చెరువుల పునరుజ్జీవనానికి హైడ్రా ముందడుగు..!

Publish Date:Aug 6, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా మరో కీలక అడుగు వేస్తోంది. పునరుద్ధరిస్తున్న చెరువుల్లోకి స్వచ్ఛమైన నీరు చేరేలా చర్యలు చేపడుతోంది. మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా అడ్డుకోవడంతో పాటు, వర్షాకాలంలో వరదనీరు చెరువుల్లోకి చేరేలా ఇన్‌లెట్ల అభివృద్ధి పనులు చేపడుతోంది. అలాగే తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసి చెరువులకు అందించే విధానాలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే బిట్స్ పిలానీ కేకే బిర్లా గోవా క్యాంపస్‌లో అభివృద్ధి చేసిన **'వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ టెక్నాలజీ'**ని హైడ్రా పరిశీలించింది.

స్థిరమైన మురుగునీటి నిర్వహణ, పట్టణ సరస్సుల పునరుద్ధరణ లక్ష్యంగా బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ ఆహ్వానం మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్యాంపస్‌ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను పరిశీలించిన ఆయన, SBR, MBR టెక్నాలజీలతో పాటు వెట్‌ల్యాండ్ ట్రీట్‌మెంట్ వంటి ఆధునిక విధానాలపై నిపుణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా, ఈ సాంకేతిక పరిజ్ఞానాలతో క్షేత్రస్థాయిలో మురుగునీటిని ఎలా శుద్ధి చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా తక్కువ విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం, దీర్ఘకాలిక సామర్థ్యం వంటి అంశాలను అధ్యయనం చేశారు. ప్రకృతి ఆధారిత నీటి శుద్ధి విధానమైన వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ టెక్నాలజీ నీటి నాణ్యతను మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పునరుద్ధరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు కూడా సమర్థవంతంగా దోహదపడుతుందని బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ ప్రొఫెసర్లు కమిషనర్‌కు వివరించారు. నగరంలోని చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాఫ్ట్స్ అధినేత యూనస్ కూడా కమిషనర్ వెంట ఉన్నారు.

తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసి చెరువులకు అందించే ఈ విధానాన్ని హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని హైడ్రా నిర్ణయించింది. తొలి దశలో పాతబస్తీలోని బమ్రకున్-ఉద్-దౌలా చెరువులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి దాని పనితీరును పరిశీలించనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. పర్యావరణహితమైన, తక్కువ విద్యుత్ వినియోగం మరియు నిర్వహణ వ్యయంతో కూడిన ఈ సాంకేతికతను వినియోగించడం ద్వారా నగరంలోని చెరువులకు శుద్ధి చేసిన నీటిని అందించడంతో పాటు, చెరువుల పునరుద్ధరణకు మరింత ఊతం లభిస్తుందని హైడ్రా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

HYDRA, BITS Pilani, KK Birla Goa Campus, SBR, MBR, Wetland Treatment, Sewage Treatment, Wastewater Management, Urban Lake Restoration
 

By
en-us Political News

  
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!
మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల....
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు
నోరు పారేసుకుంటే ఇళ్లకు వచ్చి కొడతాం....!
నెలకు రూ.1.5 లక్షల జీతం అని చెప్పి.. బీర్ షాప్ ఓనర్‌కు అమ్మేశారు..!
అదుపుతప్పి బోల్తా పడిన 100 అడుగుల లోయలో పడ్డ ప్రైవేటు బస్సు..!
నర్సంపేట మాజీ శాసనసభ్యులు, దివంగత నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండంత అండగా నిలిచారు.
అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్)  ఈ ఐకానిక్ సిగ్నేచర్ బ్రిడ్జికి  సంబంధించిన ఫీజిబిలిటీ, డీపీఆర్,  కన్సల్టెన్సీ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టింది. 
ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు, నియామక ప్రక్రియకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్న ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.
క్యాన్సర్ మందుల విపరీతమైన ధరలపై కేంద్ర ప్రభుత్వ వివరణను పార్లమెంటరీ స్థాయి సంఘం తోసిపుచ్చింది. ట్రేడ్ మార్జిన్లపై తక్షణమే పరిమితులు విధించి, ప్రాణరక్షణ ఔషధాల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల షాట్‌పుట్ F57 విభాగంలో 9.81 మీటర్ల త్రోతో పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించిన పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ స్ఫూర్తిదాయక జీవిత కథ మరియు పోరాట విశేషాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.