హైదరాబాద్ పేలుళ్ళ కేసు కంచికేనా?

Publish Date:Mar 5, 2013

Advertisement

 

హైదరాబాద్ బాంబు ప్రేలుళ్ళపై జరుగుతున్న దర్యాప్తు ఇప్పుడపుడే ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడంలేదు. డిల్లీ నుండి తీసుకువచ్చిన ఇద్దరు నేరస్తులు ఇక్బాల్, సయీద్ లను నగరం అంతా తిప్పినా పోలీసులకి తగిన సమాచారం మాత్రం ఏమి దొరకలేదు. అందువల్ల వారిని మళ్ళీ డిల్లీకి పంపించేసారు.

 

ఇక, ఈ కేసు దర్యాప్తులో వివిధ శాఖలు, రాష్ట్రాలకు చెందిన కనీసం ఏడూ నుండి పది వరకు బృందాలు పనిచేస్తున్నపటికీ, ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు సాగుతున్న దర్యాప్తు వల్ల కేసులో పురోగతి కనిపించలేదు. అందువల్ల, ఈ కేసులో మొదటి నుండి దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (యన్.ఐ.ఏ) కే మొత్తం బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొన్నాయి. అయితే, రాష్ట్ర పోలీసులతో బాటు ఇంతవరకు ఈ కేసు దర్యాప్తులో పనిచేస్తున్న వివిధ సంస్థలు తమ దర్యాప్తు కొనసాగించడానికి కేంద్రం అనుమతించినప్పటికీ, తమకి అందిన సమాచారం జాతీయ దర్యాప్తు సంస్థకు అందజేస్తూ ఉండాలని ఆదేశించింది.

 

అయితే, కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంలో చేసిన జాప్యం వల్ల ఇప్పటికే చాల విలువయిన కాలం గడిచిపోయింది. తద్వారా బాంబు ప్రేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు తప్పించుకోవడానికి తగిన అవకాశం కూడా కల్పించినట్లయింది. ఇటువంటి సంఘటనలు జరగడం మన రాష్ట్రంలో, దేశంలో ఇదే తొలిసారి కాకపోయినపట్టికీ, ఇంతవరకు ప్రభుత్వాలు కానీ, సంబందిత శాఖలు కానీ కొత్తగా నేర్చుకొన్నది ఏమిలేదని అర్ధం అవుతోంది.

 

ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవిధంగా స్పందించాలి, ఎవరు స్పందించాలి, ఎవరు విచారణ చేయాలి, ఎవరు ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలి అనే విషయాలపై ఇంకా సరయిన అవగాహన కానీ, ప్రణాళిక గానీ ఏర్పరుచుకోలేదని ఈ నిర్ణయం వల్ల అర్ధం అవుతోంది. ఇటువంటి దుర్ఘటన జరిగిన ప్రతీసారి కూడా మన భద్రతా వ్యవస్థలలో వృత్తి నైపుణ్యానికి బదులు అయోమయం కనిపించడం సామాన్య ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తుంటుంది.

 

సామన్య ప్రజలు వారు చేపట్టిన వృత్తిలో పూర్తి స్థాయిలో నైపుణ్యం చూపడం ద్వారానే వారి జీవిక పొందగలుగుతున్నారు. కానీ, దేశ రక్షణ, అంతర్గత భద్రత వంటి కీలక వృత్తిని చేపట్టిన వ్యక్తులు మాత్రం ఈవిదంగా తరచూ అయోమయంగా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః వ్యక్తుల మద్య, వ్యవస్థల మద్య సరయిన సమాచార మార్పిడి లేకపోవడం, రాజకీయాలు, బేషజాలు మొదలయినవి ఈ అయోమయానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చును. అయితే, ఇటువంటి చిన్న సమస్యలను సైతం అధిగమించలేని సదరు బృందాలు, ప్రభుత్వాలు ఇక కీలకమయిన దర్యాప్తులు ఏవిధంగా కొనసాగించగలవనే అనుమానం ప్రజలలో కలగడం సహజం.

 

అయినప్పటికీ, ఇంతవరకు సదరు సంస్థల పనితీరులో కానీ, ప్రభుత్వం ఆలోచన తీరులో గానీ పెద్ద మార్పు లేకపోవడం విడ్డూరం. ఇప్పటికయినా ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి దాడులను అరికట్టేందుకు, ఇటువంటి కేసులను పరిష్కరించేందుకు తగిన భద్రతా వ్యవస్థను, ప్రణాళికను ఏర్పరుచుకోకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలే అవుతుంటాయి.

By
en-us Political News

  
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.