అనంతలో హనీ ట్రాప్ కలకలం.. లక్షల రూపా యలుదోచుకున్న ముఠా.. పోలీసులపై ఆరోపణలు

Publish Date:Apr 23, 2026

Advertisement

 

అనంతపురంలో హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. మహిళలను ఎరగా వేసి ప్రముఖులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు దోచుకుం టున్న ముఠా వ్యవహారం బయటపడింది. ఈ ఘటనలో పోలీసు శాఖకు చెందిన కొందరి పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత సంచలనం సృష్టించింది. పని ఉందంటూ మహిళలను పంపించి, బాధితులను ఏకాంత ప్రదేశాలకు రప్పించి మాట్లాడుతున్న సమయంలో ముఠా సభ్యులు అకస్మాత్తుగా దాడి చేసి... డబ్బులు డిమాండ్ చేస్తారు.

అనంతరం డబ్బులు ఇవ్వ కపోతే రేప్ కేసులు పెడతామని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.ఈ ముఠా ఇప్పటికే పలువురిని ఇలా బెదరించి లక్షలు వసూలు చేసినట్లు  సమాచారం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.10 లక్షలు, ఓ జ్యోతిష్యుడి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. బెదిరింపు లకు తట్టుకోలేక బాధితులు డబ్బులు ఇచ్చినట్లు చెబుతున్నారు.

అయితే ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో ఓ పోలీసు అధికారి సహకారం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టే బుల్ ప్రత్యక్షంగా ముఠాతో కలిసి పనిచేస్తున్నట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు ఇవ్వక పోతే పోలీసుల ద్వారా పంచాయితీ పెట్టిస్తామని బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.బాధితులు ఈ ఘటనపై అనంతపురం ఎస్పీ జగదీష్ కు బాధితులు  ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో హనీ ట్రాప్‌కు సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అదలా ఉండగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు లేడీ డాన్ రంగమ్మ సహా మరో పది మందిని అదుపులోనికి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు సీఆర్ లను వీఆర్ కు పంపించారు.  మరి కొందరు పోలీసులపై కూడా చర్యలకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
నిందితులు ఇద్దరూ చాట్ జీపీటీ సాంకేతికతను ఆశ్రయించారు. రమణమ్మ వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న ప్రాంతం, బదిలీ కోరుకుంటున్న ప్రాంత వివరాలను ఏఐకు అందించి.. తద్వారా ఆరోగ్య శాఖ జారీ చేసినట్లుగా కనిపించే అత్యంత ఖచ్చితమైన బదిలీ ఉత్తర్వుల కాపీని సృష్టించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ప్రస్తుతం 6,500 పైగా కేంద్రాలు పని చేస్తున్నాయని చెబుతోంది ప్రభుత్వం. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాపోతున్నారు రైతులు. 44 నుంచి 45 డిగ్రీల‌ ఎండల్లో రైతులు తమ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ప్లాంట్ కార్యకలాపాలను మునుపటిలా వేగవంతం చేసేందుకు అదనంగా రూ. 8,097 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపుతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఉత్పత్తి రంగంలో స్థిరత్వం, పునరుజ్జీవనాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆమోదించిన ఈ ప్రతిపాదనను.. ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది.
కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనన్న అచ్చన్నాయుడు.. . వారి కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు, ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పెట్రోల్ బంక్‌లో ఒక ఆటోకు గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆటోలో నుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే నిలిపి ఉంచిన మరో ఆటోకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరెగుతూ దట్టమైన పొగలు ఆ ప్రాంమంతా వ్యాపించాయి.
ఇది సాధారణ చోరీ ప్రయత్నమా.. అల్లరిమూకలా పనా... అన్న సందేహం రావడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఓ నలుగురు పోకిరీ యువకులు క్వాలిస్ కారులో రాత్రి వేళల్లో నగర వీధుల్లో సంచరిస్తూ షాపింగ్ మాల్స్, పెద్ద అద్దాలున్న దుకాణాలను టార్గెట్ చేసుకొని గిల్లెర్‌కు గోలీలు అమర్చి అద్దాలపై గురి పెట్టి కొట్టి పగలగొట్టి వినోదించడం అలవాటుగా మార్చుకున్నారు.
జపాన్ ప్రధానమంత్రి సనాయే టకాయిచీతో ఫోన్ లో మాట్లాడిన పెజెష్కియాన్, పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న అభద్రతకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ప్రధాన కారణమని విమర్శించారు. ఇరాన్ నౌకలపై అమెరికా పాల్పడుతున్న చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రయాణికులు వైశాఖ పూర్ణిమ వేడుకల కోసం జల్జలా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. థవాంగ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్జలా వద్ద బురదతో కూడిన ఇరుకైన రోడ్డుపై జీపు ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా వాహనం జారిపోయి లోయలోకి దూసుకెళ్లింది.
ఆర్సీబీ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వేగాన్ని తెచ్చాడు. అతనికి తోడుగా జోస్ బట్లర్ (19 బంతుల్లో 39) మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పవర్-ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు వికెట్ నష్టానికి 69 పరుగులు.
ప్రమాద సమయంలో పడవలో ఉన్న వారిలో 16 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీయగలిగారు. అయితే.. గాలి వేగం ఎక్కువగా ఉండటం, చీకటి పడటంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
మే డే(మే 1వ తేదీ) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.