హైదరాబాద్ పై మొదలయిన చిచ్చు

Publish Date:Aug 3, 2013

Advertisement

 

హైదరాబాద్ పై రెండు ప్రాంతాలవారి పట్టుదలలు గురించి కేంద్రానికి పూర్తి అవగాహన ఉన్నపటికీ, దానిపై సరయిన వివరణ ఈయకుండా, హైదరాబాదును పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని క్లుప్తంగా చెప్పి రాష్ట్ర విభజన ప్రకటన చేసి చేతులు దులుపుకొంది. కేంద్రం హైదరాబాద్ పై స్పష్టత ఈయకపోవడంతో దానిపై రకరకాల అనుమానాలు, ఊహాగానాలు, వాదనలు, ప్రతిపాదనలు మొదలయ్యాయి. కొంత మంది నేతలు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరుతుంటే, మరికొందరు దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మరో సరికొత్త రాజధానులు ఏర్పరచాలని వాదిస్తున్నారు.

 

చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతున్న మంత్రి సి.రామచంద్రయ్య హైదరాబాద్ ను శాశ్వితంగా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని మరో సరికొత్త ప్రతిపాదన చేసారు. అయితే, హైదరాబాద్ కి ఆంధ్ర ప్రాంతానికి మధ్య తెలంగాణా ప్రాంతాలు ఉండటం వలన హైదరాబాదును శాశ్విత ప్రాతిపాదికన రాజధానిగా చేయడం అసాదయం. అయినప్పటికీ, అక్కడ నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఇటువంటి ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. నిన్న కొందరు కాంగ్రెస్ యంపీలు రాజీనామాలు చేసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపివచ్చిన చిరంజీవి కూడా హైదరాబాద్ ను శాశ్విత ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని కోరడం గమనిస్తే బహుశః కేంద్రం కూడా అటువంటి ఆలోచనలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఇటువంటి ప్రతిపాదనలు చేసినంత తేలికగా ఆచరణ సాధ్యం కాదు.

 

రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా సాగాలంటే, ముందుగా రాజధాని హైదరాబాద్ పై రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న భయాలు, అపోహలు, అనుమానాలను తొలగించవలసి ఉంటుంది. హైదరాబాద్ మరియు ఇతర అంశాలను అధ్యయనంచేసి ఇరు ప్రాంతాల వారికి ఆమోధయోగ్యమయిన తగిన పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు నిన్ననే ప్రకటించింది.

 

అయితే, కేసీఆర్ వంటి అతివాదులు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తుండటం వల్ల, అక్కడ స్థిరపడిన లక్షలాది ఆంద్ర ప్రజల భయాందోళనలు మరింత పెరిగాయి. అనేక సంవత్సరాలుగా ఒకే చోట కలిసిమెలిసి పనిచేస్తున్న ఉద్యోగులలో ఇటువంటివి చిచ్చు పెట్టి వారి మధ్య ఉద్రిక్తతలకు పెంచడం ఖాయం. అదేవిధంగా హైదరాబాదులో నివసిస్తున్న ప్రజల మధ్య కూడా వైషమ్యాలు సృష్టించడం ఖాయం. అందువల్ల కేంద్రం హైదరాబాద్ ను ముందు తన అధీనంలోకి తీసుకొని ప్రజల అపోహలు దూరం చేయడం మంచిది. లేకుంటే రెండు ప్రాంతాల అతివాదుల వాద ప్రతివాదాల కారణంగా ప్రజల మధ్య ఘర్షణ చెలరేగితే మరో కొత్త సమస్య మొదలవుతుంది. చేతులు కాలిన తరువాతనే ఆకులు పట్టుకొనే అలవాటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇకనయినా ఆ అలవాటు మానుకొని ముందుగానే మేల్కొంటే మంచిది.

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.