Publish Date:Jan 27, 2025
దిగ్గజ క్రికెటర్లను వెనక్కు నెట్టి మరీ 2024 సంవత్సరానికి ఐసీపీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా నిలిచారు. గత ఏడాది టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బుమ్రానే ఐసీపీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం(జనవరి 27) విడుదల చేసిన ఓ ప్రకటనలో ఐసీపీఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోరూట్, శ్రీలంక ప్లేయర్ కామిందు మెండిస్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్లను వెనక్కి నెట్టి ఈ పురస్కారాన్ని అందుకున్నాడని పేర్కొంది.
కాగా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఆరో ఇండయన్ క్రికెటర్ గా బుమ్రా నిలిచారు. బుమ్రాకు ముందు ఈ అవార్డును 2004లో రాహుల్ ద్రావిడ్, 2009లో గౌతమ్ గంభీర్, 2010లో వీరేంద్ర సెహ్వాగ్, 2016లో అశ్విన్ , 2018లో విరాట్ కోహ్లీ అందుకున్నారు. అయితే ఈ అవార్డును అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లోనూ బుమ్రాకు చోటుదక్కిన సంగతి తెలిసిందే. 2024 ఏడాది మొత్తం బుమ్రా అసమాన్య ప్రతిభ కనబరిచారు. ఏడాది మొత్తంలో 13 టెస్టులు ఆడిన బుమ్రా మొత్తం 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కూడా రికార్డులకు ఎక్కడా. ఇక గత ఏడాది చివరిలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మొత్తం 32 వికెట్లు పడగొట్టారు. సొంత గడ్డపైనా, విదేశీ గడ్డపైనా కూడా అత్యద్భుతంగా ఆడిన బుమ్రా టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ఘనత సాధించిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇలా ఉండగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో గాయంతో వైదొలగిన బుమ్రా ప్రస్తుతం రెస్టు తీసుకుంటున్నారు. చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా కోలుకుంటే టీమ్ ఇండియాకు తిరుగుండదు. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో బుమ్రాకు చోటు దక్కింది. ఇక మ్యాచ్ లలో ఆడటం అన్నది అతని ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/icc-test-crickter-of-the-year-39-191942.html
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.