Publish Date:Jan 27, 2022
ఐఏఎస్. కేంద్ర సర్వీసు ఉద్యోగులు. దేశంలోకే అత్యున్నత కేడర్. అందులోనూ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అంటే మరింత పవర్ఫుల్. అయితే ఏంటి? ఎవరైనా, ఎంతటి వాడైనా.. జగన్ ముందు జీహుజూర్ అనాల్సిందేనా? రాజారెడ్డి రాజ్యాంగంలో అలా ఉందా? అంటూ విమర్శలు వస్తున్నాయి. ఏపీలో లేటెస్ట్గా జరిగిన ఓ ఘటన.. రాష్ట్రంలో ఐఏఎస్లు ఎంత దిగజారిపోయారో చెప్పేందుకు సాక్షంగా నిలుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే....
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సహా పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ముందు వరుసలో సీఎం కూర్చున్నారు. అధికారులు ఆయన వెనుక కూర్చొన్నారు. మధ్యలో ఓసారి సీఎం జగన్ పిలవగానే పరుగున వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. వేదికపైనే మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడారు. అదంతా వీడియోలో రికార్డు అయ్యింది. ఆ ఘటనే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది.
ఐఏఎస్లు స్వేచ్ఛగా పని చేయాల్సిన అధికారులు. అలాంటిది.. జగన్ ముందు ముఖ్య కార్యదర్శి అంతటివారే ఇలా మోకరిల్లితే ఎలా? మిగతా ఉద్యోగులకు ఎలాంటి సిగ్నల్స్ వెళతాయి? ఉద్యోగ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? ప్రవీణ్ ప్రకాశ్ తీరుపైనా.. ఆయన్ను అలా దిగజారేలా చేసిన జగన్పైనా.. ఐఏఎస్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలానే జరిగింది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. ఓ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం తీవ్ర కాంట్రవర్సీగా మారింది. కట్ చేస్తే.. ఆ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్లో చేరి.. ఎమ్మెల్సీ అయ్యారు. వెంకట్రామిరెడ్డిలా కాళ్ల మీద పడకున్నా.. ప్రవీణ్ ప్రకాశ్ మోకాళ్లపై కూర్చోవడం కలకలం రేపుతోంది. ఆ ఐఏఎస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ias-praveen-prakash-kneel-down-in-front-of-cm-jagan-39-130793.html
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్కడ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొనసాగుతోంది
ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం
కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది.
దెందులూరులో మరోసారి వైసిపి గుండాల అరాచకం
2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,
బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి
రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.