షుగర్ వల్ల ఇన్ని సమస్యలొస్తాయని మీకు తెలుసా?

Publish Date:Jan 20, 2023

Advertisement

ఈమధ్య కాలంలో మధ్యవయసు కాదు కదా 30 ఏళ్ళు దాటకుండానే షుగర్ జబ్బు వచ్చేస్తోంది చాలామందికి. అయితే ఈ షుగర్ వల్ల కేవలం తీపి పదార్థాలు తినకుండా ఉండటమే కాకుండా వేరే ఇతర అనారోగ్య సమస్యలు కూడా పొంచి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే…

గ్లూకోజు పదార్థం సరిగా అందనపుడు, గుండె బలహీనమవుతుంది. అందువల్ల షుగర్ వ్యాధి క్రానిక్ అయిన వారికి గుండె జబ్బులకు దారితీసే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో పోల్చిచూస్తే, మధుమేహ రోగులకు  2 నుండి 4 రెట్లు అధికంగా గుండె జబ్బులు వస్తున్నట్లు పరిశోధనల్లో వెళ్ళడయింది. నిర్ధారించుచున్నారు. షుగర్ వ్యాధి కారకమైన వారిలో చీముకణాల సంఖ్య (పసె సెల్సు) పెరుగుట వల్ల రక్తం కలుషితమవుతుంది. చిక్కబడిపోతుంది అందువల్ల గుండె స్పందన పెరిగి, గుండెఒత్తిడి పెరిగి గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉంది. . 

మనశరీరంలోని, అదనపు షుగరును, చీము కణాలను ఎప్పటి కప్పుడు మూత్రపిండములు వడకట్టి బయటకు పంపేస్తూ ఉంటాయి. అయితే షుగర్ ఎక్కువ ఉండటం వల్ల మూత్రపిండాలకు పని ఎక్కువ అవుతుంది. దానికి తోడు శుభ్రమైన  రక్తము లేక మూత్రపిండముల కండరములు బలహీనపడతాయి. అందువల్ల మూత్రపిండ వ్యాధులు సంక్రమిస్తాయి. ఇప్పుడు లెక్కల ప్రకారం కిడ్నీ వ్యాధులతో బాధపడే వారిలో, ప్రతిముగ్గురిలో ఒకరు సుగర్ వ్యాధి పీడితులేనని తెలుస్తోంది. 

దాదాపు 15-20 సంవత్సరాల నుండి షుగర్ వ్యాధితో బాధపడేవారికి డయాబిటీస్, రేటినో అనే పార వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి వారిలో కంటిలోని రెటీనాకు సంబంధించిన, చిన్నచిన్న రక్తనాళములలో చీము కణాలు (పస్పెల్సు) చేరి పోయి ఆయానాళములు పాడైపోయి రెటీనాకు శుభ్రమైన రక్తము ప్రాణశక్తి అందక, అంధత్యము వస్తుంది.

క్రానిక్ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలామందికి కాళ్ళకు పాదములకు  కాలివ్రేళ్ళు తిమ్మిరులెక్కి స్పర్శ తెలియకుండా పోతుంది. అలాంటి స్థితిలో కాలికి ఏమి తగిలినా తెలియదు. కాలిచెప్పులు ఊడిపోయింది గూడా కొందరికీ తెలియదు. కాళ్ళు మనదేహమునకు దిగువన ఉంటాయి కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్తులకు నిర్జీవరోగ పదార్దములు చీము కణాలు హెచ్చుగా ఉంటాయి. అవన్ని  కాళ్ళలో చేరి నిలిచిపోతాయి. అందువల్ల కొందరికి కాళ్ళువాపులు-నీరు కనిపిస్తాయి. గుండె బలహీనత వల్ల చివర్లకంటా రక్తప్రవాహములు సరిగా అందవు. అక్కడ చేరిన నిర్జీవ పదార్ధములు కుళ్ళిపోయి రణాలుగా తయారై కాలిని తినేస్తాయి. అలాంటి స్థితిలో డాక్టర్లు ఆపరేషన్ చేసి కొందరికి, కాలివ్రేళ్లను  మరికొందరికి పాదములను  కొందరికి మోకాలు క్రింద వరకు మరికొందరికి తొడలవరకు కూడా తీసేస్తారు. 

షుగర్ వ్యాధిగ్రస్తులలో కొందరికి నోటిపూతగాను, గొంతు సంబంధ సమస్యలు, చిన్నప్రేగులలో తరచుగా పూతలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది, అందువల్ల నోటిలోనూ,  ప్రేగులలోనూ కడుపులో మంటలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు ఏమాత్రం పులుపు, ఉప్పు, కారములు మొదలైనవి తిన్నా విపరీతమైన మంటలు ఏర్పడతాయి. మరికొందరికైతే, పళ్ల చిగుళ్లు వాపులు వస్తాయి, అంతేకాకుండా చిగుళ్లు నొప్పులు, పళ్ళ వెంట చీము రక్తము కారడం. నోరు వాసన రావడం (పయోరియా లక్షణాలు) కొందరికైతే పళ్లు కదిలి ఊడిపోవడం వంటి సమస్యలు సంభవిస్తాయి. 

కాబట్టి షుగర్ వచ్చిందంటే దాంతోపాటు మరికొన్ని సమస్యలు వెనక వస్తున్నట్టు అని గుర్తుంచుకోండి.

                                   ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.