Publish Date:Jun 29, 2022
సముద్రం మీదకి వెళ్లి రోజంతా వల విసిరి సాయంత్రానికి ఓ పది చేపలు కాస్తంత పెద్దవి పట్టుకు వస్తే మత్స్యకారుల కుటుంబానికి, ఒడ్డున వేచి వున్నవారందరికీ తెగ సంబరం. ఎప్పుడో గాని బాగా పెద్ద చేపలు పడవు. కానీ వలతో వేటకు వెళ్లకా తప్పదు. కానీ వేటకి వెళ్లినవారికి హఠాత్తుగా అతి పెద్ద, పురాతన చేప దొరికితే? దాన్ని పట్టి అతికష్టంమీద బయటికి తీసికొచ్చి చూసి ఆనందిస్తారా, కోసి వారం రోజులు తినేద్దా మనుకుంటారా? సాధారణంగా రెండో ఆప్షన్ కే ఇష్టపడతారు జనాలు. కానీ స్టీవ్, మార్క్ అనే మత్స్యకారు లు మాత్రం అలా అనుకోలేదు. వాళ్లు మొదటి ఆప్షన్ నే ఎంచుకున్నారు.
విషయమేమంటే.. బ్రిటీష్ కొలంబియాకి చెందిన స్టీవ్, మార్క్లు నదీజలాల్లో వేటాడటంలో వలను వొడు పుగా విసిరేసి పట్టగల మరో ఇద్దరు నిపుణులతో కలిసి లిల్లూటీ అనే నదిలోకి ప్రయాణమయ్యారు. రెండు గంటల తర్వాత హఠాత్తుగా వారికి తెల్లటి స్టర్జియన్ పట్టుబడింది. దాని సైజు చూసి నిర్ఘాంతపోయారు. అది ఏకంగా పధ్నాలుగు అడుగులు వుంది. మరీ చిత్రమేమంటే దాని వయసు సుమారు వందేళ్లు! దాని బరువు ఏకంగా 317 కేజీలు. దాని నడుము చుట్టుకొలత 57 అంగుళాలు. ఇది నిజంగానే అతి ప్రాచీన కాలం చేప అంటున్నారు జల జీవాల నిపుణులు. ఉత్తర అమెరికాలోని నదీజలాల్లో ఇటువంటివి అప్పుడపుడు కనపడతాయిట. ఇవి 14 అడుగుల పొడవు, 680 కిలోల బరువు వరకూ పెరుగుతాయిట.
కాగా ఈ తెల్ల సర్జియన్ చేప శరీరంపై ఎముకల పలకలతో చాలా పెద్ద ఆదిమ చేప. ఇది సమశీతోష్ణ సము ద్రాలు ఉత్తర అర్ధగోళంలోని నదులలో, ముఖ్యంగా మధ్య యురేషియాలో కనపడుతుంది. దాని మాంసా నికి వాణిజ్య ప్రాముఖ్యత ఉంది. ఇటువంటి చేపలు కనీసం 150 ఏళ్లు జీవిస్తాయని జల జీవాల పరిరక్షణ సంస్థ అధికారులు తెలిపారు. అయితే ఈ సర్జియన్ను పట్టుకున్న వారు దాని చరిత్రను తెలుసుకుని, అధికారులకు తెలియజేసి మళ్లీ విశాల జలప్రవాహంలో జాగ్రత్తగా వదిలేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hunderd-years-old-fish-caught-and-leave-39-138670.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.