హైడ్రా కమిషనర్ రంగనాథ్కు భారీ షాక్..!
Publish Date:Jul 27, 2026
Advertisement
హైడ్రా కమిషనర్ పదవి నుండి తొలగించండి హైకోర్టు ప్రభుత్వన్నికి ఆదేశం..! తనకు న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం, విశ్వాసం ఉందని, కోర్టు ఆదేశాలను ధిక్కరించే ఉద్దేశం ఎప్పుడూ లేదని వివరించారు. అయితే, రంగనాథ్పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదై ఉండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టులపై నమ్మకం ఉందని చెబుతున్నప్పుడు ఇన్ని కాంటెంప్ట్ కేసులు ఎందుకు నమోదయ్యాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల అమలులో పదేపదే ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, ప్రజా అధికారులు న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. దీనికి స్పందించిన రంగనాథ్, తనకు న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, ఒకవేళ తన చర్యల వల్ల కోర్టుకు అసౌకర్యం కలిగినట్లయితే అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే, వరుసగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో హైడ్రా వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ పదవిలో రంగనాథ్ కొనసాగడం సముచితం కాదని అభిప్రాయపడిన హైకోర్టు, ఆయనను ఆ పదవి నుంచి తొలగించి తగిన ప్రత్యామ్నాయ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తాజా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో, పరిపాలనా వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది Hydra Commissioner Ranganath, Telangana High Court, Hydra, Telangana goverment, CM Revanth reddy
పలు కోర్టు ధిక్కరణ (కాంటెంప్ట్) కేసుల విచారణలో తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో పదేపదే నిర్లక్ష్యం జరిగినట్లు అభిప్రాయపడిన న్యాయస్థానం, రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆ స్థానంలో సమర్థుడైన మరో అధికారిని నియమించి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. విచారణలో భాగంగా లోతుకుంట భూముల వ్యవహారంపై రంగనాథ్ కోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తూ క్షమాపణలు తెలిపారు. లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా ప్రవేశించలేదని, ఈ కేసులో పిటిషనరే అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని అఫిడవిట్లో పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/hydra-commissioner-ranganath-36-227249.html





