ఈ ఏడాది చివరి నాటికి కర్నూలులో హైకోర్టు బెంచ్!

Publish Date:Feb 3, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు న్యాయరాజధాని అంటూ ఐదేళ్ల పాటు పిల్లిమొగ్గలు వేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ అంటూ అసలు రాజధానే లేకుండా చేసి, ప్రజాగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోయారు. అయితే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ ప్రకటించి.. రాజధాని నగర నిర్మాణానికి బాటలు వేశారు. ఆయన హయాంలో శరవేగంగా  నిర్మాణ పనులు సాగాయి. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఉద్దేశ పూర్వకంగా అమరావతిని నిర్వీర్యం చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ కొత్త డ్రామాకు తెరలేపి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టడంతో మళ్లీ రాజధాని అమరావతి  నిర్మాణ పనులు జోరందుకున్నాయి. తొలి నుంచీ రాష్టరానికి ఒకే రాజధాని, అది అమరావతే అంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు ఆ దిశగా అడుగుల వేగం పెంచారు. అదే సమయంలో విశాఖ, కర్నూలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టారు.  

ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ అన్న ఆ ప్రాంత వాసుల చిరకాల డిమాండ్ నెరవేరబోతున్నది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు   కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కర్నూలులో  హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జీల బృందం కర్నూలులో పర్యటించనుంది.  భవనం ఎంపిక తదితర అంశాలన్నీ సజావుగా పూర్తయిపోయి.. ఈ ఏడాది చివరికల్లా కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత గత ఏడాది నవంబర్ 21న కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు అసంబ్లీ తీర్మానం చేసింది. అంతకంటే ముందు హైకోర్టు శాశ్వత బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసే విషయంలో అభిప్రాయాలను తెలియజేయడానికి హైకోర్టు ఫుల్ బెంచ్ ముందు ఈ అంశాన్ని ఉంచాలని కోరుతూ రాష్ట్ర న్యాయసాఖ కార్యదర్శి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కు లేఖ రాశారు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని వేశారు.  

ఆ కమిటీ నివేదిక మేరకు ఈ ఏడాది జనవరి 29న హైకోర్టు రిజిస్ట్రార్ కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు కావలసిన సదుపాయాల గురించి వివరిస్తూ జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు.  కోర్టు కాంప్లెక్స్,  న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస వసతి, న్యాయవాదులకు వసతి సౌకర్యాల పూర్తి సమాచారాన్ని పంపాలని ఆ లేఖలో  కోరారు. ఆ లేఖపై కర్నూలు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు.  హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన లేఖలో ఉన్న విధంగా సౌకర్యాలు కల్పించేందుకు  భవనాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని  కర్నలు మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్,  ఆర్డీవోలను ఆదేశించారు. ఇప్పుడు 15 మంది న్యాయమూర్తుల బృందం హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన  స్థలాన్ని పరిశీలించేందుకు కర్నూలు రానుంది. న్యాయమూర్తుల బృందం ఈ నెల6న కర్నూలులో పర్యటించనుంది.  అన్ని సజావుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికే కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.