Publish Date:Aug 29, 2020
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలోని గోషామహల్ బీజేపీఎమ్మెల్యే రాజాసింగ్ కు డిసిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో భద్రత కల్పించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న కారణంగా ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఆయన పాత గన్ మెన్ స్థానంలో ఆధునిక ఆయుధాలకు కలిగిన కమెండోలను ఏర్పాటుచేశారు. పాత బస్తీలో ఉన్న రాజాసింగ్ ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భారీ స్థాయిలో భద్రతావలయాన్ని ఏర్పాటుచేశారు.
ఎప్పుడు ప్రజల్లో ఉండే రాజాసింగ్ ఇకపై స్వేచ్ఛగా బైక్ పై తిరగవద్దని ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు బయటకు వెళ్లాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన గాలింపు చర్యల్లో దొరికిన కొంతమంది వద్ద మారణాయుధాలతో పాటు రాజాసింగ్ పేరు ఉన్న జాబితా కూడా దొరికిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇటీవల హైదరాబాదులో కొంతమంది స్లీపర్ సెల్స్ ను అదుపులోకి తీసుకున్నప్పుడు వారి వద్ద కూడా రాజాసింగ్ పేరు లభించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నాయకుల పై ఉగ్రవాదులు దృష్టిసారించారని, వారి ప్రాణాలకు ముప్పు ఉందని గత కొద్దిరోజులుగా కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు కూడా చెప్తున్నాయి. ఈనెల 15న భారత స్వాతంత్ర దినోత్సవం రోజు కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి అధికారిక వెబ్ సైట్ ను కూడా హ్యాక్ చేశారు. దీనిపై ఇప్పటికే కేసు ఫైలు చేసి విచారణ చేస్తున్నారు. గతిమాలిన ఉగ్రవాదులు బిజెపి నాయకులను హతమార్చిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు రాజాసింగ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
2013లో బిజెపి పార్టీలో చేరిన రాజాసింగ్ ఆ తర్వాత ఏడాది లోనే పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుపడి ప్రజల పక్షాన నిలబడ్డారు. దాంతో 2014లో వచ్చిన ఎన్నికల్లో గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ టికెట్ సాధించాడు. విజయం సాధించి పాతబస్తీలో పాగా వేసిన అభ్యర్థిగా గుర్తింపు పొందాడు. తిరిగి 2018 ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి కాషాయా జెండాను మరోసారి ఎగురవేశాడు.
తాజాగా తన భద్రత పెంపుపై ఆయన స్పందిస్తూ తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో చెప్పాలని కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రికి, కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖలు రాస్తాను అంటున్నారు. ఉగ్రవాదుల నుంచా, స్థానిక సంస్థల నుంచా ఎవరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందో స్పష్టం చేయాలని ఆయన కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-police-increases-security-of-bjp-mla-raja-singh-39-103392.html
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.