Publish Date:Jan 28, 2025
గ్రేటర్ హైద్రాబాద్ లో రాజకీయాలు వేడెక్కాయి. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన హైద్రాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి పదవీగండం పొంచి ఉంది. సీనియర్ రాజకీయనాయకుడు కెకె కూతురు అయిన విజయలక్ష్మి పదవీకాలం ఇంకా ఉంది. అయితే జీహెచ్ ఎంసి చట్టాల ప్రకారం నాలుగేళ్లు పూర్తయితే అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించాలి. వచ్చే నెల (ఫిబ్రవరి 10) నాలుగేళ్లు పూర్తి కానుంది. కాబట్టి బిఆర్ ఎస్ అవిశ్వాసం పెట్టే ప్లాన్ లో ఉంది. ఈ అవిశ్వాసాన్ని బలపరచడానికి అప్పటి మిత్రపక్షమైన ఎంఐఎం కాంగ్రెస్ చంకలో చేరడంతో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు కూడా తక్కువే. అయితే బిఆర్ఎస్ కు బిజెపి సపోర్ట్ చేయనుందని చెబుతోంది. బిఆర్ఎస్ కేవలం బిజెపి బలం మీదే ఆధారపడింది. ఒకరకంగా చెప్పాలంటే బిఆర్ఎస్ కు బిజెపి మిత్ర పక్షమైనప్పటికీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తర్వాత ఈ రెండు పార్టీల బంధానికి బీటలు వారింది. జిహెచ్ ఎంసిలో 150 కార్పోరేటర్లకు గాను ఇద్దరు ఎమ్మెల్యేలు కావడం, మరో ఇద్దరు చనిపోవడంతో ఈ సంఖ్య 146కి పడిపోయింది. 50 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 196 మంది ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్ సీలు ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి ఎన్నికైన 41 మంది కార్పోరేటర్లు అసమ్మతి తీర్మానానికి సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఎంఐఎం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ ఎస్ ఘోర పరాజయం తర్వాత మజ్లిక్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. 2020 డిసెంబర్ లో జరిగిన జిహెచ్ ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పోరేటర్లు గద్వాల విజయలక్ష్మి, శ్రీలతా శోభన్ రెడ్డిలు మేయర్ డిప్యూటి మేయర్ పదవులు అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వీరిరువురు కాంగ్రెస్ పార్టీలో మారారు. వీరు కాంగ్రెస్ పార్టీలో మారడానికి మాజీ బిఆర్ఎస్ పొలిట్ బ్యురో సభ్యులైన కె. కేశవరావు ముఖ్యభూమిక వహించారు. తనకు పదవీగండం ఉందని వస్తున్న వార్తలను మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఖండించారు. ఆమెకు కాంగ్రెస్ కార్పోరేటర్లు పూర్తి మద్దతుగా నిలబడటంతో గద్వాల విజయ లక్మి పదవికి ఎటువంటి ఢోకా లేదని సమాచారం. అవిశ్వాసతీర్మానం పెట్టాలి అని భావిస్తున్న బిఆర్ఎస్ కు 42 కార్పోరేటర్లు, 29 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బిఆర్ఎస్ కుమరో 27 మంది సభ్యులు కావాలి. ఎంఐఎం కాంగ్రెస్ కు దగ్గరవడంతో బిఆర్ ఎస్ బిజెపి బలం మీద ఆధారపడింది. బిజెపి అధిష్టానం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మేయర్ కు పదవి గండం విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-mayor-gadwala-vijayalakshmi-tenure-25-191977.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.