పెద్దిరెడ్డికి అవమానం.. జగన్ నైజమే అంత అంటున్న వైసీపీయులు!

Publish Date:Nov 23, 2024

Advertisement

సీనియర్ నేత పెద్దిరెడ్డిని జగన్ రెడ్డి హ్యూమలేట్ చేశారు. ఆయన స్థాయికి అతి చిన్న పదవి అయిన పీఏసీ సభ్యుడి పదవికి పోటీ చేయమని చెప్పి ఆయన పత్తా లేకుండా పోయారు. కనీసం ఓటింగ్ కు కూడా రాలేదు. ఆయన రాలేదని మిగతా ఎమ్మెల్యేలు కూడా రాలేదు. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే పదో వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అంత బలం వైసీపీకి లేకనే జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష  నేతహోదా కూడా రాలేదు.

పీఏసీ సభ్యుడిగా ఎన్నికవ్వడానికి అవసరమైన బలం  వైసీపీకి లేదు.  అయినా జగన్ పెద్దిరెడ్డిని పోటీ చేయమన్నారు. కానీ ఓటింగ్ ప్రారంభం కాక ముందే తాము బాయ్ కాట్ చేస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది. దీనికి కారణం ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ కు రాకపోవడమే. స్వయంగా పార్టీ అధినేత జగన్ ఓటింగ్ కు రాకుండా అంసెబ్లీ ప్రారంభమయ్యే సమయానికి బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో మరికొంత మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.

జగన్ ను నమ్మి ఆయనతో నడిచిన వారికి అవమానాలు ఎదురు కావడం సాధారణమే. అలా జగన్ పంచన చేరి అవమానాలకు గురైన వారిలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదు. నమ్మిన బంట్లుగా పని చేసిన వారికి కూడా జగన్ పూచిక పుల్ల విలువ ఇవ్వరు. ఇప్పుడు అలా అవమాన భారంతో తలదించుకునే పరిస్థితి పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురైంది. అందలం ఎక్కిస్తున్నానంటూ చెప్పి చివరికి పాతాళంలోకి తొక్కేయడం జగన్ కు అలవాటేనన్న సంగతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో మరో సారికి రుజువైంది. 

ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత జగన్ కు, ఆయన పార్టీకీ అడుగడుగునా అడ్డంకులే ఎదురౌతున్నాయి. జగన్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కేసుల భయంతో వణికి పోతున్నారు. కొందరు అరెస్టై జైలులో ఉంటే, మరి కొందరు నోటీసులు అందుకుని పోలీసు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇంకొందరు ఆచూకీ లేకుండా పరారీలో ఉన్నారు. ఇక పార్టీ నుంచి ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు బయటకు వెళ్లిపోయారు. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఇహనో ఇప్పుడో మీడియా ముందుకు వచ్చి తాను పార్టీ వీడడానికి కారణాలు చెప్పనున్నారు. ఓ వైపు పార్టీ ఖాళీ అవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నా, జగన్ తన నైజాన్ని ఇసుమంతైనా మార్చుకోవడం లేదు. తాను భ్రమల్లో బతకడమే కాకుండా, తన పార్టీ నేతలు, శ్రేణులూ కూడా భ్రమల్లోనే బతకాలని శాసిస్తున్నారు. అంతే కాకుండా ఆ భ్రమలే నిజమని జనాన్ని నమ్మించడానికి తనను నమ్ముకుని వెంట నడుస్తున్న నేతలను నిలువునా ముంచేస్తున్నారు. 

తాజాగా అసెంబ్లీలో వైసీపీకి కనీస బలం లేకపోయినా, పీఏసీకి పోటీ పడ్డారు. కేబినెట్ హోదా ఉన్న పదవి అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అరచేతిలో వైకుంఠం చూపి నామినేషన్ దాఖలు చేయించారు. ఆ నామినేషన్ దాఖలు సమయంలోనూ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేత హై డ్రామా ఆడించారు. కనీస బలం లేని జగన్ తన పార్టీ తరఫున సీనియర్ నేతను నిలబెట్టి చివరి నిముషంలో ఓటింగ్ కు గైర్హాజరై హ్యాండిచ్చారు. ఓటింగ్ బహిష్కరణ ప్రకటన కంటే ముందే ఆయన బెంగళూరుకు చెక్కేశారు. దీంతో గత్యంతరం లేక నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పెద్దిరెడ్డిపై అన్న ఆరోపణల సంగతి పక్కన పెడితే ఆయన సీనియారిటీని కూడా ఖాతరు చేయకుండా జగన్ ఆయన పట్ల వ్యవహరించిన తీరు పట్ల వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నిజానికి  పీఏసీ ఛైర్మన్‌ పదవి పెద్దిరెడ్డి స్టేచర్ కు చాలా చాలా చిన్నది. అయితే ఆ చిన్న పదవినే ఎరగా చూపి జగన్ పెద్దిరెడ్డికి ఏదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. అంతా చేసి చివరకు అవమానించారు. జగన్ స్వయంగా ముఖం చాటేసి బెంగళూరు చెక్కేయడంతో పెద్దిరెడ్డి ఇక  అనివార్యంగా బహిష్కరణ ప్రకటన చేయాల్సి వచ్చింది.   పార్టీకి ఉన్న 18 ఓట్ల కంటే  కూడా పెద్దిరెడ్డికి తక్కువ ఓటు పడే పరిస్థితి ఉండటం కంటే అవమానం ఏముంటుంది? ఇప్పుడు ఉన్న 18 మంది ఎమ్మెల్యేలలో కొందరు ఇప్పటికే పార్టీకి, పార్టీ కార్యక్రమాలకే కాకుండా జగన్ కు కూడా దూరం జరిగారు.  ఇప్పుడు పెద్దిరెడ్డి ఎపిసోడ్ తో మరింత మంది ఎమ్మెల్యేలు జగన్ పై విశ్వాసం కోల్పోయి దూరం జరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.