ఐఏఎస్‌లా? అటెండ‌ర్లా? జ‌గ‌న్ ద‌గ్గ‌ర మోకాళ్ల‌పై కుర్చోవ‌డ‌మేంటి?

Publish Date:Jan 27, 2022

Advertisement

ఐఏఎస్‌. కేంద్ర స‌ర్వీసు ఉద్యోగులు. దేశంలోకే అత్యున్న‌త కేడ‌ర్‌. అందులోనూ ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి అంటే మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌. అయితే ఏంటి? ఎవ‌రైనా, ఎంత‌టి వాడైనా.. జ‌గ‌న్ ముందు జీహుజూర్ అనాల్సిందేనా? రాజారెడ్డి రాజ్యాంగంలో అలా ఉందా? అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏపీలో లేటెస్ట్‌గా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌.. రాష్ట్రంలో ఐఏఎస్‌లు ఎంత దిగ‌జారిపోయారో చెప్పేందుకు సాక్షంగా నిలుస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ఐఏఎస్‌ అధికారులు పాల్గొన్నారు. ముందు వరుసలో సీఎం కూర్చున్నారు. అధికారులు ఆయన వెనుక కూర్చొన్నారు. మ‌ధ్య‌లో ఓసారి సీఎం జగన్‌ పిలవగానే ప‌రుగున‌ వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌.. వేదిక‌పైనే మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడారు. అదంతా వీడియోలో రికార్డు అయ్యింది. ఆ ఘ‌ట‌నే ఇప్పుడు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. 

ఐఏఎస్‌లు స్వేచ్ఛ‌గా ప‌ని చేయాల్సిన అధికారులు. అలాంటిది.. జ‌గ‌న్ ముందు ముఖ్య కార్య‌ద‌ర్శి అంత‌టివారే ఇలా మోక‌రిల్లితే ఎలా?  మిగ‌తా ఉద్యోగుల‌కు ఎలాంటి సిగ్న‌ల్స్ వెళ‌తాయి? ఉద్యోగ స‌మాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్న‌ట్టు?  ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ తీరుపైనా.. ఆయ‌న్ను అలా దిగ‌జారేలా చేసిన జ‌గ‌న్‌పైనా.. ఐఏఎస్ స‌ర్కిల్స్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

గ‌తంలో తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలానే జ‌రిగింది. సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి.. ఓ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ కాళ్లు మొక్క‌డం తీవ్ర కాంట్ర‌వ‌ర్సీగా మారింది. క‌ట్ చేస్తే.. ఆ వెంక‌ట్రామిరెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్‌లో చేరి.. ఎమ్మెల్సీ అయ్యారు. వెంక‌ట్రామిరెడ్డిలా కాళ్ల మీద ప‌డ‌కున్నా.. ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌ మోకాళ్ల‌పై కూర్చోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ ఐఏఎస్ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

By
en-us Political News

  
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అదే కోడ్ అమలులోకి వచ్చింది. దేశ మంతా కోడ్ అమలు అవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న అనమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు.
ఏపీలో వైసీపీకి గాలాడటం లేదు. ఆ పార్టీ శ్రేణుల్లోనే వైసీపీ ఓటమి ఖాయమన్న భావన వ్యక్తం అవుతోంది. చివరాఖరికి ఐప్యాక్ తాజాగా జగన్ కు సమర్పించిన నివేదికలో కూడా అదే విషయాన్ని పేర్కొంది. ఇంత కాలం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జగన్ సొంత సామాజిక వర్గం కూడా అధికార పార్టీకి దూరమైపోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ స‌ర్కార్ కు ఈసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్ద‌రూ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని, ఎన్నిక‌ల‌కు సంబంధంలేని విధుల‌ను వీరికి అప్ప‌గించాల‌ని ఆదేశించింది.
శ్రీరాముడి పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తోందని.. శ్రీరాముడు బీజేపీ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాదు..ఆయన అందరివాడు..బిజెపి ఓడిపోయిన శ్రీరాముడికి ఏం కాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే.
ఖమ్మం లోక్ సభ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ కర్ర విరగాకుండా, పాము చావకుండా అన్నట్లు వ్యవహరించిందా? ఈ సీటు తన తమ్ముడికే ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటి.. కాదు తన భార్యకే అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా మూడో వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చిందా?
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పాపం ఎంత వుందో, బీజేపీ పాపం కూడా అంతే వుంది.
ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దంటూ కడప కోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టును ఇశ్రయించారు.
రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికి విధ్యార్హతలు అక్కరలేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు, ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.