ, ఉద్వేగాలనీ, విచక్షణనీ, ఆత్మస్థైర్యాన్నీ నియంత్రించడంలో ఈ ‘గ్రే మేటర్‌’ది కీలక పాత్ర. మెదడులో ఇలాంటి లోటు చోటు చేసుకోవడం వల్ల టీనేజిలో బాగా తాగేసినవారిలో నానారకాల మానసిక సమస్యలూ ఏర్పడినట్లు గమనించారు. సమాజానికి దూరంగా ఉండటం, క్రుంగుబాటు వంటి సమస్యలు ఎదుర్కోవడం, చదువులో వెనబడటం వంటి ఇబ్బందులెన్నింటినో ఎదుర్కొన్నారట. దీనికి తోడు శాశ్వతంగా మద్యపానానికి బానిసైపోయే ప్రమాదంలోనూ మునిగిపోయారు.

 

ఖచ్చితమైన కారణం

టీనేజిలో విచ్చలవిడిగా తాగితే మెదుడు దెబ్బతినడానికి కారణం లేకపోలేదు. పిల్లలు 20 ఏళ్ల వయసుకి వచ్చేవరకు వారి మెదడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ కాలంలో కనుక మద్యానికి బానిసైతే, ఎదిగే మెదడు దెబ్బతినక మానదు. అందుకనే పిల్లల అలవాట్లను తల్లిదండ్రులు, తోటిమిత్రలు, ఉపాధ్యాయులు... ఓ కంట కనిపెడుతూ ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ టీనేజి పిల్లలు తెలిసీ తెలియక మద్యానికి బానిసలైనా... వెంటనే వారిలో ఆ అలవాటుని కనుక మాన్పించగలిగితే, తిరిగి మెదడులోని గ్రే మేటర్‌ పుంజుకోవడాన్ని గమనించారు. అలా కాకుండా దీర్ఘకాలం పాటు మద్యానికి బానిసగా కొనసాగితే, మెదడుకి కోలుకోలేని నష్టం ఖాయమట.

 

- నిర్జర.

By
en-us Political News

  
చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మందం పాటి దుస్తులు దరించినా, స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది. అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని..
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు...
ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం..
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.